Movie News

నితిన్ కలల సినిమాకు బ్రేక్

పవర్ పేట.. దాదాపు రెండేళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా. ‘రౌడీ ఫెలో’ సినిమాతో దర్శకుడిగా మారిన లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కాల్సిన చిత్రమిది. ఇంతకుముందు వీరి కలయిలో ‘చల్ మోహన్ రంగ’ అనే క్లాస్ లవ్ స్టోరీ వచ్చింది. అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతే ఈసారి దానికి భిన్నంగా పూర్తి స్థాయి రస్టిక్ యాక్షన్ సినిమా చేయడానికి సిద్ధమైంది నితిన్-కృష్ణ చైతన్య జోడీ. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, అత్యంత శ్రమతో కూడిన సినిమా ఇదని నితిన్ ఈ మధ్యే చెప్పుకొచ్చాడు.

ఆంధ్రా ప్రాంతంలో రౌడీయిజానికి నెలవైన పవర్ పేట అనే ప్రాంతం మీద ఎంతో పరిశోధన జరిపి ఈ సినిమాకు స్క్రిప్టు తీర్చిదిద్దాడు కృష్ణచైతన్య. నితిన్ ప్రస్తుతం నటిస్తున్న ‘మాస్ట్రో’ పూర్తి కాగానే ఈ సినిమా మొదలుపెట్టాలని అనుకున్నాడు. సొంత బేనర్లోనే ఈ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా అనుకున్న సమయానికి మొదలు కావట్లేదని, కొంచెం వెనక్కి వెళ్తోందని వార్తలొస్తున్నాయి.

నితిన్ ఇటీవలే వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. రచయితగా కిక్, రేసుగుర్రం లాంటి బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన వంశీ.. దర్శకుడిగా చేసిన తొలి సినిమా ‘నా పేరు సూర్య’తో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. ఆ దెబ్బ నుంచి కోలుకుని మరో సినిమా లైన్లో పెట్టుకోవడానికి చాలా సమయం పట్టేసింది. చివరికి నితిన్ హీరోగా సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది.

ఐతే ‘పవర్ పేట’ ఎంతో ఖర్చుతో, శ్రమతో కూడుకున్న సినిమా కావడంతో అది పూర్తి చేసి, వంశీ సినిమా మీదికి రావడానికి సమయం పడుతుందని.. దాని కంటే వంశీతో ముందు సినిమా చేసి, ఆ తర్వాత ‘పవర్ పేట’ మొదలు పెట్టడం మంచిదని నితిన్ భావిస్తున్నాడట. వంశీ సినిమాను వేగంగా పూర్తి చేసేయడానికి ప్రణాళికలు రచించుకున్నట్లు తెలుస్తోంది. ‘క్రాక్’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు తెలిసింది.

This post was last modified on April 7, 2021 2:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

3 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

5 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

5 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

6 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

7 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

8 hours ago