పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డుల మోత మోగిపోవాల్సిందే. ఎప్పుడో ఏడేళ్ల కిందట చివరగా పవన్ సినిమా ‘అత్తారింటికి దారేది’కి పాజిటివ్ టాక్ వచ్చింది. అప్పుడా సినిమా టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టేసి ఆల్ టైం ఇండస్ట్రీ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిన తెలిసిందే. ఐతే ఆ తర్వాత పవన్ సినిమా దేనికీ పాజిటివ్ టాక్ రాలేదు. వస్తే పవన్ తన రికార్డులనే కాదు.. వేరే రికార్డులను కూడా బద్దలు కొట్టేసేవాడేమో.
సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి.. ఇలా పవన్ నుంచి వచ్చిన మూడు సినిమాలకూ నెగెటివ్ టాకే వచ్చింది. అవి మూడూ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లుగా నిలిచాయి. ఐతే ఇప్పుడు వాటితో పోలిస్తే తక్కువ అంచనాలతో వచ్చిన ‘వకీల్ సాబ్’ మాత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ను, ఏపీలో టికెట్ల రేట్ల నియంత్రణను తట్టుకుని మరీ ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. వీకెండ్లో పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన ‘వకీల్ సాబ్’.. రూ.100 కోట్ల షేర్ దిశగా పరుగులు పెడుతోంది.
ఈ క్రమంలో పవన్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ని ‘వకీల్ సాబ్’ దాటేసింది. బుధవారం ‘వకీల్ సాబ్’ రూ.80 కోట్ల షేర్ మార్కును దాటేసినట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. ‘అత్తారింటికి దారేది’ అప్పట్లో రూ.80 కోట్ల దాకా షేర్ రాబట్టింది. అప్పటికది చాలా పెద్ద ఫిగర్. పవన్ ఆ తర్వాత చేసిన సినిమాలు దీన్ని మించి బిజినెస్ చేశాయి. వాటికి మంచి టాక్ వస్తే ‘అత్తారింటికి దారేది’ రికార్డు ఎప్పుడో బద్దలయ్యేది. కానీ అవన్నీ డిజాస్టర్లు కావడంతో పవన్ హైయెస్ట్ గ్రాసర్గా మొన్నటి వరకు ‘అత్తారింటికి దారేది’నే కొనసాగింది.
ఎట్టకేలకు ఆ రికార్డును ‘వకీల్ సాబ్’ బద్దలు కొట్టేసింది. వీక్ డేస్లోనూ బలంగా సాగుతున్న ‘వకీల్ సాబ్’కు కొత్త సినిమాల నుంచి పోటీ కూడా లేదు. ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ పవన్ కెరీర్లో తొలి రూ.100 కోట్ల షేర్ మూవీగా నిలవడం లాంఛనమే అనిపిస్తోంది.
This post was last modified on April 15, 2021 6:11 pm
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…