అక్కినేని నాగార్జున, రెజీనా కసాండ్రా కలయికలో ఇప్పుడేం సినిమా తెరకెక్కుతోంది.. వీళ్లిద్దరూ అన్నా చెల్లెళ్లుగా నటించే చిత్రమేది అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే వాళ్లిద్దరూ అన్నా చెల్లెళ్లుగా నటించిన మాట వాస్తవమే కానీ.. అది సినిమా కోసం కాదులెండి. ఓ యాడ్ కోసం. నాగార్జున దీర్ఘ కాలంగా బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్న కళ్యాణ్ జువెలర్స్ కోసం కొత్తగా ఒక యాడ్ చేశాడు. అందులో నాగ్ చెల్లెలిగా రెజీనా నటించడం విశేషం.
ఇదే యాడ్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన సతీమణి జయ బచ్చన్ సైతం కనిపించారు. ఇంట్లో పెళ్లి జరుగుతుంటే తన గుండెల మీద పెరిగిన చెల్లెలు అత్తారింటికి వెళ్లిపోతోందే అని వేదన చెందే అన్నయ్యగా నాగ్.. బాధ పడకు, ఎప్పుడూ నవ్వుతూ ఉండమని చెప్పే చెల్లెలిగా రెజీనా కనిపించారు. బ్యాగ్రౌండ్లో ఒక ఎమోషనల్ సాంగ్ కూడా పెట్టారు ఈ ప్రకటనలో.
అమితాబ్ సైతం ఉండటంతో ప్రకటనను చాలా రిచ్గానే తీర్చిదిద్దారు. కళ్యాణ్ జువెలర్స్ ఆరంభం నుంచి ఆ సంస్థతో కొనసాగుతున్నాడు నాగ్. ఆ సంస్థకు పేరు తెచ్చిందే నాగ్. ఆయన ప్రకటనల వల్ల మంచి పాపులారిటీనే వచ్చింది. మొదట్లో ఆ యాడ్స్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయి. ఈ సంస్థలో ఆయనకు వాటాలు కూడా ఉన్నాయంటారు. సినిమాల విషయానికొస్తే ఇటీవలే వైల్డ్ డాగ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగ్. ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. బాలీవుడ్లో బ్రహ్మాస్త్రను పూర్తి చేశాడు. త్వరలోనే బంగార్రాజు చిత్రాన్ని మొదలుపెట్టే యోచనలో నాగ్ ఉన్నాడు.
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…