Movie News

చైతూతో అనుకుంటే అఖిల్‌తో సెట్ అయిందా?


‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్లోకి అజయ్ భూపతి. రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన ఈ యువ దర్శకుడు ‘ఆర్ఎక్స్ 100’తో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా సాధించిన విజయం చూసి.. అజయ్ బిజీయెస్ట్ డైరెక్టర్లలో ఒకడైపోతాడనుకున్నారు. ఐతే రెండో సినిమా పట్టాలెక్కించడానికి అతను చాలా టైమే తీసుకున్నాడు. రకరకాల కారణాల వల్ల ‘ఆర్ఎక్స్ 100’ రిలీజైన రెండేళ్లకు కానీ రెండో సినిమా ‘మహాసముద్రం’ను అతను మొదలుపెట్టలేకపోయాడు.

శర్వానంద్-సిద్దార్థ్-అదితిరావు హైదరిల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ జోరుగానే సాగుతోంది. త్వరలోనే సినిమా పూర్తవుతుంది. ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేశారు. రెండో సినిమా విషయంలో జరిగిన ఆలస్యం.. మూడో సినిమాకు జరగకుండా అజయ్ భూపతి తెలివిగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ‘మహాసముద్రం’ పూర్తయిన వెంటనే తన తర్వాతి చిత్రాన్ని అతను మొదలుపెట్టేయనున్నాడట.

మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో అజయ్ మూడో సినిమా ఉంటుందట. ఈ సినిమాకు హీరోగా వినిపిస్తున్న పేరు ఆశ్చర్యం కలిగించేదే. అక్కినేని అఖిల్ ఇందులో కథానాయకుడిగా నటిస్తాడట. హీరోగా తొలి మూడు సినిమాలతో చేదు అనుభవాలు ఎదుర్కొన్నప్పటికీ.. అఖిల్‌కు అవకాశాలకేమీ లోటు లేదు. నాలుగో సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదల కాకుండానే.. సురేందర్ రెడ్డి లాంటి పెద్ద దర్శకుడితో ‘ఏజెంట్’ సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు. దీని తర్వాత అతను అజయ్ భూపతి సినిమాకు కమిటయ్యాడట.

ఈ దశలో పెద్ద నిర్మాణ సంస్థ, క్రేజీ డైరెక్టర్ అఖిల్‌తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారంటే విశేషమే. నిజానికి అఖిల్ అన్నయ్య నాగచైతన్యతో అజయ్ భూపతి పని చేయాల్సింది. ‘మహా సముద్రం’లో ఓ హీరోగా చైతూనే అనుకున్నాడతను. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. కానీ ఎందుకో వీళ్లిద్దరికీ సెట్ కాలేదు. ఇప్పుడు అఖిల్‌తో అజయ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

This post was last modified on April 19, 2021 11:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

2 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

5 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

6 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

8 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

8 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

9 hours ago