అక్కినేని నాగార్జున, రెజీనా కసాండ్రా కలయికలో ఇప్పుడేం సినిమా తెరకెక్కుతోంది.. వీళ్లిద్దరూ అన్నా చెల్లెళ్లుగా నటించే చిత్రమేది అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే వాళ్లిద్దరూ అన్నా చెల్లెళ్లుగా నటించిన మాట వాస్తవమే కానీ.. అది సినిమా కోసం కాదులెండి. ఓ యాడ్ కోసం. నాగార్జున దీర్ఘ కాలంగా బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్న కళ్యాణ్ జువెలర్స్ కోసం కొత్తగా ఒక యాడ్ చేశాడు. అందులో నాగ్ చెల్లెలిగా రెజీనా నటించడం విశేషం.
ఇదే యాడ్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన సతీమణి జయ బచ్చన్ సైతం కనిపించారు. ఇంట్లో పెళ్లి జరుగుతుంటే తన గుండెల మీద పెరిగిన చెల్లెలు అత్తారింటికి వెళ్లిపోతోందే అని వేదన చెందే అన్నయ్యగా నాగ్.. బాధ పడకు, ఎప్పుడూ నవ్వుతూ ఉండమని చెప్పే చెల్లెలిగా రెజీనా కనిపించారు. బ్యాగ్రౌండ్లో ఒక ఎమోషనల్ సాంగ్ కూడా పెట్టారు ఈ ప్రకటనలో.
అమితాబ్ సైతం ఉండటంతో ప్రకటనను చాలా రిచ్గానే తీర్చిదిద్దారు. కళ్యాణ్ జువెలర్స్ ఆరంభం నుంచి ఆ సంస్థతో కొనసాగుతున్నాడు నాగ్. ఆ సంస్థకు పేరు తెచ్చిందే నాగ్. ఆయన ప్రకటనల వల్ల మంచి పాపులారిటీనే వచ్చింది. మొదట్లో ఆ యాడ్స్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయి. ఈ సంస్థలో ఆయనకు వాటాలు కూడా ఉన్నాయంటారు. సినిమాల విషయానికొస్తే ఇటీవలే వైల్డ్ డాగ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగ్. ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. బాలీవుడ్లో బ్రహ్మాస్త్రను పూర్తి చేశాడు. త్వరలోనే బంగార్రాజు చిత్రాన్ని మొదలుపెట్టే యోచనలో నాగ్ ఉన్నాడు.
This post was last modified on April 18, 2021 7:06 am
గత నెల మకుటం అనే సినిమా విడుదలయ్యిందనే సంగతి హార్డ్ కోర్ మూవీ ఫాలోయర్స్ కి తప్ప సామాన్య ప్రేక్షకులకు…
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల నాని (57) కన్నుమూశారు. నానికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను…
నిర్మాత నాగవంశీ ఈ మధ్య మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అఖిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ లెనిన్…
మొన్న గురువారం విడుదలైన సినిమాల్లో మారెమ్మ కూడా ఉంది. మాములుగా అయితే స్టార్ కాస్టింగ్ లేని ఇలాంటి మూవీని జనం…
ఒక హిట్ మూవీకి కొనసాగింపు ఉండాలనుకోవడం మంచిదే. కథ డిమాండ్ చేసినప్పుడు, దానికి అనుగుణంగా దర్శకులు తమ క్రియేటివిటీని జోడించి,…
రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడింది. బీజేపీ కంచుకోటల్లో…