నందమూరి బాలకృష్ణ.. తన అభిమానులకు ఉగాది కానుక ఇచ్చేశాడు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బోయపాటి దర్శకత్వంలో తాను నటిస్తున్న చిత్రం టైటిల్ వెల్లడించాడు. ఈ రోజే టైటిల్ రోర్ పేరుతో చిన్న టీజర్ ఒకటి వదిలారు. బాలయ్య నెవర్ బిఫోర్ లుక్తో చాలా పవర్ ఫుల్గా కనిపించిన టీజర్ నందమూరి అభిమానులనే కాదు.. మాస్ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది.
బాలయ్య-బోయపాటి కాంబినేషన్ మీద ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా సినిమా ఉండబోతోందన్న సంకేతాల్ని ఈ టీజర్ అందించింది. ఐతే టీజర్లో అన్నీ ఓకే కానీ.. బాలయ్య పేల్చిన డైలాగే జనాలు తలలు పట్టుకునేలా చేసింది. ‘‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్దీ’’.. ఇదీ బాలయ్య చాలా ఆవేశంగా చెప్పిన డైలాగ్. ఐతే దీని అర్థమేంటో.. పరమార్థమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు.
నంది.. పంది.. పగిలిపోద్ది అంటూ రైమింగ్ చూసుకున్నారు కానీ.. ఈ డైలాగ్ అయితే అర్థవంతంగా లేదు. నాన్ సింక్ లాగా అనిపిస్తోంది. సినిమాలో సందర్భాన్ని బట్టి ఏమైనా సరిగ్గా కుదిరిందో ఏమో తెలియదు కానీ.. టీజర్లో చూస్తే మాత్రం డైలాగ్ మీనింగ్ లెస్గా అనిపించింది. ఈ డైలాగ్ గురించి పెద్దగా ఆలోచించని వాళ్లు ఆహా ఓహో అనేస్తున్నారు కానీ.. కాస్త ఆలోచించి చూస్తే మాత్రం డైలాగ్ అంత బాగాలేదని అర్థమైపోతుంది.
ఈ డైలాగ్ చెప్పేటపుడు బాలయ్య ఎక్స్ప్రెషన్ కూడా మామూలుగా అనిపించింది. పవర్ ఫుల్ డైలాగులు చెప్పేటపుడు బాలయ్య ఒక మూసలో వెళ్లిపోతున్న ఫీలింగ్ జనాలకు కలుగుతోంది. బాలయ్య-బోయపాటి కలయికలో వచ్చిన తొలి రెండు సినిమాలూ బ్లాక్బస్టర్లే అయ్యాయి. ఐతే అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు వేరు. ఊరికే మాస్ మాస్ అంటే సరిపోదు. ఈసారి కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేయకుంటే కష్టమే.
This post was last modified on April 14, 2021 12:00 am
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…