సాధారణంగా హీరోయిన్లకు పెళ్లవగానే గ్లామర్ డోస్ తగ్గించేస్తుంటారు. అంతకుముందు గ్లామర్ విందు చేసి ఉన్నప్పటికీ.. పెళ్లవ్వగానే ట్రెడిషనల్గా తయారవుతుంటారు. చాలామంది అసలు పొటో షూట్లకు దూరంగా ఉంటారు. అవి చేసినా హాట్గా కనిపించాలని అనుకోరు.
కానీ సమంత మాత్రం ఇందుకు మినహాయింపు. ఆమె పెళ్లి కాకముందు కంటే ఆ తర్వాతే గ్లామర్ డోస్ పెంచడం విశేషం. పెళ్లి తర్వాత ఇలాంటి ఫొటో షూట్లేంటి అని ఫ్యాన్స్ అభ్యంతర పెడితే.. ఆ తర్వాత మరింత డోస్ పెంచి మరీ ఫొటో షూట్లు చేసిన టిపికల్ అమ్మాయి సమంత. మధ్యలో వర్కవుట్లు మరీ ఎక్కువ చేసి సమంత ముఖంలో, ఒంట్లో గ్లో కొంచెం తగ్గినట్లు అనిపించింది కానీ.. ఈ మధ్య మళ్లీ కొంచెం ఒళ్లు చేసి ఆకర్షణీయంగా తయారైంది సామ్. తాజాగా ఆమె చేసిన ఒక ఫొటో షూట్ వావ్ అనిపిస్తోంది.
ట్రెండీ డ్రెస్సింగ్, హేర్ స్టైలింగ్ చేసుకుని ఒక బొకే పట్టుకుని సూపర్ సెక్సీగా తయారైన సమంత.. ఈ తరం యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్తో ఆకట్టుకుంటోంది ఈ ఫొటో షూట్లో. ఈ షూట్ కోసం ఆమె అంత ఆకర్షణీయమైన లొకేషన్, ప్రాపర్టీస్ కూడా ఎంచుకోలేదు. ఆకర్షణ అంతా తనలో ఉంటే లొకేషన్, ప్రాపర్టీస్తో ఇంకేం పని అన్నట్లు చాలా సింపుల్గానే కానిచ్చేశారు.
ఈ ఫొటోలు చూస్తే సమంతకు ఇప్పుడు 33 ఏళ్లు వచ్చేశాయంటే నమ్మబుద్ధి కానట్లే ఉంది. మొన్ననే ఒక యోగా ఫొటోతో సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించిన సామ్.. ఇప్పుడు తన గ్లామర్ ఎటాక్తో కుర్రాళ్ల ఫోన్లు, ల్యాప్టాపుల్లోకి వెళ్లిపోయింది. కొంచెం గ్యాప్ తర్వాత ఆమె తెలుగులో శాకుంతలం అనే భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసమే సమంత మళ్లీ కొంచెం ఒళ్లు చేసి ఆకర్షణీయంగా తయారైంది.
This post was last modified on April 19, 2021 6:46 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…