ఈ మధ్య తెలుగులో శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా ‘దృశ్యం-2’. మలయాళంలో పెద్దగా అంచనాల్లేకుండా తెరకెక్కి, రెండు నెలల కిందటే అమేజాన్ ప్రైమ్లో విడుదలై అద్భుత స్పందన తెచ్చుకున్న ‘దృశ్యం-2’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ‘దృశ్యం’ రీమేక్లో నటించిన వెంకటేష్, ఇతర తారాగణాన్ని పెట్టి ఒరిజినల్ డైరెక్టర్ జీతు జోసెఫ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. పక్కా ప్లానింగ్తో రంగంలోకి దిగి అటు ఇటుగా నెల రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఐతే కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మళ్లీ సంక్షోభంలో పడటంతో కొత్త సినిమాల విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ‘దృశ్యం-2’ను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని, వెంకీ దీని కంటే ముందు పూర్తి చేసిన ‘నారప్ప’ను వెనక్కి జరిపి ఈ సినిమాను ముందుకు తెస్తున్నారని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది.
ఐతే ఈ విషయమై ‘దృశ్యం-2’ నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి జరుగుతున్న ప్రచారం అబద్ధమని ఆయన తేల్చేశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘దృశ్యం-2’ థియేటర్ల కోసం సిద్ధం చేసిన సినిమా అని, పెద్ద తెర మీదే ముందు రిలీజవుతుందని, ఆ తర్వాతే ఓటీటీలోకి వస్తుందని సురేష్ స్పష్టం చేశారు. ఐతే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో మాత్రం ఆయన చెప్పలేదు.
‘దృశ్యం-2’కు ఉన్న క్రేజ్ దృష్ట్యా థియేటర్ ఆదాయాన్ని కోల్పోవడానికి సురేష్ బాబు సిద్ధంగా లేనట్లున్నారు. ఎలాగూ మలయాళ వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాలేదు కాబట్టి ఈ థ్రిల్లింగ్ మూవీని వెండి తెరపై చూపించి ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. ఐతే ఏది ముందు, ఏది తర్వాత అన్నది చెప్పలేం కానీ.. చాలా తక్కువ గ్యాప్లోనే ‘నారప్ప’, ‘దృశ్యం-2’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయన్నది మాత్రం స్పష్టం.
This post was last modified on April 23, 2021 10:38 am
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…