‘బిగ్ బాస్’ షోతో వచ్చే పాపులారిటీని సినిమాల వైపు సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్లు తక్కువే. తెలుగు బిగ్ బాస్ తొలి సీజన్లో విజేతగా నిలిచిన శివబాలాజీ ఏమయ్యాడో తెలియదు. అంతకుముందు అయినా అడపా దడపా సినిమాలు చేసేవాడు. కానీ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. రెండో సీజన్లో విపరీతమైన పాపులారిటీ, ఫాలోయింగ్ సంపాదించుకున్నట్లు కనిపించిన కౌశల్ పరిస్థితి ఏమైందో తెలిసిందే. అతనో పెద్ద బ్రాండ్గా మారిపోయినట్లు కలరింగ్ ఇచ్చారు కానీ.. చూస్తుండగానే లైమ్ లైట్లో లేకుండా పోయాడు. సినిమాల్లో కానీ, టీవీ షోల్లో కానీ అతను పెద్దగా కనిపించట్లేదు.
ఇక మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. ఈ షోకు రాకముందు ఉన్న స్థాయిలోనే ఉన్నాడు. కొత్తగా అయితే సినిమా అవకాశాలు పెరిగిపోలేదు. నాలుగో సీజన్లో విజేతగా నిలిచిన అభిజిత్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.
‘బిగ్ బాస్’ నాలుగు సీజన్ పూర్తయిన కొత్తలో అయితే అభిజిత్ మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోతాడని.. అతడికి అవకాశాలు తన్నుకొచ్చేయబోతున్నాయని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. టైటిల్కు దూరమైన సోహెల్, అఖిల్, దివి లాంటి వాళ్లు సినిమా అవకాశాలు అందుకున్నారు. సోహెల్ హీరోగా ఒకటికి రెండు సినిమాలు పట్టాలెక్కాయి. అఖిల్ సైతం ఇటీవలే ఓ సినిమాను మొదలుపెట్టాడు. దివికి రెండు మూడు సినిమా ఛాన్సులు వచ్చాయి.
గత సీజన్లో మిగతా బిగ్ బాస్ కంటెస్టెంట్లలో చాలామంది టీవీ షోల్లో బిజీ అయిపోయారు. ఇంతమంది పొలాల్లో మొలకలు వచ్చాయి కానీ.. అభిజిత్ పొలంలోనే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. అభిజిత్ ప్రయత్నించడం లేదా.. అతణ్ని ఎవరూ సంప్రదించడం లేదా అన్నది తెలియదు కానీ.. మొత్తానికి ‘బిగ్ బాస్’ టైటిల్ గెలిస్తే వచ్చే పాపులారిటీ తాత్కాలికమే అని, దాని వల్ల సినిమా కెరీర్ పెద్దగా పుంజుకోవడం ఏమీ ఉండదని మరోసారి స్పష్టమైంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…