కరోనా కేసులు తగ్గాయి. భయం పోయింది. థియేటర్లు పునఃప్రారంభం అయ్యాయి. 50 శాతం ఆక్యుపెన్సీతోనూ మంచి వసూళ్లు వచ్చాయి. తర్వాత ఆక్యుపెన్సీని వంద శాతానికి పెంచారు. మంచి టాక్ తెచ్చుకున్న సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఇది చూసి గతంలో కన్నా ఎక్కువ స్థాయిలో సినిమాల రిలీజ్కు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇక కరోనా ప్రభావం సినిమాలపై ఏమీ ఉండదనే అనుకున్నారంతా.
మళ్లీ టాలీవుడ్ పూర్వఫు ఫామ్ అందుకుని అంతా సంతోషంగా ఉన్న సమయంలో.. కరోనా సెకండ్ వేవ్ మళ్లీ ఇండస్ట్రీని దెబ్బ కొడుతోంది. కేసులు బాగా పెరిగిపోవడంతో థియేటర్లపై ఆంక్షలు తప్పేట్లు లేవు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడుల్లో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించేశారు. ఏపీ, తెలంగాణల్లోనూ ఈ దిశగా అడుగులు పడటం లాంఛనమే అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే వచ్చే వారం రావాల్సిన లవ్ స్టోరి సినిమాను వాయిదా వేసుకుంది చిత్ర బృందం. ప్రస్తుతం వకీల్ సాబ్ లాంటి భారీ చిత్రం థియేటర్లలో ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంచెం ఆగాయని.. మరి కొన్ని రోజుల్లో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు కావడం లాంఛనమే అని అంటున్నారు. ఇదే జరిగితే ఈ నెల 23న రావాల్సిన టక్ జగదీష్ సైతం వాయిదా పడక తప్పదేమో.
లవ్ స్టోరి వాయిదా నిర్ణయం వెల్లడి కాగానే.. నాని సినిమా విషయంలో ఏం చేస్తారనే సందేహాలు అందరిలోనూ కలిగాయి. వచ్చే వారంలో కరోనా ప్రభావం ఎలా ఉండబోతోంది.. ప్రభుత్వం థియేటర్లపై ఆంక్షలు పెడుతుందా లేదా అన్నదాన్ని బట్టి టక్ జగదీష్ టీం తమ సినిమాను వాయిదా వేయాలా వద్దా అని నిర్ణయం తీసుకునే అవకాశముంది.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…