నందమూరి బాలకృష్ణ, రవితేజల మధ్య ఏదో వ్యక్తిగత వివాదం ఉందని అప్పట్లో ఒక ప్రచారం నడిచింది. అదెంత వరకు నిజమో కానీ.. వ్యక్తిగతంగా ఇద్దరూ ఎప్పుడూ కలిసి కనిపించరు. బాక్సాఫీస్ దగ్గర మాత్రం వీరి మధ్య ఎప్పట్నుంచో వార్ నడుస్తోంది. రవితేజతో పోలిస్తే బాలయ్యే పెద్ద స్టార్ కానీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం రవితేజదే పైచేయి. ఇంతకుముందు నందమూరి హీరోకు పోటీగా దిగిన ప్రతిసారీ మాస్ రాజా తన సినిమాతో పైచేయి సాధించాడు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో వీరి మధ్య పోరు ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
బాలయ్య కొత్త చిత్రం ‘అఖండ’ను మే 28న రిలీజ్ చేయడానికి నిర్ణయించగా.. అదే రోజు రవితేజ సినిమా ‘ఖిలాడి’ని షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ముందు డేట్లు ఇచ్చేశారు కానీ.. వీటిలో ఏదో ఒక సినిమా తప్పుకుంటుందేమో అనుకున్నారు. అందులోనూ ఈ మధ్య కరోనా విజృంభణ నేపథ్యంలో రెండు సినిమాలూ అనుకున్న తేదీకి రావడం డౌటే అన్న అభిప్రాయాలు కలిగాయి.
కానీ ఇటు ‘అఖండ’ టీం కానీ.. అటు ‘ఖిలాడి’ బృందం కానీ తమ సినిమాను వాయిదా వేసే ఆలోచన ఎంతమాత్రం చేయట్లేదట. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఏప్రిల్లో రావాల్సిన మూడు పేరున్న సినిమాలు వాయిదా పడిపోయాయి. మే 13కు షెడ్యూల్ అయిన ‘ఆచార్య’ సైతం వెనక్కి వెళ్తుందంటున్నారు. కానీ అఖండ, ఖిలాడి సినిమాలు మాత్రం వాయిదా పడే ఛాన్సే లేదని ఆయా చిత్ర బృందాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాల చిత్రీకరణ చివరి దశలో ఉంది. రాబోయే కొన్ని రోజుల్లో అవి పూర్తవుతాయని.. నెమ్మదిగా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని మే 28కి కచ్చితంగా తమ సినిమాలను తీసుకురావాలని ఆ సినిమాల నిర్మాతలు చూస్తున్నారు.
ఇటీవలే రిలీజైన ఈ రెండు సినిమాల టీజర్లూ ఆకట్టుకున్నాయి. అంచనాల్ని పెంచాయి. ఎవరికి వారు తమ సినిమాపై ధీమాగా ఉన్నారు. పోటీ గురించి ఆలోచించట్లేదు. ఈసారి ఎలాగైనా రవితేజను దెబ్బ కొట్టాలనే పంతంతో బాలయ్య ఉండగా.. బాలయ్యపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని మాస్ రాజా చూస్తున్నాడు. మరి మే 28న ఏం జరుగుతుందో చూడాలి.
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…