టాలీవుడ్లో చాలా సినిమాల షూటింగ్స్కు మళ్లీ బ్రేకులు పడుతున్నాయి. కరోనా ప్రభావం ఉండగానే ఇన్నాళ్లూ షూటింగ్ జరిగాయి. ఇప్పుడు వైరస్ ప్రభావం పెరిగింది. అయినా సరే.. జాగ్రత్తల మధ్య షూటింగ్ కొనసాగిద్దామని చూసినా పరిస్థితులు ఏమాత్రం సహకరించట్లేదు. పెద్ద ఎత్తున యూనిట్లలో కేసులు బయటపడుతుండటం, అలాగే యూనిట్లో కీలక వ్యక్తులు భయపడుతుండటంతో షూటింగ్స్ వాయిదా వేయక తప్పట్లేదు.
సర్కారు వారి పాట, ఆచార్య లాంటి భారీ చిత్రాల షూటింగ్స్ ఇటీవల ఆపేసిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే ‘రాధేశ్యామ్’ బ్యాలెన్స్ టాకీ పార్ట్ చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లూ చేశాక.. వెనకడుగు వేయక తప్పట్లేదు. సలార్, ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తున్న ప్రభాస్ అతి కష్టం మీద కొంచెం వీలు చేసుకుని ‘రాధేశ్యామ్’కు కాల్ షీట్స్ ఇచ్చాడు. పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో దాన్ని పూర్తి చేసి ఒక పనైపోయింది అనిపించాలని ప్రభాస్ అనుకున్నాడు.
కానీ ‘రాధేశ్యామ్’ షూటింగ్ అనుకున్నట్లుగా జరగలేదు. ఆగిపోయింది. ఐతే ప్రస్తుతం కొవిడ్ విజృంభణ నేపథ్యంలో హీరోయిన్ పూజా హెగ్డే తాను షూటింగ్కు రాలేనని ఖరాఖండిగా చెప్పేసిందని.. అందుకే ‘రాధేశ్యామ్’ టీం ఏమీ చేయలేకపోయిందని మీడియాలో వార్తలొచ్చాయి. ప్రభాస్ అంత పెద్ద స్టారే రెడీ అయినపుడు పూజాకు ఏమొచ్చిందంటూ కొందరు ఆమెను నిందించడం మొదలుపెట్టారు. కానీ పూజా వల్లే ‘రాధేశ్యామ్’ షూటింగ్ ఆగిందనడంలో వాస్తవం లేదని సమాచారం. ప్రభాస్ మేకప్ మ్యాన్ కరోనా బారిన పడటంతోనే షూటింగ్ మొదలుపెట్టినట్లే పెట్టి ఆపేశారని తెలిసింది.
ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. మేకప్ చాలా కీలకం. సినిమా అంతటా ఒక కంటిన్యుటీ ఉండాలి. ఇప్పటికప్పుడు వేరే మేకప్ మ్యాన్ను తీసుకోవడం కష్టమని, ఎలాగూ కరోనా ప్రభావం ఉద్ధృతంగా ఉండటంతో ఇప్పుడు షూటింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదని టీం వెనక్కి తగ్గిందట. అంతకుమించి కారణాలేవీ తెలుస్తోంది.
This post was last modified on April 21, 2021 11:53 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…