‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్లోకి అజయ్ భూపతి. రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన ఈ యువ దర్శకుడు ‘ఆర్ఎక్స్ 100’తో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా సాధించిన విజయం చూసి.. అజయ్ బిజీయెస్ట్ డైరెక్టర్లలో ఒకడైపోతాడనుకున్నారు. ఐతే రెండో సినిమా పట్టాలెక్కించడానికి అతను చాలా టైమే తీసుకున్నాడు. రకరకాల కారణాల వల్ల ‘ఆర్ఎక్స్ 100’ రిలీజైన రెండేళ్లకు కానీ రెండో సినిమా ‘మహాసముద్రం’ను అతను మొదలుపెట్టలేకపోయాడు.
శర్వానంద్-సిద్దార్థ్-అదితిరావు హైదరిల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ జోరుగానే సాగుతోంది. త్వరలోనే సినిమా పూర్తవుతుంది. ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేశారు. రెండో సినిమా విషయంలో జరిగిన ఆలస్యం.. మూడో సినిమాకు జరగకుండా అజయ్ భూపతి తెలివిగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ‘మహాసముద్రం’ పూర్తయిన వెంటనే తన తర్వాతి చిత్రాన్ని అతను మొదలుపెట్టేయనున్నాడట.
మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో అజయ్ మూడో సినిమా ఉంటుందట. ఈ సినిమాకు హీరోగా వినిపిస్తున్న పేరు ఆశ్చర్యం కలిగించేదే. అక్కినేని అఖిల్ ఇందులో కథానాయకుడిగా నటిస్తాడట. హీరోగా తొలి మూడు సినిమాలతో చేదు అనుభవాలు ఎదుర్కొన్నప్పటికీ.. అఖిల్కు అవకాశాలకేమీ లోటు లేదు. నాలుగో సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదల కాకుండానే.. సురేందర్ రెడ్డి లాంటి పెద్ద దర్శకుడితో ‘ఏజెంట్’ సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు. దీని తర్వాత అతను అజయ్ భూపతి సినిమాకు కమిటయ్యాడట.
ఈ దశలో పెద్ద నిర్మాణ సంస్థ, క్రేజీ డైరెక్టర్ అఖిల్తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారంటే విశేషమే. నిజానికి అఖిల్ అన్నయ్య నాగచైతన్యతో అజయ్ భూపతి పని చేయాల్సింది. ‘మహా సముద్రం’లో ఓ హీరోగా చైతూనే అనుకున్నాడతను. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. కానీ ఎందుకో వీళ్లిద్దరికీ సెట్ కాలేదు. ఇప్పుడు అఖిల్తో అజయ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
This post was last modified on April 19, 2021 11:33 am
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…