అక్కినేని నాగార్జున కొత్త సినిమా ‘వైల్డ్ డాగ్’ నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్లో రిలీజ్ కావాల్సిన సినిమా. మూడు నెలల ముందే ఆ డీల్ కూడా పూర్తయింది. అప్పటికి కరోనా భయం వెంటాడుతోంది. థియేటర్లు అప్పుడే తెరుచుకున్నాయి. జనాలు థియేటర్లకు వస్తారో రారో అన్న సందేహాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓటీటీ రిలీజే కరెక్ట్ అనుకున్నారు. కానీ కొన్ని రోజులకే సంక్రాంతికి సినిమాలు వచ్చాయి. చాలా బాగా ఆడాయి. దీంతో చిత్ర బృందంలో అంతర్మథనం మొదలైంది.
నెట్ ఫ్లిక్స్ వాళ్లతో మళ్లీ మాట్లాడి డీల్ క్యాన్సిల్ చేసుకున్నారు. ముందు సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి.. ఆ తర్వాత నెలా నెలన్నర గ్యాప్ ఇచ్చి నెట్ ఫ్లిక్స్లో రిలీజ్ చేసేలా కొత్తగా ఒప్పందం కుదిరింది. ఎక్స్క్లూజివ్ ఓటీటీ రిలీజ్కు ఇచ్చేట్లయితే రూ.20 కోట్ల దాకా ఇవ్వడానికి నెట్ ఫ్లిక్స్ వాళ్లు రెడీ అయ్యారు. కానీ థియేట్రికల్ రిలీజ్కు వెళ్లడంతో సగానికి సగం రేటు తగ్గించేసినట్లు సమాచారం.
కట్ చేస్తే మంచి సీజన్ కోసం వెయిట్ చేసి ఏప్రిల్ 2న ఈ ‘వైల్డ్ డాగ్’ను రిలీజ్ చేశారు. బాగా ప్రమోట్ చేశారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఏం లాభం? ఈ సినిమా చూసేందుకు జనాలు పెద్దగా థియేటర్లకు రాలేదు. ఫుల్ రన్లో మరీ అన్యాయంగా రూ.3 కోట్ల షేర్ సాధించిందీ సినిమా. ఈ సినిమాను అమ్మిందే తక్కువ రేట్లకు. ఆ మొత్తం కూడా వెనక్కి రాలేదు. సగం కంటే తక్కువ రికవరీతో డిజాస్టర్ అయింది ‘వైల్డ్ డాగ్’. సినిమాకు మరీ ఇలాంటి ఫలితం వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
వీకెండ్ అవ్వగానే ‘వైల్డ్ డాగ్’ పూర్తిగా డల్లయిపోగా.. ఈ వారం ‘వకీల్ సాబ్’ రాకతో థియేటర్ల నుంచి అంతర్ధానం అయింది. ఇప్పుడు సినిమా ఊసే లేదు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందని నిర్మాత తల పట్టుకునే పరిస్థితి వచ్చింది. నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఆదాయం ఎక్కువ వచ్చేది. ఇలా బాక్సాఫీస్ దగ్గర నాగ్ పరువు పోయేది కూడా కాదు. ఇప్పుడు థియేటర్లలో ఆడని సినిమాను నెట్ ఫ్లిక్స్లో చూసేందుకు జనాలు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారన్నది సందేహం. ఈ రకంగా ‘వైల్డ్ డాగ్’ పరిస్థితి రెంటికీ చెడ్డట్లు అయింది.
This post was last modified on April 11, 2021 8:41 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…