టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కొన్నేళ్లుగా తరచుగా పోలీస్/స్పెషల్ ఆఫీసర్ పాత్రలు చేస్తున్నాడు. ఆఫీసర్, వైల్డ్ డాగ్ సినిమాల్లో ఈ టైపు క్యారెక్టర్లే చేశాడు నాగ్. ఇప్పుడు ‘గరుడ వేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయబోయే చిత్రంలోనూ స్పెషల్ పోలీస్ పాత్రలో నటించనున్న సంగతి ఇప్పటికే వెల్లడించారు. ఐతే ఇప్పటిదాకా నాగ్ చేసిన పాత్రలతో పోలిస్తే ఇది కొత్తగా, చాలా పవర్ ఫుల్గా ఉంటుందని సమాచారం.
ఈ సినిమా కోసం రియల్ స్టంట్స్ చేయబోతున్నాడట నాగ్. ఇందుకోసం కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఓ కొత్త తరహా విదేశీ మార్షల్ ఆర్ట్తో పాటు కత్తి యుద్ధం సైతం నేర్చుకుంటున్నారట నాగ్. ఐతే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో విదేశాల నుంచి మాస్టర్ను పిలిపించుకోవడం.. లేదా నాగ్ అక్కడికి వెళ్లి శిక్షణ పొందడం కుదరే పని కాదు. అందుకే నాగ్ ఆన్ లైన్ క్లాసులను ఆశ్రయించాడట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ప్రవీణ్ సత్తారునే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
బ్యాంకాక్లో ఫేమస్ అయిన ఓ మార్షల్ ఆర్ట్ నిపుణుడి నుంచి నాగ్ ఆన్ లైన్ ద్వారా క్రవ్ మగా అనే యుద్ధ కళను నేర్చుకుంటున్నాడట. కొన్ని రోజులుగా ఈ క్లాసులు నడుస్తున్నాయట. ఆన్ లైన్లో అక్కడి నుంచి సూచనలిస్తుంటే.. నాగ్ ఇక్కడ ఓ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడి సాయంతో ట్రైన్ అవుతున్నాడట. అలాగే కటానా అనే కత్తి యుద్ధ కళను సైతం నాగ్ నేర్చుకుంటున్నట్లు ప్రవీణ్ వెల్లడంచాడు.
నాగ్ పోషిస్తున్నది రా ఏజెంట్ పాత్ర అని.. దేశం కోసం ఎక్కడెక్కడో గడిపి 20 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలిసేందుకు వచ్చే పాత్ర ఇదని.. ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో అటాచ్ కావడం, ఆ తర్వాత మళ్లీ ఓ ఆపరేషన్ మీద పని చేయాల్సి రావడం.. ఈ నేపథ్యంలో కథ నడుస్తుందని సమాచారం. డ్రామా, ఎమోషన్స్, థ్రిల్స్.. ఇలా అన్నీ ఉండే సినిమా ఇదని ప్రవీణ్ అంటున్నాడు. ఇందులో బాలీవుడ్ భామ గుల్ పనాగ్ నాగ్కు జోడీగా నటించబోతోంది. పవన్ కళ్యాణ్ మాజీ మిత్రుడైన శరత్ మరార్.. ఇంకో ఇద్దరు నిర్మాతలతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
This post was last modified on April 19, 2021 11:42 am
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…
ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రుతురాజ్ గైక్వాడ్కు…
నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు అయ్యారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి భారత దేశ చరిత్రలో మరిచిపోలేని దారుణం. ఆ దాడిలో 170 మందికిపైగా…
అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ సీఈఓ అనురాగ్ బాజ్పాయ్ అరెస్టయ్యారు. బోస్టన్ సమీపంలో ఉన్న వ్యభిచార గృహాల వ్యవహారంలో…