ఈ మధ్య తెలుగులో శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా ‘దృశ్యం-2’. మలయాళంలో పెద్దగా అంచనాల్లేకుండా తెరకెక్కి, రెండు నెలల కిందటే అమేజాన్ ప్రైమ్లో విడుదలై అద్భుత స్పందన తెచ్చుకున్న ‘దృశ్యం-2’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ‘దృశ్యం’ రీమేక్లో నటించిన వెంకటేష్, ఇతర తారాగణాన్ని పెట్టి ఒరిజినల్ డైరెక్టర్ జీతు జోసెఫ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. పక్కా ప్లానింగ్తో రంగంలోకి దిగి అటు ఇటుగా నెల రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఐతే కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మళ్లీ సంక్షోభంలో పడటంతో కొత్త సినిమాల విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ‘దృశ్యం-2’ను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని, వెంకీ దీని కంటే ముందు పూర్తి చేసిన ‘నారప్ప’ను వెనక్కి జరిపి ఈ సినిమాను ముందుకు తెస్తున్నారని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది.
ఐతే ఈ విషయమై ‘దృశ్యం-2’ నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి జరుగుతున్న ప్రచారం అబద్ధమని ఆయన తేల్చేశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘దృశ్యం-2’ థియేటర్ల కోసం సిద్ధం చేసిన సినిమా అని, పెద్ద తెర మీదే ముందు రిలీజవుతుందని, ఆ తర్వాతే ఓటీటీలోకి వస్తుందని సురేష్ స్పష్టం చేశారు. ఐతే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో మాత్రం ఆయన చెప్పలేదు.
‘దృశ్యం-2’కు ఉన్న క్రేజ్ దృష్ట్యా థియేటర్ ఆదాయాన్ని కోల్పోవడానికి సురేష్ బాబు సిద్ధంగా లేనట్లున్నారు. ఎలాగూ మలయాళ వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాలేదు కాబట్టి ఈ థ్రిల్లింగ్ మూవీని వెండి తెరపై చూపించి ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. ఐతే ఏది ముందు, ఏది తర్వాత అన్నది చెప్పలేం కానీ.. చాలా తక్కువ గ్యాప్లోనే ‘నారప్ప’, ‘దృశ్యం-2’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయన్నది మాత్రం స్పష్టం.
This post was last modified on April 23, 2021 10:38 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…