తమిళ లెజెండరీ కమెడియన్లలో ఒకరైన వివేక్ గుండె పోటుకు గురై ఆసుపత్రి పాలవడం ఆయన అభిమానులను కలవర పరుస్తోంది. ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. వివేక్కు కొంచెం తీవ్ర స్థాయిలోనే గుండె పోటు వచ్చినట్లు చెబుతున్నారు. ఆయన గురువారమే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. టీకా వేసుకున్నాక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మామూలే. కొందరికి జ్వరం వస్తుంది. కాళ్లల్లో వాపు, దద్దుర్లు లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
ఐతే గుండెపోటు రావచ్చన్న సంకేతాలు అయితే వ్యాక్సిన్ మార్గదర్శకాల్లో కనిపించవు. మరి వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే వివేక్ గుండెపోటుకు గురయ్యాడా అన్నది చెప్పలేం. ఏదేమైనా ఆయన త్వరగా కోలుకుని మామూలు మనిషి కావాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
వివేక్ ఒకప్పుడు ఒక దశాబ్దం పాటు తమిళ సినిమాను ఏలాడు. గౌండ్రమణి, వడివేలు లాంటి కమెడియన్ల హవా తగ్గాక 90ల చివర్లో వివేక్ జోరు మొదలైంది. ఆ టైంలో ప్రతి పేరున్న సినిమాలోనూ వివేక్ కనిపించేవాడు. తనదైన టైమింగ్తో ఆయన మామూలుగా నవ్వించలేదు. డబ్బింగ్ సినిమాల ద్వారా వివేక్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. సినిమాల్లో ఎంతో హడావుడి చేస్తూ నవ్వించే వివేక్.. బయట మాత్రం చాలా సీరియస్గా ఉంటారు. ఆయన జీవితంలో ఓ పెద్ద విషాదం కూడా ఉంది. కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో ఆయన కొడుకు చనిపోవడంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు.
అంతకుముందున్న కమెడియన్లను వివేక్ వెనక్కి నెట్టినట్లే.. ఓ దశాబ్దం పాటు వివేక్ హవా నడిచాక.. ఆయన్ని వెనక్కి నెట్టి సంతానం టాప్ కమెడియన్ స్థానాన్ని ఆక్రమించాడు. ఈ మధ్య వివేక్ మళ్లీ కొన్ని అవకాశాలు అందుకుని అడపదడపా సినిమాలు చేస్తున్నాడు.
ది రాజా సాబ్ తర్వాత దాన్ని మర్చిపోయే సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. వాళ్ళు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులు తెలుగువాళ్లే. ఆర్య తీసిన సుకుమార్,…
రష్యా నుంచి ముడి చమురు (ఆయిల్) కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రష్యా…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో సతమతం…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…