కరోనా కేసులు తగ్గాయి. భయం పోయింది. థియేటర్లు పునఃప్రారంభం అయ్యాయి. 50 శాతం ఆక్యుపెన్సీతోనూ మంచి వసూళ్లు వచ్చాయి. తర్వాత ఆక్యుపెన్సీని వంద శాతానికి పెంచారు. మంచి టాక్ తెచ్చుకున్న సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఇది చూసి గతంలో కన్నా ఎక్కువ స్థాయిలో సినిమాల రిలీజ్కు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇక కరోనా ప్రభావం సినిమాలపై ఏమీ ఉండదనే అనుకున్నారంతా.
మళ్లీ టాలీవుడ్ పూర్వఫు ఫామ్ అందుకుని అంతా సంతోషంగా ఉన్న సమయంలో.. కరోనా సెకండ్ వేవ్ మళ్లీ ఇండస్ట్రీని దెబ్బ కొడుతోంది. కేసులు బాగా పెరిగిపోవడంతో థియేటర్లపై ఆంక్షలు తప్పేట్లు లేవు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడుల్లో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించేశారు. ఏపీ, తెలంగాణల్లోనూ ఈ దిశగా అడుగులు పడటం లాంఛనమే అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే వచ్చే వారం రావాల్సిన లవ్ స్టోరి సినిమాను వాయిదా వేసుకుంది చిత్ర బృందం. ప్రస్తుతం వకీల్ సాబ్ లాంటి భారీ చిత్రం థియేటర్లలో ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంచెం ఆగాయని.. మరి కొన్ని రోజుల్లో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు కావడం లాంఛనమే అని అంటున్నారు. ఇదే జరిగితే ఈ నెల 23న రావాల్సిన టక్ జగదీష్ సైతం వాయిదా పడక తప్పదేమో.
లవ్ స్టోరి వాయిదా నిర్ణయం వెల్లడి కాగానే.. నాని సినిమా విషయంలో ఏం చేస్తారనే సందేహాలు అందరిలోనూ కలిగాయి. వచ్చే వారంలో కరోనా ప్రభావం ఎలా ఉండబోతోంది.. ప్రభుత్వం థియేటర్లపై ఆంక్షలు పెడుతుందా లేదా అన్నదాన్ని బట్టి టక్ జగదీష్ టీం తమ సినిమాను వాయిదా వేయాలా వద్దా అని నిర్ణయం తీసుకునే అవకాశముంది.
This post was last modified on April 11, 2021 8:45 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…