నందమూరి బాలకృష్ణ, రవితేజల మధ్య ఏదో వ్యక్తిగత వివాదం ఉందని అప్పట్లో ఒక ప్రచారం నడిచింది. అదెంత వరకు నిజమో కానీ.. వ్యక్తిగతంగా ఇద్దరూ ఎప్పుడూ కలిసి కనిపించరు. బాక్సాఫీస్ దగ్గర మాత్రం వీరి మధ్య ఎప్పట్నుంచో వార్ నడుస్తోంది. రవితేజతో పోలిస్తే బాలయ్యే పెద్ద స్టార్ కానీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం రవితేజదే పైచేయి. ఇంతకుముందు నందమూరి హీరోకు పోటీగా దిగిన ప్రతిసారీ మాస్ రాజా తన సినిమాతో పైచేయి సాధించాడు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో వీరి మధ్య పోరు ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
బాలయ్య కొత్త చిత్రం ‘అఖండ’ను మే 28న రిలీజ్ చేయడానికి నిర్ణయించగా.. అదే రోజు రవితేజ సినిమా ‘ఖిలాడి’ని షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ముందు డేట్లు ఇచ్చేశారు కానీ.. వీటిలో ఏదో ఒక సినిమా తప్పుకుంటుందేమో అనుకున్నారు. అందులోనూ ఈ మధ్య కరోనా విజృంభణ నేపథ్యంలో రెండు సినిమాలూ అనుకున్న తేదీకి రావడం డౌటే అన్న అభిప్రాయాలు కలిగాయి.
కానీ ఇటు ‘అఖండ’ టీం కానీ.. అటు ‘ఖిలాడి’ బృందం కానీ తమ సినిమాను వాయిదా వేసే ఆలోచన ఎంతమాత్రం చేయట్లేదట. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఏప్రిల్లో రావాల్సిన మూడు పేరున్న సినిమాలు వాయిదా పడిపోయాయి. మే 13కు షెడ్యూల్ అయిన ‘ఆచార్య’ సైతం వెనక్కి వెళ్తుందంటున్నారు. కానీ అఖండ, ఖిలాడి సినిమాలు మాత్రం వాయిదా పడే ఛాన్సే లేదని ఆయా చిత్ర బృందాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాల చిత్రీకరణ చివరి దశలో ఉంది. రాబోయే కొన్ని రోజుల్లో అవి పూర్తవుతాయని.. నెమ్మదిగా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని మే 28కి కచ్చితంగా తమ సినిమాలను తీసుకురావాలని ఆ సినిమాల నిర్మాతలు చూస్తున్నారు.
ఇటీవలే రిలీజైన ఈ రెండు సినిమాల టీజర్లూ ఆకట్టుకున్నాయి. అంచనాల్ని పెంచాయి. ఎవరికి వారు తమ సినిమాపై ధీమాగా ఉన్నారు. పోటీ గురించి ఆలోచించట్లేదు. ఈసారి ఎలాగైనా రవితేజను దెబ్బ కొట్టాలనే పంతంతో బాలయ్య ఉండగా.. బాలయ్యపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని మాస్ రాజా చూస్తున్నాడు. మరి మే 28న ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on April 17, 2021 4:41 pm
ఒక చిన్న వేడుక చేయడానికే కనీసం లక్ష రూపాయలు ఖర్చయ్యే సొసైటీలో ఉన్నాం మనం. అలాంటిది కేవలం రెండు నుంచి…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ధర్మన్ షూటింగ్ మంచి ఊపు మీద ఉంది. ఇప్పటికే…
ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు వస్తున్నారు. ఇరవై, పాతిక వయసు ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. కానీ వాటిని ఎంచుకోవడం,…
రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వాహణపై ప్రతిపక్ష వైసీపీ రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా…
దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో కుటుంబాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ…
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటిసారి కలిసి చేస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. దీని మీద మంచి…