పవర్ పేట.. దాదాపు రెండేళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా. ‘రౌడీ ఫెలో’ సినిమాతో దర్శకుడిగా మారిన లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కాల్సిన చిత్రమిది. ఇంతకుముందు వీరి కలయిలో ‘చల్ మోహన్ రంగ’ అనే క్లాస్ లవ్ స్టోరీ వచ్చింది. అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతే ఈసారి దానికి భిన్నంగా పూర్తి స్థాయి రస్టిక్ యాక్షన్ సినిమా చేయడానికి సిద్ధమైంది నితిన్-కృష్ణ చైతన్య జోడీ. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, అత్యంత శ్రమతో కూడిన సినిమా ఇదని నితిన్ ఈ మధ్యే చెప్పుకొచ్చాడు.
ఆంధ్రా ప్రాంతంలో రౌడీయిజానికి నెలవైన పవర్ పేట అనే ప్రాంతం మీద ఎంతో పరిశోధన జరిపి ఈ సినిమాకు స్క్రిప్టు తీర్చిదిద్దాడు కృష్ణచైతన్య. నితిన్ ప్రస్తుతం నటిస్తున్న ‘మాస్ట్రో’ పూర్తి కాగానే ఈ సినిమా మొదలుపెట్టాలని అనుకున్నాడు. సొంత బేనర్లోనే ఈ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా అనుకున్న సమయానికి మొదలు కావట్లేదని, కొంచెం వెనక్కి వెళ్తోందని వార్తలొస్తున్నాయి.
నితిన్ ఇటీవలే వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. రచయితగా కిక్, రేసుగుర్రం లాంటి బ్లాక్బస్టర్లు ఇచ్చిన వంశీ.. దర్శకుడిగా చేసిన తొలి సినిమా ‘నా పేరు సూర్య’తో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. ఆ దెబ్బ నుంచి కోలుకుని మరో సినిమా లైన్లో పెట్టుకోవడానికి చాలా సమయం పట్టేసింది. చివరికి నితిన్ హీరోగా సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది.
ఐతే ‘పవర్ పేట’ ఎంతో ఖర్చుతో, శ్రమతో కూడుకున్న సినిమా కావడంతో అది పూర్తి చేసి, వంశీ సినిమా మీదికి రావడానికి సమయం పడుతుందని.. దాని కంటే వంశీతో ముందు సినిమా చేసి, ఆ తర్వాత ‘పవర్ పేట’ మొదలు పెట్టడం మంచిదని నితిన్ భావిస్తున్నాడట. వంశీ సినిమాను వేగంగా పూర్తి చేసేయడానికి ప్రణాళికలు రచించుకున్నట్లు తెలుస్తోంది. ‘క్రాక్’తో బ్లాక్బస్టర్ కొట్టిన ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు తెలిసింది.
This post was last modified on April 7, 2021 2:19 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…