సెలబ్రెటీల జీవితం పూల పాన్పు లాంటిది అనుకుంటాం కానీ.. ఆ హోదాలో కొనసాగడంలో కొన్ని ఇబ్బందులూ ఉంటాయి. ఈ సోషల్ మీడియా కాలంలో సినీ ప్రముఖులను, ముఖ్యంగా లేడీ సెలబ్రెటీలను టార్గెట్ చేయడం అన్నది మామూలు విషయంగా మారిపోయిన నేపథ్యంలో సున్నిత మనస్కులైతే ఈ ధాటిని తట్టుకోవడం కష్టమే. తాను చాలాసార్లు ఇలాంటివి పట్టించుకోనప్పటికీ.. కొన్నిసార్లు మాత్రం సోషల్ మీడియా కామెంట్లకు తట్టుకోలేకపోతుంటానని అంటోంది యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్.
సెలబ్రెటీగా పేరు తెచ్చుకున్నాక కూడా తాను ఎన్నో సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్నట్లు అనసూయ వెల్లడించింది. సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయిన సందర్భాల్లో తాను డిప్రెషన్కు గురైనట్లు ఆమె తెలిపింది. ఓసారి తనకు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయని.. కానీ ఏమైందో ఏమో కొన్ని రోజులకే ఆ అవకాశాలన్నీ చేజారిపోయాయని.. అలాంటి సమయంలో భర్త దగ్గర కూర్చుని బాగా ఏడ్చేసేదాన్నని అనసూయ చెప్పింది. తాను ధరించే దుస్తులపై ఎన్నో సందర్భాల్లో నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేశారని.. కొన్నిసార్లు మాత్రం అవి చాలా బాధిస్తుంటాయని ఆమె అంది.
ఒక సందర్భంలో తన పెద్ద కొడుకు సైతం తాను వెస్ట్రన్, షార్ట్ డ్రెస్లు వేస్తే బాగా లేదని, పొడవాటి దుస్తులు వేసుకోవాలని చెబుతుంటాడని, ఇలాంటి మాటలు వింటే ఏదోలా ఉంటుందని అనసూయ చెప్పింది. తాను ఎక్కువ బాధ పడ్డ సందర్భాల్లో రాత్రి పూట అప్పుడప్పుడూ వైన్ తాగుతుంటానని అనసూయ చెప్పింది. ఇటీవలే ‘చావు కబురు చల్లగా’ సినిమాలో పైన పటారం లోన లొటారం అంటూ ఓ ఐటెం సాంగ్ చేసిన అనసూయ.. ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఎప్పట్లాగే బుల్లితెరపై జబర్దస్త్ సహా చాలా షోలు చేస్తోంది.
This post was last modified on April 17, 2021 11:49 am
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…