పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డుల మోత మోగిపోవాల్సిందే. ఎప్పుడో ఏడేళ్ల కిందట చివరగా పవన్ సినిమా ‘అత్తారింటికి దారేది’కి పాజిటివ్ టాక్ వచ్చింది. అప్పుడా సినిమా టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టేసి ఆల్ టైం ఇండస్ట్రీ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిన తెలిసిందే. ఐతే ఆ తర్వాత పవన్ సినిమా దేనికీ పాజిటివ్ టాక్ రాలేదు. వస్తే పవన్ తన రికార్డులనే కాదు.. వేరే రికార్డులను కూడా బద్దలు కొట్టేసేవాడేమో.
సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి.. ఇలా పవన్ నుంచి వచ్చిన మూడు సినిమాలకూ నెగెటివ్ టాకే వచ్చింది. అవి మూడూ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లుగా నిలిచాయి. ఐతే ఇప్పుడు వాటితో పోలిస్తే తక్కువ అంచనాలతో వచ్చిన ‘వకీల్ సాబ్’ మాత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ను, ఏపీలో టికెట్ల రేట్ల నియంత్రణను తట్టుకుని మరీ ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. వీకెండ్లో పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన ‘వకీల్ సాబ్’.. రూ.100 కోట్ల షేర్ దిశగా పరుగులు పెడుతోంది.
ఈ క్రమంలో పవన్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ని ‘వకీల్ సాబ్’ దాటేసింది. బుధవారం ‘వకీల్ సాబ్’ రూ.80 కోట్ల షేర్ మార్కును దాటేసినట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. ‘అత్తారింటికి దారేది’ అప్పట్లో రూ.80 కోట్ల దాకా షేర్ రాబట్టింది. అప్పటికది చాలా పెద్ద ఫిగర్. పవన్ ఆ తర్వాత చేసిన సినిమాలు దీన్ని మించి బిజినెస్ చేశాయి. వాటికి మంచి టాక్ వస్తే ‘అత్తారింటికి దారేది’ రికార్డు ఎప్పుడో బద్దలయ్యేది. కానీ అవన్నీ డిజాస్టర్లు కావడంతో పవన్ హైయెస్ట్ గ్రాసర్గా మొన్నటి వరకు ‘అత్తారింటికి దారేది’నే కొనసాగింది.
ఎట్టకేలకు ఆ రికార్డును ‘వకీల్ సాబ్’ బద్దలు కొట్టేసింది. వీక్ డేస్లోనూ బలంగా సాగుతున్న ‘వకీల్ సాబ్’కు కొత్త సినిమాల నుంచి పోటీ కూడా లేదు. ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ పవన్ కెరీర్లో తొలి రూ.100 కోట్ల షేర్ మూవీగా నిలవడం లాంఛనమే అనిపిస్తోంది.
This post was last modified on April 15, 2021 6:11 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…