ఒక స్టార్ హీరో సినిమా మేకింగ్ దశలో ఉండగా.. ఆ చిత్ర బృందంలోంచి ఎవరైనా మీడియాలో మాట్లాడుతూ అందులోని సన్నివేశాల గురించి ఎలివేషన్లు ఇస్తే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతుంటాయి. అందులోనూ ఒక క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి ఇలాంటి విశేషాలు బయటపెడితే ఆసక్తి మరింతగా ఉంటుంది.
సింహా, లెజెండ్ లాంటి బ్లాక్బస్టర్లు అందించిన నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న ‘అఖండ’ మీద ఇప్పటికే భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఇంతకముందు రిలీజ్ చేసిన ఫస్ట్ రోర్, తాజాగా విడుదల చేసిన టైటిల్ రోర్ వీడియోలు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. సినిమా మీద అంచనాలు పెంచాయి. ఆ అంచనాల్ని ఇంకా పెంచేలా ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్పారు ఇందులో ఓ కీలక పాత్ర చేస్తున్న సమ్మెట గాంధీ.
ఇటీవలే ‘వకీల్ సాబ్’లో పవన్ పక్కనే ఉండే ముఖ్య పాత్రతో ఆకట్టుకున్న గాంధీ.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.అందులో బాలయ్య-బోయపాటి సినిమా గురించి మాట్లాడాడు. ఈ చిత్రంలో బాలయ్య ఇంట్రడక్షన్ సీన్ మామూలుగా ఉండదని.. థియేటర్లు దద్దరిల్లిపోతాయని ఆయన అన్నారు. అంతకుమించి ఏమీ తాను మాట్లాడలేనని.. సినిమా విశేషాలేమీ బయటపెట్టొద్దని బోయపాటి చిత్ర బృందంలో అందరికీ స్పష్టంగా చెప్పాడని గాంధీ అన్నారు.
aసింహా, లెజెండ్ సినిమాలను మించి ‘అఖండ’ ఉంటుందని.. వాటిని మించి గొప్ప విజయం సాధిస్తుందని తాను నమ్ముతున్నానని గాంధీ అన్నారు. ఈ సినిమాలో తనది మరీ ఎక్కువ నిడివి ఉన్న పాత్ర కాదని.. కానీ చాలా కీలకంగా ఉంటుందని గాంధీ చెప్పారు. ఒక సన్నివేశంలో తన నటనకు బోయపాటి సూపర్ అంటూ కితాబిచ్చారని, అప్పుడు సెట్లో ఉన్న 200 మంది చప్పట్లు కొట్టారని గాంధీ తెలిపారు. బాలయ్య ఇంట్రో సీన్ మామూలుగా ఉండదంటూ గాంధీ చెప్పిన వీడియోను నందమూరి అభిమానులు చాలా ఉత్సాహంగా షేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.
This post was last modified on April 15, 2021 4:12 pm
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…