టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కొన్నేళ్లుగా తరచుగా పోలీస్/స్పెషల్ ఆఫీసర్ పాత్రలు చేస్తున్నాడు. ఆఫీసర్, వైల్డ్ డాగ్ సినిమాల్లో ఈ టైపు క్యారెక్టర్లే చేశాడు నాగ్. ఇప్పుడు ‘గరుడ వేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయబోయే చిత్రంలోనూ స్పెషల్ పోలీస్ పాత్రలో నటించనున్న సంగతి ఇప్పటికే వెల్లడించారు. ఐతే ఇప్పటిదాకా నాగ్ చేసిన పాత్రలతో పోలిస్తే ఇది కొత్తగా, చాలా పవర్ ఫుల్గా ఉంటుందని సమాచారం.
ఈ సినిమా కోసం రియల్ స్టంట్స్ చేయబోతున్నాడట నాగ్. ఇందుకోసం కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఓ కొత్త తరహా విదేశీ మార్షల్ ఆర్ట్తో పాటు కత్తి యుద్ధం సైతం నేర్చుకుంటున్నారట నాగ్. ఐతే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో విదేశాల నుంచి మాస్టర్ను పిలిపించుకోవడం.. లేదా నాగ్ అక్కడికి వెళ్లి శిక్షణ పొందడం కుదరే పని కాదు. అందుకే నాగ్ ఆన్ లైన్ క్లాసులను ఆశ్రయించాడట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ప్రవీణ్ సత్తారునే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
బ్యాంకాక్లో ఫేమస్ అయిన ఓ మార్షల్ ఆర్ట్ నిపుణుడి నుంచి నాగ్ ఆన్ లైన్ ద్వారా క్రవ్ మగా అనే యుద్ధ కళను నేర్చుకుంటున్నాడట. కొన్ని రోజులుగా ఈ క్లాసులు నడుస్తున్నాయట. ఆన్ లైన్లో అక్కడి నుంచి సూచనలిస్తుంటే.. నాగ్ ఇక్కడ ఓ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడి సాయంతో ట్రైన్ అవుతున్నాడట. అలాగే కటానా అనే కత్తి యుద్ధ కళను సైతం నాగ్ నేర్చుకుంటున్నట్లు ప్రవీణ్ వెల్లడంచాడు.
నాగ్ పోషిస్తున్నది రా ఏజెంట్ పాత్ర అని.. దేశం కోసం ఎక్కడెక్కడో గడిపి 20 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలిసేందుకు వచ్చే పాత్ర ఇదని.. ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో అటాచ్ కావడం, ఆ తర్వాత మళ్లీ ఓ ఆపరేషన్ మీద పని చేయాల్సి రావడం.. ఈ నేపథ్యంలో కథ నడుస్తుందని సమాచారం. డ్రామా, ఎమోషన్స్, థ్రిల్స్.. ఇలా అన్నీ ఉండే సినిమా ఇదని ప్రవీణ్ అంటున్నాడు. ఇందులో బాలీవుడ్ భామ గుల్ పనాగ్ నాగ్కు జోడీగా నటించబోతోంది. పవన్ కళ్యాణ్ మాజీ మిత్రుడైన శరత్ మరార్.. ఇంకో ఇద్దరు నిర్మాతలతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…