ఈ మధ్య తెలుగులో శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా ‘దృశ్యం-2’. మలయాళంలో పెద్దగా అంచనాల్లేకుండా తెరకెక్కి, రెండు నెలల కిందటే అమేజాన్ ప్రైమ్లో విడుదలై అద్భుత స్పందన తెచ్చుకున్న ‘దృశ్యం-2’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ‘దృశ్యం’ రీమేక్లో నటించిన వెంకటేష్, ఇతర తారాగణాన్ని పెట్టి ఒరిజినల్ డైరెక్టర్ జీతు జోసెఫ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. పక్కా ప్లానింగ్తో రంగంలోకి దిగి అటు ఇటుగా నెల రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఐతే కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మళ్లీ సంక్షోభంలో పడటంతో కొత్త సినిమాల విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ‘దృశ్యం-2’ను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని, వెంకీ దీని కంటే ముందు పూర్తి చేసిన ‘నారప్ప’ను వెనక్కి జరిపి ఈ సినిమాను ముందుకు తెస్తున్నారని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది.
ఐతే ఈ విషయమై ‘దృశ్యం-2’ నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి జరుగుతున్న ప్రచారం అబద్ధమని ఆయన తేల్చేశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘దృశ్యం-2’ థియేటర్ల కోసం సిద్ధం చేసిన సినిమా అని, పెద్ద తెర మీదే ముందు రిలీజవుతుందని, ఆ తర్వాతే ఓటీటీలోకి వస్తుందని సురేష్ స్పష్టం చేశారు. ఐతే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో మాత్రం ఆయన చెప్పలేదు.
‘దృశ్యం-2’కు ఉన్న క్రేజ్ దృష్ట్యా థియేటర్ ఆదాయాన్ని కోల్పోవడానికి సురేష్ బాబు సిద్ధంగా లేనట్లున్నారు. ఎలాగూ మలయాళ వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాలేదు కాబట్టి ఈ థ్రిల్లింగ్ మూవీని వెండి తెరపై చూపించి ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. ఐతే ఏది ముందు, ఏది తర్వాత అన్నది చెప్పలేం కానీ.. చాలా తక్కువ గ్యాప్లోనే ‘నారప్ప’, ‘దృశ్యం-2’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయన్నది మాత్రం స్పష్టం.
This post was last modified on April 23, 2021 10:38 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…