రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా ఎప్పుడు మొదలుపెడతాడో.. ఎప్పుడు పూర్తి చేస్తాడో.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలియదు. ఆయన ప్రకటించిన ఆపేసిన.. అలాగే షూటింగ్ మధ్యలో వదిలేసిన.. పూర్తి చేశాక పక్కన పెట్టేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి.. పట్టపగలు. సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హార్రర్ మూవీ ఇది.
చడీచప్పుడు లేకుండా మూణ్నాలుగేళ్ల కిందటే ఈ సినిమాను పూర్తి చేసిన వర్మ.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు కానీ.. సినిమా విడుదల సంగతి తేల్చలేదు. టైటిల్, ఫస్ట్ లుక్, ఇతర ప్రోమోలేవీ ప్రేక్షకుల దృష్టిని ఏమాత్రం ఆకర్షించలేకపోయాయి. విడుదలకు సన్నాహాలు జరిగాయి కానీ.. సినిమాకు బిజినెస్ జరగలేదు. తర్వాత ఏం జరిగిందో ఏమో పట్టపగలు చిత్రాన్ని పక్కన పెట్టేసి యధావిధిగా వేరే ప్రాజెక్టు వైపు వెళ్లిపోయాడు వర్మ.
కట్ చేస్తే ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమాను బయటికి తీస్తున్నాడు వర్మ. ఇదేదో కొత్త సినిమా అనుకునేలా దానికి టైటిల్ మార్చేయడం విశేషం. దెయ్యం అని పేరు పెట్టాడు. దెయ్యం పేరుతో వర్మ నుంచి ఇంతకుముందే ఓ సినిమా వచ్చింది. కాబట్టి దెయ్యం ముందర ఆర్జీవీ అని తన పేరే చేర్చుకున్నాడు. బిగ్ బాస్ షోలో చేసిన సాక్షి దీక్షిత్ ఇందులో కీలక పాత్ర పోషించింది.
రాజశేఖర్ ఈ సినిమా కోసం మేకప్ లేకుండా నటించడం విశేషం. ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రోమోలు చూస్తే ఇది దెయ్యం-చేతబడుల చుట్టూ తిరిగే మామూలు హార్రర్ సినిమాలాగే కనిపించింది. వర్మ పాత సినిమాలనే తలపించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమాను ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహమే. ఐతే వర్మ మాత్రం ఈ నెల 16న తెలుగులో పాటు ఇతర భాషల్లోనూ ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేస్తానంటున్నాడు. మరి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.
This post was last modified on April 7, 2021 11:11 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…