Political News

పిచ్చి పీక్సుకు చేరుకుంటే ఇలాగే ఉంటుంది

పిచ్చి పీక్సుకు చేరుకుంటే ఎలాగుంటుందో వివాదాస్సద ఆధ్యాత్మిక గురువు నిత్యానందను చూస్తే చాలు అర్ధమైపోతుంది. లైంగికపరమైన కేసుల్లో అరెస్టయి, కోర్టు విచారణ జరుగుతున్నపుడే నిత్యానంద దేశం నుండి పరారయ్యారు. ఇండియాలో ఉన్నపుడు రకరకాల వేషాలతో నోటికొచ్చిన విషయాలపై మాట్లాడే ఈ గురువుకు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే శిష్యులున్నారు.

ఇలాంటి గురువు దేశంనుండి పారిపోయి ఎక్కడో ఈక్వెడార్ అనే దేశంలో తేలారు. ఈక్వెడార్ కు సమీపంలోని ఓ చిన్న దీవికి పారిపోయారు. ఆ దీవిని నిత్యానంద కొనుగోలు చేశారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ నేపధ్యంలో ఓ విచిత్రమైన ఆదేశాలను నిత్యానంద జారీచేశారు. తానుంటున్న లేదా కొనుగోలు చేసిన దీవికి కైలాస అనే పేరుపెట్టిన విషయం తెలిసిందే.

కైలాస దేశానికి ప్రత్యేక కరెన్సీ, ప్రత్యేక మిలిటరీ, ప్రత్యేక వీసా, పాసుపోర్టు లాంటి ఎన్నో ప్రత్యేకతలను ప్రకటించారు. దాంతో మనదేశంలో నిత్యానంద పెద్ద క్యామిడి స్టార్ అయిపోయారు. అలాంటి కైలాస దేశానికి మనదేశం నుండి జనాలను నిషేధించారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని తమ దేశంలోకి భారతీయులను నిషేధిస్తు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీచేయటమే పెద్ద క్యామిడి అయిపోయింది.

మనదేశమనే కాదు బ్రెజిల్, యూరోపుదేశాలు, మలేషియా లాంటి దేశాల నుండి కూడా ప్రయాణీకులను కైలాసకు రాకుండా నిషేధించినట్లు ప్రకటించటంతో నెటిజన్లు ఒకటే నవ్వుకుంటున్నారు. కైలాసియన్లు, ఎకైలాసియన్లు, తమ దేశ రాయబార కార్యాలయంతో సంబంధాలున్న వాలంటీర్లంతా క్వారంటైన్లోకి వెళ్ళిపోవాలని కూడా ఆదేశాలు జారీచేశారు నిత్యానందులవారు.

This post was last modified on April 23, 2021 10:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

38 minutes ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

2 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

5 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

5 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

5 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

6 hours ago