ఇండియన్ సినిమాలు ఓ వైపు బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేక చతికిలపడుతుంటే.. ఓ హాలీవుడ్ మూవీ వచ్చి అదరగొట్టేయడం ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ సినిమానే.. గాడ్జిల్లా వెర్సస్ కాంగ్. రెండు వారాల కిందట విడుదలైన ఈ చిత్రం ఇండియాలో భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగిస్తూ ఇప్పటికి పెద్ద ఎత్తున థియేటర్లలో రన్ అవుతోంది ఈ హాలీవుడ్ మూవీ.
పిల్లలకు విపరీతంగా నచ్చే జానర్ మూవీ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను బాగానే చూస్తున్నారు. ఉత్తరాదిన హిందీ సినిమాలకు కనీస స్పందన కొరవడగా.. ఈ చిత్రానికి మాత్రం మంచి వసూళ్లు వస్తున్నాయి. మల్టీప్లెక్సులు ఈ సినిమా మీదే నడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
రెండో వీకెండ్లో కూడా ఈ సినిమా మంచి షేర్ రాబట్టింది. సెకండ్ వీకెండ్లో ఈ సినిమా మూడు రోజులు కలిపి దేశవ్యాప్తంగా రూ.7 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. అంతకుముందు తొలి వారంలో గాడ్జిల్లా వెర్సస్ కాంగ్ దాదాపు రూ.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. అతి త్వరలోనే ఈ చిత్రం రూ.50 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేయబోతోంది. ఫుల్ రన్లో రూ.65-70 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇండియాలో కరోనా విరామం తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇదొకటి.
ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఇదే నంబర్ వన్ సినిమాగా నిలుస్తోంది. అక్కడ హిందీ సినిమాలు నామమాత్రంగా రిలీజవుతుండగా.. వాటికి రోజు రోజుకూ పరిస్థితి దుర్భరంగా తయారవుతోంది. దీంతో సినిమాల విడుదలే ఆపేస్తున్నారు. దీంతో అక్కడి థియేటర్లు నడపడానికి గాడ్జిల్లా వెర్సస్ కింగ్ రెండు వారాలుగా ఉపయోగపడుతోంది. దక్షిణాదిన సైతం ఈ సినిమా మంచి వసూళ్లే రాబట్టింది.
This post was last modified on April 6, 2021 7:42 am
తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ టికెట్ రేట్లు వెయ్యి రూపాయలు టచ్ అయితేనే తీవ్రంగా అభ్యంతర పెట్టే విషయమవుతుంది. అలాంటిది దానికి…
కమర్షియల్ రాజ్యంలో తాను అనుకున్న సిద్ధాంతాలకు మాత్రమే కట్టుబడి సినిమాలు తీసిన హీరో, దర్శకుడిగా ఆర్ నారాయణమూర్తి అంటే ప్రేక్షకులకే…
కింగ్ అఫ్ కంటెంట్ లేదా ఎంటర్ టైన్మెంట్ అని వినడానికి బాగానే ఉంది కానీ హీరో విష్ణు తన ఎంపికను…
దేశం మొత్తం టీ20 ప్రపంచకప్ విజయాన్ని సంబరంగా జరుపుకుంటున్న వేళ, ఆ గెలుపు వెనుక కొందరు ఆటగాళ్లు అనుభవించిన గుండెకోత…
తమిళనాట సినీ, రాజకీయ రంగాల్లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన పేరు.. త్రిష.ఈ సీనియర్ నటికి, రాజకీయాల్లోకి వచ్చిన అగ్ర కథానాయకుడు…
తెలివి ఎవరి సొత్తూ కాదు. ఐడియా ఉండాలేకానీ.. ఎంత కష్టమైన పనైనా సులువుగా మారిపోవడంతోపాటు సులువుగా మార్చుకోవడానికి కూడా అవకాశం…