రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా ఎప్పుడు మొదలుపెడతాడో.. ఎప్పుడు పూర్తి చేస్తాడో.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలియదు. ఆయన ప్రకటించిన ఆపేసిన.. అలాగే షూటింగ్ మధ్యలో వదిలేసిన.. పూర్తి చేశాక పక్కన పెట్టేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి.. పట్టపగలు. సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హార్రర్ మూవీ ఇది.
చడీచప్పుడు లేకుండా మూణ్నాలుగేళ్ల కిందటే ఈ సినిమాను పూర్తి చేసిన వర్మ.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు కానీ.. సినిమా విడుదల సంగతి తేల్చలేదు. టైటిల్, ఫస్ట్ లుక్, ఇతర ప్రోమోలేవీ ప్రేక్షకుల దృష్టిని ఏమాత్రం ఆకర్షించలేకపోయాయి. విడుదలకు సన్నాహాలు జరిగాయి కానీ.. సినిమాకు బిజినెస్ జరగలేదు. తర్వాత ఏం జరిగిందో ఏమో పట్టపగలు చిత్రాన్ని పక్కన పెట్టేసి యధావిధిగా వేరే ప్రాజెక్టు వైపు వెళ్లిపోయాడు వర్మ.
కట్ చేస్తే ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమాను బయటికి తీస్తున్నాడు వర్మ. ఇదేదో కొత్త సినిమా అనుకునేలా దానికి టైటిల్ మార్చేయడం విశేషం. దెయ్యం అని పేరు పెట్టాడు. దెయ్యం పేరుతో వర్మ నుంచి ఇంతకుముందే ఓ సినిమా వచ్చింది. కాబట్టి దెయ్యం ముందర ఆర్జీవీ అని తన పేరే చేర్చుకున్నాడు. బిగ్ బాస్ షోలో చేసిన సాక్షి దీక్షిత్ ఇందులో కీలక పాత్ర పోషించింది.
రాజశేఖర్ ఈ సినిమా కోసం మేకప్ లేకుండా నటించడం విశేషం. ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రోమోలు చూస్తే ఇది దెయ్యం-చేతబడుల చుట్టూ తిరిగే మామూలు హార్రర్ సినిమాలాగే కనిపించింది. వర్మ పాత సినిమాలనే తలపించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమాను ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహమే. ఐతే వర్మ మాత్రం ఈ నెల 16న తెలుగులో పాటు ఇతర భాషల్లోనూ ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేస్తానంటున్నాడు. మరి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.
This post was last modified on April 7, 2021 11:11 am
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…