Political News

పిచ్చి పీక్సుకు చేరుకుంటే ఇలాగే ఉంటుంది

పిచ్చి పీక్సుకు చేరుకుంటే ఎలాగుంటుందో వివాదాస్సద ఆధ్యాత్మిక గురువు నిత్యానందను చూస్తే చాలు అర్ధమైపోతుంది. లైంగికపరమైన కేసుల్లో అరెస్టయి, కోర్టు విచారణ జరుగుతున్నపుడే నిత్యానంద దేశం నుండి పరారయ్యారు. ఇండియాలో ఉన్నపుడు రకరకాల వేషాలతో నోటికొచ్చిన విషయాలపై మాట్లాడే ఈ గురువుకు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే శిష్యులున్నారు.

ఇలాంటి గురువు దేశంనుండి పారిపోయి ఎక్కడో ఈక్వెడార్ అనే దేశంలో తేలారు. ఈక్వెడార్ కు సమీపంలోని ఓ చిన్న దీవికి పారిపోయారు. ఆ దీవిని నిత్యానంద కొనుగోలు చేశారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ నేపధ్యంలో ఓ విచిత్రమైన ఆదేశాలను నిత్యానంద జారీచేశారు. తానుంటున్న లేదా కొనుగోలు చేసిన దీవికి కైలాస అనే పేరుపెట్టిన విషయం తెలిసిందే.

కైలాస దేశానికి ప్రత్యేక కరెన్సీ, ప్రత్యేక మిలిటరీ, ప్రత్యేక వీసా, పాసుపోర్టు లాంటి ఎన్నో ప్రత్యేకతలను ప్రకటించారు. దాంతో మనదేశంలో నిత్యానంద పెద్ద క్యామిడి స్టార్ అయిపోయారు. అలాంటి కైలాస దేశానికి మనదేశం నుండి జనాలను నిషేధించారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని తమ దేశంలోకి భారతీయులను నిషేధిస్తు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీచేయటమే పెద్ద క్యామిడి అయిపోయింది.

మనదేశమనే కాదు బ్రెజిల్, యూరోపుదేశాలు, మలేషియా లాంటి దేశాల నుండి కూడా ప్రయాణీకులను కైలాసకు రాకుండా నిషేధించినట్లు ప్రకటించటంతో నెటిజన్లు ఒకటే నవ్వుకుంటున్నారు. కైలాసియన్లు, ఎకైలాసియన్లు, తమ దేశ రాయబార కార్యాలయంతో సంబంధాలున్న వాలంటీర్లంతా క్వారంటైన్లోకి వెళ్ళిపోవాలని కూడా ఆదేశాలు జారీచేశారు నిత్యానందులవారు.

This post was last modified on April 23, 2021 10:19 am

Share
Show comments
Published by
satya

Recent Posts

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

53 mins ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

1 hour ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

2 hours ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

2 hours ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

2 hours ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

2 hours ago