ఒక స్టార్ హీరో సినిమా హిట్టయితే ఇంకో స్టార్ హీరో హర్షించడం.. ఆ హీరోకు అభినందనలు చెప్పడం పెద్దగా కనిపించేది కాదు ఒకప్పుడు. ఒక వేళ అలా చేయాలన్నా అదో పెద్ద తతంగం లాగా ఉండేది. మీడియాకు స్టేట్మెంట్ ఇవ్వాలి. లేదంటే అవతలి హీరోను వెళ్లి నేరుగా కలిసి అభినందించాలి. ఇగో పక్కన పెట్టి ఇలా చేయాలంటే హీరోలకు మనసొప్పేది కాదు. కానీ సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి ఇబ్బంది లేకపోయింది. ప్రెస్ నోట్ ఇవ్వాల్సిన పని లేదు. నేరుగా వెళ్లి కలవాల్సిన పని లేదు. ట్విట్టర్లో ఒక పోస్ట్ పెడితే చాలు. ఈ పని చాలామంది హీరోలు చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే తనకు ఏ సినిమా నచ్చినా ఏ భేషజాల్లేకుండా ట్విట్టర్లో పోస్ట్ పెట్టేస్తుంటాడు. ఆ హీరో ఈ హీరో అనే తేడాలేమీ చూడడు. తాజాగా ‘వకీల్ సాబ్’ సినిమా చూసి మహేష్.. పవన్ మీద, చిత్ర బృందం మీదా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
ఐతే ‘వకీల్ సాబ్’ బాగా నచ్చేసి పవన్ను అభినందించిన మరో వ్యక్తి కూడా ఉన్నాడట. అతనెవరో కాదు.. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్. కాకపోతే మహేష్ లాగా తారక్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టలేదు. నేరుగా పవన్ను కలిసి కౌగిలించుకుని మరీ అభినందనలు తెలిపాడట. సినిమా చూసి అతను ఎమోషనల్ అయ్యాడట. ఈ విషయాన్ని ‘వకీల్ సాబ్’లో కీలక పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ వెల్లడించడం విశేషం.
‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో చాలామంది మెచ్చుకున్నారని, తారక్ అయితే పవన్ను హత్తుకుని అభినందనలు తెలిపాడని వెల్లడించడం విశేషం. మెగా, నందమూరి అభిమానుల మధ్య ఎప్పట్నుంచో ఉన్న వైరం నేపథ్యంలో తారక్ ఇలా పవన్ను కౌగిలించుకుని అభినందనలు తెలిపాడన్న సమాచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
This post was last modified on April 14, 2021 2:58 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…