మరి కొన్ని గంటల్లోనే ‘వకీల్ సాబ్’ థియేటర్లలోకి దిగబోతోంది. ఇదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటం.. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు, అదనపు షోలకు అనుమతులు లభించలేదు. దీని ద్వారా ‘వకీల్ సాబ్’ ఆదాయానికి బాగానే గండి పడింది.
ఇప్పుడంతా తొలి వారాంతపు వసూళ్లే కీలకం కావడంతో టాక్తో సంబంధం లేకుండా మాగ్జిమం కలెక్షన్లు కొల్లగొట్టడం కోసం బెనిఫిట్ షోలు, అదనపు షోలు ప్లాన్ చేసుకున్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు షాక్ తగిలింది. అదనపు షోల కోసం బుకింగ్స్ కూడా ఓపెన్ చేసి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ముందు రోజు వరకు ఏదో ఒక సమయంలో అనుమతులు వస్తాయని ఎదురు చూసి చూసి చివరికి నిరాశకు గురి కాక తప్పలేదు. రెగ్యులర్ షోలతోనే సినిమాను నడిపించుకోక తప్పేట్లేదు లేదు.
ఐతే కరోనా విజృంభణ చూస్తే ‘వకీల్ సాబ్’ను తెలుగు రాష్ట్రాల్లో ఇలా అయినా నడిపించుకోగలుగుతున్నందుకు సంతోషించాల్సిందే అన్నట్లుంది. ఎందుకంటే పొరుగు రాష్ట్రాలు ఒక్కొక్కటిగా 50 శాతం ఆక్యుపెన్సీ వైపు అడుగులు వేస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం గత వారమే 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని ప్రకటించింది. కానీ ‘యువరత్న’ సినిమాకు అప్పటికే 100 శాతం ఆక్యుపెన్సీతో బుకింగ్స్ పూర్తవడంతో చిత్ర బృందం విజ్హప్తి మేరకు ఈ నెల 6 వరకు పాత పద్ధతిని కొనసాగించేలా చూశారు. ఏడో తారీఖు నుంచి 50 శాతం ఆక్యుపెన్సీ అమలవుతోంది. ‘వకీల్ సాబ్’కు కూడా ఇలాగే బుకింగ్స్ నడుస్తున్నాయి. దీని వల్ల ఆదాయానికి గండి తప్పట్లేదు.
ఇప్పుడు తమిళనాట సైతం తాజాగా 50 శాతం ఆక్యుపెన్సీ విధిస్తూ జీవో ఇచ్చారు. ఇది శుక్రవారం అక్కడ రిలీజవుతున్న ధనుష్ సినిమా ‘కర్ణన్’కు పెద్ద షాకే. తమిళనాట ‘వకీల్ సాబ్’ వసూళ్లపైనా ఈ నిర్ణయం ప్రభావం చూపేదే. ఇదిలా ఉంటే.. పొరుగు రాష్ట్రాలు పరిస్థితి తీవ్రత అర్థం చేసుకుని 50 శాతానికి ఆక్యుపెన్సీని తగ్గిస్తున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మీదా ఒత్తిడి పడటం ఖాయం. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా 50 ఆక్యుపెన్సీ తెస్తారేమో అన్న భయం కలుగుతోంది నిర్మాతల్లో. ఈ వీకెండ్ తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదు. అదే జరిగితె.. ‘వకీల్ సాబ్’కే కాదు, ఆ తర్వాత వచ్చే సినిమాలకూ ఇబ్బందులు తప్పవు.
This post was last modified on April 8, 2021 7:00 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…