పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పునరాగమన చిత్రం ‘వకీల్ సాబ్’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. అలాగని ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లిపోతుందని అనుకోవడానికి లేదు. రీఎంట్రీలో పవన్ ముందు పెద్ద టార్గెట్టే ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు వంద కోట్ల దాకా షేర్ రాబట్టాలి.
వరల్డ్ వైడ్ వకీల్ సాబ్ థియేట్రికల్ హక్కులు రూ.96 కోట్లకు అమ్ముడవడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ సినిమా రూ.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేయడం విశేషం. కరోనా అనంతరం తెలుగు సినిమాల బిజినెస్ దెబ్బ తిన్నప్పటికీ.. వకీల్ సాబ్ విషయానికి వచ్చేసరికి బయ్యర్లేమీ వెనుకంజ వేయలేదు.
ఉత్తరాంధ్ర వరకు ఈ సినిమా రూ.11 కోట్లు రాబట్టింది. రాయలసీమ హక్కులు రూ.13.5 కోట్లు తెచ్చిపెట్టాయి. ఆంధ్రప్రదేశ్లోని మిగతా ప్రాంతాలన్నీ కలిపి రూ.31 కోట్లు పలికాయి హక్కులు. నైజాం ఏరియాలో దిల్ రాజు సొంతంగా రిలీజ్ చేస్తుండగా.. ఆ ప్రాంత థియేట్రికల్ హక్కుల విలువ రూ.25 కోట్లని అంచనా వేస్తున్నారు. కర్ణాటక హక్కులు రూ.6 కోట్ల దాకా పలకగా.. ఓవర్సీస్ రైట్స్ రూ.5 కోట్లకు అమ్మారు. ఇలా వరల్డ్ వైడ్ బిజినెస్ భారీగానే జరిగింది.
కాబట్టి రూ.100 కోట్ల షేర్ వస్తే తప్ప బయ్యర్లు లాభాల బాట పట్టరన్నమాట. ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా నిర్మాతలకు రూ.50 కోట్ల ఆదాయం రావడం విశేషం. మొత్తంగా పవన్ను నమ్ముకుని పింక్ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాను రీమేక్ చేస్తూ రూ.150 కోట్ల మేర బిజినెస్ చేయడమంటే మామూలు విషయం కాదు.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…