ఎన్టీఆర్ 30వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్తోనే అని నందమూరి అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు కొన్ని రోజుల కిందటి వరకు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన గత ఏఢాదే వచ్చింది. కొన్ని వారాల కిందట కూడా ఈ కాంబినేషన్ పక్కా అనే చెప్పాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. కానీ గత కొన్ని రోజుల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. త్రివిక్రమ్తో తన తర్వాతి సినిమాను ఎన్టీఆర్ చేయట్లేదన్న సమాచారం బయటికి వచ్చింది. ముందు ఇది రూమర్ అనే అంతా అనుకున్నారు. కానీ అదే నిజమని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ చేయబోయే సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించనున్నాడు. త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయబోతున్నాడు. సోమవారం సాయంత్రం ఎన్టీఆర్-కొరటాల సినిమా గురించి ప్రకటన కూడా రాబోతోందని.. కొరటాల మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తాడని అంటున్నారు.
ఐతే ‘అరవింద సమేత’ టైంలో, ఆ తర్వాత ఎంతో సన్నిహితంగా కనిపించిన ఎన్టీఆర్, త్రివిక్రమ్.. తమ కాంబినేషన్లో రెండో సినిమాకు కమిటై ఏడాది పాటు సంప్రదింపులు జరుపుతూ సాగాక ఇప్పుడు ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నదే ఎవరికీ అర్థం కావడం లేదు. తీవ్ర స్థాయిలో అభిప్రాయ భేదాలు వస్తే తప్ప ఇలా ఓ సినిమా రద్దవదు. గతంలో మహేష్ బాబు, సుకుమార్ల మధ్య కూడా ఇలాగే తేడా కొట్టి సినిమా క్యాన్సిల్ అయింది. సుహృద్భావ వాతావరణంలోనే ఆ సినిమా క్యాన్సిల్ అయిందని, తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తారని అన్నారు. కానీ ఎవరి దారులు వారివి అయ్యాయి.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ విషయంలోనూ ఇలాగే అయిందని అనుకుంటున్నారు. కానీ వీరి సన్నిహితులు చెబుతున్న ప్రకారం.. కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరక మంచి వాతావరణంలోనే ప్రస్తుతానికి తమ కలయికలో సినిమా వద్దనుకున్నారని.. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడం ఖాయమని అంటున్నారు. ఇద్దరి మధ్య గొడవేం జరగలేదని.. కొరటాల, ప్రశాంత్ నీల్ సినిమాలు అయ్యాక ముందు అనుకున్నట్లే హారిక హాసిని బేనర్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 32వ సినిమాను ఎన్టీఆర్ చేయబోతున్నాడని సమాచారం.
This post was last modified on April 12, 2021 3:12 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…