డాక్టర్ కాబోయి.. ఇంకేదో అవ్వబోయి యాక్టర్ అయిన వాళ్లు చాలామంది ఉంటారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాక చదువును పక్కన పెట్టేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం నటనలోకి అడుగు పెట్టాక కూడా చదువు మీద ఆసక్తి కోల్పోరు. కొంత సమయాన్ని చదువుకు కేటాయించి డిగ్రీలు సంపాదిస్తుంటారు. కొందరు నటనను పక్కన పెట్టి మరీ చదువు వైపు అడుగులు వేస్తుంటారు.
కొన్నేళ్ల కిందట బెంగాలీ భామ రిచా గంగోపాధ్యాయ హీరోయిన్గా మంచి స్థాయిలో ఉన్నా కూడా సినిమాలు వదిలేసి చదువు కోసం యుఎస్ వెళ్లిపోయింది. అక్కడ ఎంబీఏ చేసి ఉద్యోగంలో చేరింది. అక్కడి అబ్బాయినే పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడిపోయింది. ఇక వర్తమానంలోకి వస్తే సినిమాల్లో నటిస్తూనే చదువుకుంటున్న హీరోయిన్లు కొంతమంది ఉన్నారు. నేల టిక్కెట్టు, రెడ్ లాంటి సినిమాల్లో నటించిన హాట్ హీరోయిన్ మాళవిక శర్మ కూడా చదువు విషయంలో చాలా సీరియస్గా ఉన్న సంగతి వెల్లడైంది.
మాళవిక శర్మ చడీచప్పుడు లేకుండా ఎల్ఎల్బీ పూర్తి చేసేయడం విశేషం. ముంబయిలోని రిజ్వి లా కాలేజీ నుంచి ఆమె గత నవంబరులో లా డిగ్రీ కూడా తీసుకుందట. ఆమె ప్రస్తుతం హైదరాబాద్లోని హైకోర్టులో జూనియర్ లాయర్గా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టిందట. జనవరిలోనే ఆమెకు మహారాష్ట్ర బార్ కౌన్సిల్ నుంచి లా ప్రాక్టీస్ కోసం లైసెన్స్ కూడా వచ్చిందట. అది వచ్చిన కొన్ని నెలలకే హైదరాబాద్లో మాళవిక ప్రాక్టీస్ మొదలుపెట్టింది.
పెద్ద హీరోయిన్ కాగల లక్షణాలు అన్నీ ఉన్నప్పటికీ సరైన బ్రేక్ లేక మాళవిక ఇబ్బంది పడుతోంది. ‘నేల టిక్కెట్టు’ లాంటి డిజాస్టర్తో ఎంట్రీ ఇవ్వడం ఆమె కెరీర్కు చేటు చేసింది. చివరగా ఆమె నటించిన ‘రెడ్’ కూడా ఆశించిన ఫలితాన్నందుకోలేదు. అయినప్పటికీ ఆశలు కోల్పోకుండా సినిమాల్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న మాళవిక.. అక్కడ అంత బిజీగా ఏమీ లేకపోవడంతో లా ప్రాక్టీస్ను మొదలుపెట్టినట్లుంది. మున్ముందు అవకాశాలు రాకుంటే ఇలాగే సెటిలైపోతుందేమో.
This post was last modified on April 8, 2021 2:35 pm
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…