ఒక స్టార్ హీరో సినిమా మేకింగ్ దశలో ఉండగా.. ఆ చిత్ర బృందంలోంచి ఎవరైనా మీడియాలో మాట్లాడుతూ అందులోని సన్నివేశాల గురించి ఎలివేషన్లు ఇస్తే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతుంటాయి. అందులోనూ ఒక క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి ఇలాంటి విశేషాలు బయటపెడితే ఆసక్తి మరింతగా ఉంటుంది.
సింహా, లెజెండ్ లాంటి బ్లాక్బస్టర్లు అందించిన నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న ‘అఖండ’ మీద ఇప్పటికే భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఇంతకముందు రిలీజ్ చేసిన ఫస్ట్ రోర్, తాజాగా విడుదల చేసిన టైటిల్ రోర్ వీడియోలు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. సినిమా మీద అంచనాలు పెంచాయి. ఆ అంచనాల్ని ఇంకా పెంచేలా ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్పారు ఇందులో ఓ కీలక పాత్ర చేస్తున్న సమ్మెట గాంధీ.
ఇటీవలే ‘వకీల్ సాబ్’లో పవన్ పక్కనే ఉండే ముఖ్య పాత్రతో ఆకట్టుకున్న గాంధీ.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.అందులో బాలయ్య-బోయపాటి సినిమా గురించి మాట్లాడాడు. ఈ చిత్రంలో బాలయ్య ఇంట్రడక్షన్ సీన్ మామూలుగా ఉండదని.. థియేటర్లు దద్దరిల్లిపోతాయని ఆయన అన్నారు. అంతకుమించి ఏమీ తాను మాట్లాడలేనని.. సినిమా విశేషాలేమీ బయటపెట్టొద్దని బోయపాటి చిత్ర బృందంలో అందరికీ స్పష్టంగా చెప్పాడని గాంధీ అన్నారు.
aసింహా, లెజెండ్ సినిమాలను మించి ‘అఖండ’ ఉంటుందని.. వాటిని మించి గొప్ప విజయం సాధిస్తుందని తాను నమ్ముతున్నానని గాంధీ అన్నారు. ఈ సినిమాలో తనది మరీ ఎక్కువ నిడివి ఉన్న పాత్ర కాదని.. కానీ చాలా కీలకంగా ఉంటుందని గాంధీ చెప్పారు. ఒక సన్నివేశంలో తన నటనకు బోయపాటి సూపర్ అంటూ కితాబిచ్చారని, అప్పుడు సెట్లో ఉన్న 200 మంది చప్పట్లు కొట్టారని గాంధీ తెలిపారు. బాలయ్య ఇంట్రో సీన్ మామూలుగా ఉండదంటూ గాంధీ చెప్పిన వీడియోను నందమూరి అభిమానులు చాలా ఉత్సాహంగా షేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…