సెలబ్రెటీల జీవితం పూల పాన్పు లాంటిది అనుకుంటాం కానీ.. ఆ హోదాలో కొనసాగడంలో కొన్ని ఇబ్బందులూ ఉంటాయి. ఈ సోషల్ మీడియా కాలంలో సినీ ప్రముఖులను, ముఖ్యంగా లేడీ సెలబ్రెటీలను టార్గెట్ చేయడం అన్నది మామూలు విషయంగా మారిపోయిన నేపథ్యంలో సున్నిత మనస్కులైతే ఈ ధాటిని తట్టుకోవడం కష్టమే. తాను చాలాసార్లు ఇలాంటివి పట్టించుకోనప్పటికీ.. కొన్నిసార్లు మాత్రం సోషల్ మీడియా కామెంట్లకు తట్టుకోలేకపోతుంటానని అంటోంది యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్.
సెలబ్రెటీగా పేరు తెచ్చుకున్నాక కూడా తాను ఎన్నో సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్నట్లు అనసూయ వెల్లడించింది. సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయిన సందర్భాల్లో తాను డిప్రెషన్కు గురైనట్లు ఆమె తెలిపింది. ఓసారి తనకు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయని.. కానీ ఏమైందో ఏమో కొన్ని రోజులకే ఆ అవకాశాలన్నీ చేజారిపోయాయని.. అలాంటి సమయంలో భర్త దగ్గర కూర్చుని బాగా ఏడ్చేసేదాన్నని అనసూయ చెప్పింది. తాను ధరించే దుస్తులపై ఎన్నో సందర్భాల్లో నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేశారని.. కొన్నిసార్లు మాత్రం అవి చాలా బాధిస్తుంటాయని ఆమె అంది.
ఒక సందర్భంలో తన పెద్ద కొడుకు సైతం తాను వెస్ట్రన్, షార్ట్ డ్రెస్లు వేస్తే బాగా లేదని, పొడవాటి దుస్తులు వేసుకోవాలని చెబుతుంటాడని, ఇలాంటి మాటలు వింటే ఏదోలా ఉంటుందని అనసూయ చెప్పింది. తాను ఎక్కువ బాధ పడ్డ సందర్భాల్లో రాత్రి పూట అప్పుడప్పుడూ వైన్ తాగుతుంటానని అనసూయ చెప్పింది. ఇటీవలే ‘చావు కబురు చల్లగా’ సినిమాలో పైన పటారం లోన లొటారం అంటూ ఓ ఐటెం సాంగ్ చేసిన అనసూయ.. ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఎప్పట్లాగే బుల్లితెరపై జబర్దస్త్ సహా చాలా షోలు చేస్తోంది.
This post was last modified on April 17, 2021 11:49 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…