కరోనా కేసులు తగ్గాయి. భయం పోయింది. థియేటర్లు పునఃప్రారంభం అయ్యాయి. 50 శాతం ఆక్యుపెన్సీతోనూ మంచి వసూళ్లు వచ్చాయి. తర్వాత ఆక్యుపెన్సీని వంద శాతానికి పెంచారు. మంచి టాక్ తెచ్చుకున్న సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఇది చూసి గతంలో కన్నా ఎక్కువ స్థాయిలో సినిమాల రిలీజ్కు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇక కరోనా ప్రభావం సినిమాలపై ఏమీ ఉండదనే అనుకున్నారంతా.
మళ్లీ టాలీవుడ్ పూర్వఫు ఫామ్ అందుకుని అంతా సంతోషంగా ఉన్న సమయంలో.. కరోనా సెకండ్ వేవ్ మళ్లీ ఇండస్ట్రీని దెబ్బ కొడుతోంది. కేసులు బాగా పెరిగిపోవడంతో థియేటర్లపై ఆంక్షలు తప్పేట్లు లేవు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడుల్లో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించేశారు. ఏపీ, తెలంగాణల్లోనూ ఈ దిశగా అడుగులు పడటం లాంఛనమే అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే వచ్చే వారం రావాల్సిన లవ్ స్టోరి సినిమాను వాయిదా వేసుకుంది చిత్ర బృందం. ప్రస్తుతం వకీల్ సాబ్ లాంటి భారీ చిత్రం థియేటర్లలో ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంచెం ఆగాయని.. మరి కొన్ని రోజుల్లో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు కావడం లాంఛనమే అని అంటున్నారు. ఇదే జరిగితే ఈ నెల 23న రావాల్సిన టక్ జగదీష్ సైతం వాయిదా పడక తప్పదేమో.
లవ్ స్టోరి వాయిదా నిర్ణయం వెల్లడి కాగానే.. నాని సినిమా విషయంలో ఏం చేస్తారనే సందేహాలు అందరిలోనూ కలిగాయి. వచ్చే వారంలో కరోనా ప్రభావం ఎలా ఉండబోతోంది.. ప్రభుత్వం థియేటర్లపై ఆంక్షలు పెడుతుందా లేదా అన్నదాన్ని బట్టి టక్ జగదీష్ టీం తమ సినిమాను వాయిదా వేయాలా వద్దా అని నిర్ణయం తీసుకునే అవకాశముంది.
This post was last modified on April 11, 2021 8:45 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…