పవర్ పేట.. దాదాపు రెండేళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా. ‘రౌడీ ఫెలో’ సినిమాతో దర్శకుడిగా మారిన లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కాల్సిన చిత్రమిది. ఇంతకుముందు వీరి కలయిలో ‘చల్ మోహన్ రంగ’ అనే క్లాస్ లవ్ స్టోరీ వచ్చింది. అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతే ఈసారి దానికి భిన్నంగా పూర్తి స్థాయి రస్టిక్ యాక్షన్ సినిమా చేయడానికి సిద్ధమైంది నితిన్-కృష్ణ చైతన్య జోడీ. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, అత్యంత శ్రమతో కూడిన సినిమా ఇదని నితిన్ ఈ మధ్యే చెప్పుకొచ్చాడు.
ఆంధ్రా ప్రాంతంలో రౌడీయిజానికి నెలవైన పవర్ పేట అనే ప్రాంతం మీద ఎంతో పరిశోధన జరిపి ఈ సినిమాకు స్క్రిప్టు తీర్చిదిద్దాడు కృష్ణచైతన్య. నితిన్ ప్రస్తుతం నటిస్తున్న ‘మాస్ట్రో’ పూర్తి కాగానే ఈ సినిమా మొదలుపెట్టాలని అనుకున్నాడు. సొంత బేనర్లోనే ఈ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా అనుకున్న సమయానికి మొదలు కావట్లేదని, కొంచెం వెనక్కి వెళ్తోందని వార్తలొస్తున్నాయి.
నితిన్ ఇటీవలే వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. రచయితగా కిక్, రేసుగుర్రం లాంటి బ్లాక్బస్టర్లు ఇచ్చిన వంశీ.. దర్శకుడిగా చేసిన తొలి సినిమా ‘నా పేరు సూర్య’తో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. ఆ దెబ్బ నుంచి కోలుకుని మరో సినిమా లైన్లో పెట్టుకోవడానికి చాలా సమయం పట్టేసింది. చివరికి నితిన్ హీరోగా సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది.
ఐతే ‘పవర్ పేట’ ఎంతో ఖర్చుతో, శ్రమతో కూడుకున్న సినిమా కావడంతో అది పూర్తి చేసి, వంశీ సినిమా మీదికి రావడానికి సమయం పడుతుందని.. దాని కంటే వంశీతో ముందు సినిమా చేసి, ఆ తర్వాత ‘పవర్ పేట’ మొదలు పెట్టడం మంచిదని నితిన్ భావిస్తున్నాడట. వంశీ సినిమాను వేగంగా పూర్తి చేసేయడానికి ప్రణాళికలు రచించుకున్నట్లు తెలుస్తోంది. ‘క్రాక్’తో బ్లాక్బస్టర్ కొట్టిన ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు తెలిసింది.
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…