సినిమా థియేటర్లు మళ్ళీ ఎప్పుడు మాములుగా రన్ అవుతాయనేది తెలియక పోవడంతో లాక్ డౌన్ టైంలో రిలీజ్ కానీ సినిమాల హక్కులు తీసుకోవాలని ఓటిటీ ప్లాటుఫారమ్స్ గట్టిగా ట్రై చేసాయి. నాని నటించిన సినిమా హక్కులు తీసుకుంటే మిగిలిన సినిమాల హక్కులు తీసుకోవడం ఈజీ అవుతుందని ‘వి’ హక్కుల కోసమే ప్రయత్నాలు చేసారు.
ముప్పై కోట్లు ఇవ్వడానికి సిద్ధపడినా కానీ డిస్ట్రిబ్యూటర్ గా థియేటర్ బిజినెస్ దెబ్బ తీసే పని చేయడానికి దిల్ రాజుకి మనసు రాలేదు. అయితే అదే పనిగా వెంట పడుతున్న వాళ్ళ మార్కెటింగ్ టీంకి రాజు వింత ప్రపోజల్ పెట్టాడు.
సగం సినిమా ఇస్తానని, ఆ సగం ఓటిటీ వ్యూయర్స్ ఎలాగో చూస్తారని, అయితే మిగతా సగం చూసేందుకు తహతహలాడుతూ థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తారని, సినిమా థియేటర్స్ లోకి వచ్చాక క్యూ కడతారని, అలా రెండు వైపులా ప్లస్ అయ్యే డీల్ ఇదని దిల్ రాజు చెప్పడంతో వాళ్ళకి ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి. నిజమే మరి వి లాంటి సినిమాలు కూడా ఓటిటీ బాట పడితే ఇక సినిమా థియేటర్లకు గడ్డు కాలమే.
This post was last modified on May 12, 2020 4:26 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…