Movie News

అనసూయ డ్రెస్‌పై కొడుకు కామెంట్

సెలబ్రెటీల జీవితం పూల పాన్పు లాంటిది అనుకుంటాం కానీ.. ఆ హోదాలో కొనసాగడంలో కొన్ని ఇబ్బందులూ ఉంటాయి. ఈ సోషల్ మీడియా కాలంలో సినీ ప్రముఖులను, ముఖ్యంగా లేడీ సెలబ్రెటీలను టార్గెట్ చేయడం అన్నది మామూలు విషయంగా మారిపోయిన నేపథ్యంలో సున్నిత మనస్కులైతే ఈ ధాటిని తట్టుకోవడం కష్టమే. తాను చాలాసార్లు ఇలాంటివి పట్టించుకోనప్పటికీ.. కొన్నిసార్లు మాత్రం సోషల్ మీడియా కామెంట్లకు తట్టుకోలేకపోతుంటానని అంటోంది యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్.

సెలబ్రెటీగా పేరు తెచ్చుకున్నాక కూడా తాను ఎన్నో సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్నట్లు అనసూయ వెల్లడించింది. సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయిన సందర్భాల్లో తాను డిప్రెషన్‌కు గురైనట్లు ఆమె తెలిపింది. ఓసారి తనకు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయని.. కానీ ఏమైందో ఏమో కొన్ని రోజులకే ఆ అవకాశాలన్నీ చేజారిపోయాయని.. అలాంటి సమయంలో భర్త దగ్గర కూర్చుని బాగా ఏడ్చేసేదాన్నని అనసూయ చెప్పింది. తాను ధరించే దుస్తులపై ఎన్నో సందర్భాల్లో నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేశారని.. కొన్నిసార్లు మాత్రం అవి చాలా బాధిస్తుంటాయని ఆమె అంది.

ఒక సందర్భంలో తన పెద్ద కొడుకు సైతం తాను వెస్ట్రన్, షార్ట్ డ్రెస్‌లు వేస్తే బాగా లేదని, పొడవాటి దుస్తులు వేసుకోవాలని చెబుతుంటాడని, ఇలాంటి మాటలు వింటే ఏదోలా ఉంటుందని అనసూయ చెప్పింది. తాను ఎక్కువ బాధ పడ్డ సందర్భాల్లో రాత్రి పూట అప్పుడప్పుడూ వైన్ తాగుతుంటానని అనసూయ చెప్పింది. ఇటీవలే ‘చావు కబురు చల్లగా’ సినిమాలో పైన పటారం లోన లొటారం అంటూ ఓ ఐటెం సాంగ్ చేసిన అనసూయ.. ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఎప్పట్లాగే బుల్లితెరపై జబర్దస్త్ సహా చాలా షోలు చేస్తోంది.

This post was last modified on April 17, 2021 11:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

56 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

4 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

5 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

5 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

6 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago