పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ హంగామాకు ఇంకో మూడు రోజులే సమయం ఉంది. ఈ శుక్రవారం ఆయన రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. సినిమా మొదలైనప్పటి కథ వేరు. ఇప్పుడు వేరు. ఇది రీమేక్ మూవీ అయినా, లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కినా.. అవేవీ పవన్ సినిమాపై హైప్ తగ్గించలేకపోయాయి.
ఇందులో పవన్ అభిమానులకు నచ్చే అంశాలకు లోటు లేదని సంకేతాలు అందడంతో హైప్ ఆటోమేటిగ్గా వచ్చేసింది. రిలీజ్ దగ్గర పడేసరికి క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరుగుతున్నాయీ చిత్రానికి. కాకపోతే ఒకటే ఆందోళన కలిగిస్తున్న విషయం. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు, అదనపు షోలు పడేలా లేవు. ఇందుకోసం గట్టిగానే ప్రయత్నం జరుగుతోంది కానీ.. ఇప్పటిదాకా కన్ఫర్మేషన్ రాలేదు.
పవన్ రీఎంట్రీ మీద ఉన్న ఆసక్తి దృష్ట్యా ఏపీ, తెలంగాణల్లో ఎక్కడైనా సరే.. బెనిఫిట్ షోలు వేసినా, అదనపు షోలు నడిపించినా.. వీకెండ్లో భారీగా అదనపు ఆదాయం వస్తుంది. షేర్ అనూహ్యంగా ఉంటుంది. వీకెండ్ అంతా పండుగ చేసుకోవచ్చు. డిమాండ్ దృష్ట్యా బెనిఫిట్ షోలకు ఎంత రేటు పెట్టినా కొంటారు జనం. ఈ నేపథ్యంలో వాటి కోసం ఘనంగా ప్రణాళికలు వేసుకున్నారు. ఏపీలో అయితే భారీగా షోలు ప్లాన్ చేశారు.
కానీ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వాలు ఈ దిశగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. మొన్నటిదాకా సానుకూల సంకేతాలు కనిపించాయి కానీ.. నిన్న ప్రధానితో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ జరిగాక పరిస్థితులు మారిపోయాయి. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపడమే ఎక్కువ అని.. ఈ స్థితిలో అదనపు షోలకు అవకాశమిచ్చి కోవిడ్ వ్యాప్తికి కారణం కాకూడదనే అభిప్రాయానికి ప్రభుత్వాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు, అదనపు షోలు దాదాపు లేనట్లే. మరి ఈ స్థితిలో పవన్ మూవీ వంద కోట్ల షేర్ సాధించి బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవడం అంటే సవాలే. అదే కనుక పవన్ సాధించగలిగాడంటే అతడి క్రేజ్కు తిరుగులేనట్లే.
This post was last modified on April 6, 2021 6:03 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…