ఒక స్టార్ హీరో సినిమా హిట్టయితే ఇంకో స్టార్ హీరో హర్షించడం.. ఆ హీరోకు అభినందనలు చెప్పడం పెద్దగా కనిపించేది కాదు ఒకప్పుడు. ఒక వేళ అలా చేయాలన్నా అదో పెద్ద తతంగం లాగా ఉండేది. మీడియాకు స్టేట్మెంట్ ఇవ్వాలి. లేదంటే అవతలి హీరోను వెళ్లి నేరుగా కలిసి అభినందించాలి. ఇగో పక్కన పెట్టి ఇలా చేయాలంటే హీరోలకు మనసొప్పేది కాదు. కానీ సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి ఇబ్బంది లేకపోయింది. ప్రెస్ నోట్ ఇవ్వాల్సిన పని లేదు. నేరుగా వెళ్లి కలవాల్సిన పని లేదు. ట్విట్టర్లో ఒక పోస్ట్ పెడితే చాలు. ఈ పని చాలామంది హీరోలు చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే తనకు ఏ సినిమా నచ్చినా ఏ భేషజాల్లేకుండా ట్విట్టర్లో పోస్ట్ పెట్టేస్తుంటాడు. ఆ హీరో ఈ హీరో అనే తేడాలేమీ చూడడు. తాజాగా ‘వకీల్ సాబ్’ సినిమా చూసి మహేష్.. పవన్ మీద, చిత్ర బృందం మీదా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
ఐతే ‘వకీల్ సాబ్’ బాగా నచ్చేసి పవన్ను అభినందించిన మరో వ్యక్తి కూడా ఉన్నాడట. అతనెవరో కాదు.. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్. కాకపోతే మహేష్ లాగా తారక్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టలేదు. నేరుగా పవన్ను కలిసి కౌగిలించుకుని మరీ అభినందనలు తెలిపాడట. సినిమా చూసి అతను ఎమోషనల్ అయ్యాడట. ఈ విషయాన్ని ‘వకీల్ సాబ్’లో కీలక పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ వెల్లడించడం విశేషం.
‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో చాలామంది మెచ్చుకున్నారని, తారక్ అయితే పవన్ను హత్తుకుని అభినందనలు తెలిపాడని వెల్లడించడం విశేషం. మెగా, నందమూరి అభిమానుల మధ్య ఎప్పట్నుంచో ఉన్న వైరం నేపథ్యంలో తారక్ ఇలా పవన్ను కౌగిలించుకుని అభినందనలు తెలిపాడన్న సమాచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
This post was last modified on April 14, 2021 2:58 pm
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…