ఒక స్టార్ హీరో సినిమా హిట్టయితే ఇంకో స్టార్ హీరో హర్షించడం.. ఆ హీరోకు అభినందనలు చెప్పడం పెద్దగా కనిపించేది కాదు ఒకప్పుడు. ఒక వేళ అలా చేయాలన్నా అదో పెద్ద తతంగం లాగా ఉండేది. మీడియాకు స్టేట్మెంట్ ఇవ్వాలి. లేదంటే అవతలి హీరోను వెళ్లి నేరుగా కలిసి అభినందించాలి. ఇగో పక్కన పెట్టి ఇలా చేయాలంటే హీరోలకు మనసొప్పేది కాదు. కానీ సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి ఇబ్బంది లేకపోయింది. ప్రెస్ నోట్ ఇవ్వాల్సిన పని లేదు. నేరుగా వెళ్లి కలవాల్సిన పని లేదు. ట్విట్టర్లో ఒక పోస్ట్ పెడితే చాలు. ఈ పని చాలామంది హీరోలు చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే తనకు ఏ సినిమా నచ్చినా ఏ భేషజాల్లేకుండా ట్విట్టర్లో పోస్ట్ పెట్టేస్తుంటాడు. ఆ హీరో ఈ హీరో అనే తేడాలేమీ చూడడు. తాజాగా ‘వకీల్ సాబ్’ సినిమా చూసి మహేష్.. పవన్ మీద, చిత్ర బృందం మీదా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
ఐతే ‘వకీల్ సాబ్’ బాగా నచ్చేసి పవన్ను అభినందించిన మరో వ్యక్తి కూడా ఉన్నాడట. అతనెవరో కాదు.. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్. కాకపోతే మహేష్ లాగా తారక్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టలేదు. నేరుగా పవన్ను కలిసి కౌగిలించుకుని మరీ అభినందనలు తెలిపాడట. సినిమా చూసి అతను ఎమోషనల్ అయ్యాడట. ఈ విషయాన్ని ‘వకీల్ సాబ్’లో కీలక పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ వెల్లడించడం విశేషం.
‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో చాలామంది మెచ్చుకున్నారని, తారక్ అయితే పవన్ను హత్తుకుని అభినందనలు తెలిపాడని వెల్లడించడం విశేషం. మెగా, నందమూరి అభిమానుల మధ్య ఎప్పట్నుంచో ఉన్న వైరం నేపథ్యంలో తారక్ ఇలా పవన్ను కౌగిలించుకుని అభినందనలు తెలిపాడన్న సమాచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
This post was last modified on April 14, 2021 2:58 pm
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…