Political News

పిచ్చి పీక్సుకు చేరుకుంటే ఇలాగే ఉంటుంది

పిచ్చి పీక్సుకు చేరుకుంటే ఎలాగుంటుందో వివాదాస్సద ఆధ్యాత్మిక గురువు నిత్యానందను చూస్తే చాలు అర్ధమైపోతుంది. లైంగికపరమైన కేసుల్లో అరెస్టయి, కోర్టు విచారణ జరుగుతున్నపుడే నిత్యానంద దేశం నుండి పరారయ్యారు. ఇండియాలో ఉన్నపుడు రకరకాల వేషాలతో నోటికొచ్చిన విషయాలపై మాట్లాడే ఈ గురువుకు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే శిష్యులున్నారు.

ఇలాంటి గురువు దేశంనుండి పారిపోయి ఎక్కడో ఈక్వెడార్ అనే దేశంలో తేలారు. ఈక్వెడార్ కు సమీపంలోని ఓ చిన్న దీవికి పారిపోయారు. ఆ దీవిని నిత్యానంద కొనుగోలు చేశారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ నేపధ్యంలో ఓ విచిత్రమైన ఆదేశాలను నిత్యానంద జారీచేశారు. తానుంటున్న లేదా కొనుగోలు చేసిన దీవికి కైలాస అనే పేరుపెట్టిన విషయం తెలిసిందే.

కైలాస దేశానికి ప్రత్యేక కరెన్సీ, ప్రత్యేక మిలిటరీ, ప్రత్యేక వీసా, పాసుపోర్టు లాంటి ఎన్నో ప్రత్యేకతలను ప్రకటించారు. దాంతో మనదేశంలో నిత్యానంద పెద్ద క్యామిడి స్టార్ అయిపోయారు. అలాంటి కైలాస దేశానికి మనదేశం నుండి జనాలను నిషేధించారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని తమ దేశంలోకి భారతీయులను నిషేధిస్తు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీచేయటమే పెద్ద క్యామిడి అయిపోయింది.

మనదేశమనే కాదు బ్రెజిల్, యూరోపుదేశాలు, మలేషియా లాంటి దేశాల నుండి కూడా ప్రయాణీకులను కైలాసకు రాకుండా నిషేధించినట్లు ప్రకటించటంతో నెటిజన్లు ఒకటే నవ్వుకుంటున్నారు. కైలాసియన్లు, ఎకైలాసియన్లు, తమ దేశ రాయబార కార్యాలయంతో సంబంధాలున్న వాలంటీర్లంతా క్వారంటైన్లోకి వెళ్ళిపోవాలని కూడా ఆదేశాలు జారీచేశారు నిత్యానందులవారు.

This post was last modified on April 23, 2021 10:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబు.. స్ఫూర్తి ప్రదాత

సోషల్ మీడియాలోకి మంగళవారం ఎంట్రీ ఇచ్చిన ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో చూడటానికి పెద్దగా ఏమీ…

27 minutes ago

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వొచ్చన్న బీజేపీ ఫైర్ బ్రాండ్

ఏపీ అసెంబ్లీలో వైసీపీకి నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు అన్న విషయం తెలిసిందే. కానీ, తమకు ప్రతిపక్ష…

2 hours ago

నేను ఊహించ‌లేదు: ప‌వ‌న్‌కు చంద్ర‌బాబు అభినందన‌లు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను సీఎం చంద్ర‌బాబు అభినందించారు. అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై ప్ర‌సంగించిన…

3 hours ago

పట్టుకుంటే ఊడిపోయే జుట్టు.. అసలు కారణమిదే..

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఇటీవల ఊహించని పరిణామం సంచలనం సృష్టించింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది…

4 hours ago

వైసీపీకి ప్రతిపక్ష హోదాపై తేల్చేసిన చంద్రబాబు

అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నిన్న చీకటి…

4 hours ago

అమరావతిలో హన్మన్న… బాబు, పవన్ లతో భేటీ

ఏపీకి మంగళవారం ఓ విశిష్ట అతిథి విచ్చేశారు. నేరుగా ఏపీ రాజదాని అమరావతి వచ్చిన సదరు అతిథి… ఏపీ సీఎం…

4 hours ago