తమిళ కమెడియన్ వివేక్ కొన్ని రోజుల కిందటే హుషారుగా షూటింగ్లో పాల్గొన్నాడు. మొన్నటిదాకా సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉన్నాడు. అందరూ కరోనాకు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించాడు. తాను కూడా అందుకు సిద్ధమయ్యాడు. కానీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతి రోజే ఆరోగ్యం విషమించింది. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కొన్ని గంటలకే తుది శ్వాస విడిచాడు. ఉన్నట్లుండి వివేక్ పరిస్థితి ఎందుకు విషమించింది.. ఇందుక్కారణం వ్యాక్సిన్ వేసుకోవడమేనా అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరినీ తొలిచివేస్తున్నాయి.
వివేక్కు చికిత్స అందించిన ఆసుపత్రి శనివారం రాత్రి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో.. వివేక్కు గుండెపోటు రావడానికి, వ్యాక్సినేషన్కు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఐతే వ్యాక్సిన్ పట్ల జనాల్లో వ్యతిరేకత ఏర్పడుతుందేమో అన్న అనుమానాలతోనే ఇలా ప్రెస్ నోట ఇప్పించారేమో అన్న సందేహాలు కలిగాయి.
తమిళ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ అయితే.. వివేక్ మృతికి వ్యాక్సినేషనే కారణమని తేల్చేశాడు. అధికార వర్గాలను నిందిస్తూ ఉద్వేగానికి గురయ్యాడు. కానీ టీకా వేసుకోవడం వల్ల జ్వరం, దద్దుర్లు, కాళ్ల వాపు లాంటి లక్షణాలు రావడం మామూలే. కానీ ప్రాణాపాయం తలెత్తిన సందర్భాలు అరుదు. పైగా గుండె పోటుకు దారితీసిన కేసులు దాదాపు లేవు.
వివేక్ మృతి పట్ల అనేక అనుమానాలు తలెత్తడం, సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుండటంతో తమిళనాడు హెల్త్ సెక్రటరీ మీడియా ముందుకు వచ్చారు. వివేక్ గుండె వాల్వ్లు వంద శాతం మూసుకుపోయాయని.. ఒక్క రోజులో ఇలా జరగదని.. వ్యాక్సిన్కు, ఇలా వాల్వ్లు మూసుకుపోవడానికి అసలు సంబంధం లేదని.. వివేక్ తన గుండె విషయంలో జాగ్రత్త పడకపోవడం వల్లే ఆయన ప్రాణాలు పోయాయని స్పష్టం చేశారు. వివేక్ వ్యాక్సినేషన్ చేయించుకున్న అదే ఆసుపత్రిలో శుక్రవారం వందల మంది టీకా వేసుకున్నారని.. వాళ్లెవ్వరికీ ఎలాంటి ఇబ్బందులూ రాలేదని.. కాబట్టి వ్యాక్సిన్ పట్ల జనాల్లో భయం పెంచడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
This post was last modified on April 17, 2021 4:33 pm
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…