టాలీవుడ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన భామ హన్సిక మొత్వాని. ‘దేశముదురు’ లాంటి బ్లాక్బస్టర్ మూవీతో కథానాయికగా పరిచయం అయిన హన్సిక.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, రామ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఆపై తమిళంలోకి వెళ్లి విజయ్, సూర్య, విశాల్, శింబు లాంటి పెద్ద హీరోలతో నటించింది. తెలుగులో ఆమె కెరీర్ దెబ్బ తిన్నప్పటికీ.. తమిళంలో మాత్రం ఆమెకు ఢోకా లేకపోయింది.
గత కొన్నేళ్లలో కొంచెం జోరు తగ్గినప్పటికీ.. ఇప్పటికీ అవకాశాలకేమీ లోటు లేదు. కాకపోతే ఒకప్పటిలా పెద్ద సినిమాలు మాత్రం చేతిలో లేవు. స్టార్ల సరసన కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో హన్సిక ప్రయోగాత్మక చిత్రాల వైపు అడుగులు వేస్తోంది. ఇందులో కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఉన్నాయి. తాజాగా ఆమె ఒక వినూత్నమైన చిత్రాన్ని అంగీకరించింది. ఇండియన్ స్క్రీన్ మీద ఇంతవరకు రాని తరహా సినిమా అట ఇది.
ఒకే క్యారెక్టర్.. ఆ క్యారెక్టర్ మీద సింగిల్ షాట్లో తీయబోయే సినిమాలో హన్సిక నటించబోతుండటం విశేషం. ఆ సినిమా పేరు.. 105 మినిట్స్. రాజు దుస్సా అనే కొత్త దర్శకుడు రూపొందించనున్న ఈ చిత్రాన్ని రుద్రాన్ష్ సెల్యులాయిడ్ బేనర్ మీద బొమ్మక్ శివ నిర్మిస్తున్నాడు. ఇందులో హన్సిక తప్ప వేరే నటీనటులు ఉండరు. కాన్సెప్ట్ బేస్డ్గా తెరకెక్కే ఈ చిత్రానికి ఎడిటింగ్ ఏమీ లేకుండా.. కంటిన్యుటీతో ఒకే షాట్తో కథ మొత్తం చెప్పేస్తారట. ఇలాంటి ప్రయోగం ఇండియాలో ఇంత వరకు ఎవ్వరూ చేయలేదట. వినడానికైతే ఆసక్తికరంగా అనిపిస్తున్న ఈ కాన్సెప్ట్ను ఎలా తీర్చిదిద్దుతారో చూడాలి. ఇలాంటి సినిమాలో హన్సిక లాంటి స్టార్ హీరోయిన్ నటించడం విశేషమే.
ఇక హన్సిక కెరీర్ విషయానికి వస్తే.. ఆమె ప్రధాన పాత్రలో ‘మహా’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కింది. ఇందులో ఆమె వయొలెంట్ క్యారెక్టర్ చేసింది. తెలుగులో చివరగా హన్సిక.. సందీప్ కిషన్ సరసన ‘తెనాలి రామకృష్ణ’లో నటించింది.
This post was last modified on April 17, 2021 12:35 pm
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…