ఈ మధ్య తెలుగులో శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా ‘దృశ్యం-2’. మలయాళంలో పెద్దగా అంచనాల్లేకుండా తెరకెక్కి, రెండు నెలల కిందటే అమేజాన్ ప్రైమ్లో విడుదలై అద్భుత స్పందన తెచ్చుకున్న ‘దృశ్యం-2’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ‘దృశ్యం’ రీమేక్లో నటించిన వెంకటేష్, ఇతర తారాగణాన్ని పెట్టి ఒరిజినల్ డైరెక్టర్ జీతు జోసెఫ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. పక్కా ప్లానింగ్తో రంగంలోకి దిగి అటు ఇటుగా నెల రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఐతే కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మళ్లీ సంక్షోభంలో పడటంతో కొత్త సినిమాల విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ‘దృశ్యం-2’ను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని, వెంకీ దీని కంటే ముందు పూర్తి చేసిన ‘నారప్ప’ను వెనక్కి జరిపి ఈ సినిమాను ముందుకు తెస్తున్నారని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది.
ఐతే ఈ విషయమై ‘దృశ్యం-2’ నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి జరుగుతున్న ప్రచారం అబద్ధమని ఆయన తేల్చేశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘దృశ్యం-2’ థియేటర్ల కోసం సిద్ధం చేసిన సినిమా అని, పెద్ద తెర మీదే ముందు రిలీజవుతుందని, ఆ తర్వాతే ఓటీటీలోకి వస్తుందని సురేష్ స్పష్టం చేశారు. ఐతే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో మాత్రం ఆయన చెప్పలేదు.
‘దృశ్యం-2’కు ఉన్న క్రేజ్ దృష్ట్యా థియేటర్ ఆదాయాన్ని కోల్పోవడానికి సురేష్ బాబు సిద్ధంగా లేనట్లున్నారు. ఎలాగూ మలయాళ వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాలేదు కాబట్టి ఈ థ్రిల్లింగ్ మూవీని వెండి తెరపై చూపించి ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. ఐతే ఏది ముందు, ఏది తర్వాత అన్నది చెప్పలేం కానీ.. చాలా తక్కువ గ్యాప్లోనే ‘నారప్ప’, ‘దృశ్యం-2’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయన్నది మాత్రం స్పష్టం.
This post was last modified on April 23, 2021 10:38 am
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో…