పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డుల మోత మోగిపోవాల్సిందే. ఎప్పుడో ఏడేళ్ల కిందట చివరగా పవన్ సినిమా ‘అత్తారింటికి దారేది’కి పాజిటివ్ టాక్ వచ్చింది. అప్పుడా సినిమా టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టేసి ఆల్ టైం ఇండస్ట్రీ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిన తెలిసిందే. ఐతే ఆ తర్వాత పవన్ సినిమా దేనికీ పాజిటివ్ టాక్ రాలేదు. వస్తే పవన్ తన రికార్డులనే కాదు.. వేరే రికార్డులను కూడా బద్దలు కొట్టేసేవాడేమో.
సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి.. ఇలా పవన్ నుంచి వచ్చిన మూడు సినిమాలకూ నెగెటివ్ టాకే వచ్చింది. అవి మూడూ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లుగా నిలిచాయి. ఐతే ఇప్పుడు వాటితో పోలిస్తే తక్కువ అంచనాలతో వచ్చిన ‘వకీల్ సాబ్’ మాత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ను, ఏపీలో టికెట్ల రేట్ల నియంత్రణను తట్టుకుని మరీ ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. వీకెండ్లో పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన ‘వకీల్ సాబ్’.. రూ.100 కోట్ల షేర్ దిశగా పరుగులు పెడుతోంది.
ఈ క్రమంలో పవన్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ని ‘వకీల్ సాబ్’ దాటేసింది. బుధవారం ‘వకీల్ సాబ్’ రూ.80 కోట్ల షేర్ మార్కును దాటేసినట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. ‘అత్తారింటికి దారేది’ అప్పట్లో రూ.80 కోట్ల దాకా షేర్ రాబట్టింది. అప్పటికది చాలా పెద్ద ఫిగర్. పవన్ ఆ తర్వాత చేసిన సినిమాలు దీన్ని మించి బిజినెస్ చేశాయి. వాటికి మంచి టాక్ వస్తే ‘అత్తారింటికి దారేది’ రికార్డు ఎప్పుడో బద్దలయ్యేది. కానీ అవన్నీ డిజాస్టర్లు కావడంతో పవన్ హైయెస్ట్ గ్రాసర్గా మొన్నటి వరకు ‘అత్తారింటికి దారేది’నే కొనసాగింది.
ఎట్టకేలకు ఆ రికార్డును ‘వకీల్ సాబ్’ బద్దలు కొట్టేసింది. వీక్ డేస్లోనూ బలంగా సాగుతున్న ‘వకీల్ సాబ్’కు కొత్త సినిమాల నుంచి పోటీ కూడా లేదు. ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ పవన్ కెరీర్లో తొలి రూ.100 కోట్ల షేర్ మూవీగా నిలవడం లాంఛనమే అనిపిస్తోంది.
This post was last modified on April 15, 2021 6:11 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…