ఇండియన్ సినిమాలు ఓ వైపు బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేక చతికిలపడుతుంటే.. ఓ హాలీవుడ్ మూవీ వచ్చి అదరగొట్టేయడం ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ సినిమానే.. గాడ్జిల్లా వెర్సస్ కాంగ్. రెండు వారాల కిందట విడుదలైన ఈ చిత్రం ఇండియాలో భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగిస్తూ ఇప్పటికి పెద్ద ఎత్తున థియేటర్లలో రన్ అవుతోంది ఈ హాలీవుడ్ మూవీ.
పిల్లలకు విపరీతంగా నచ్చే జానర్ మూవీ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను బాగానే చూస్తున్నారు. ఉత్తరాదిన హిందీ సినిమాలకు కనీస స్పందన కొరవడగా.. ఈ చిత్రానికి మాత్రం మంచి వసూళ్లు వస్తున్నాయి. మల్టీప్లెక్సులు ఈ సినిమా మీదే నడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
రెండో వీకెండ్లో కూడా ఈ సినిమా మంచి షేర్ రాబట్టింది. సెకండ్ వీకెండ్లో ఈ సినిమా మూడు రోజులు కలిపి దేశవ్యాప్తంగా రూ.7 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. అంతకుముందు తొలి వారంలో గాడ్జిల్లా వెర్సస్ కాంగ్ దాదాపు రూ.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. అతి త్వరలోనే ఈ చిత్రం రూ.50 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేయబోతోంది. ఫుల్ రన్లో రూ.65-70 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇండియాలో కరోనా విరామం తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇదొకటి.
ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఇదే నంబర్ వన్ సినిమాగా నిలుస్తోంది. అక్కడ హిందీ సినిమాలు నామమాత్రంగా రిలీజవుతుండగా.. వాటికి రోజు రోజుకూ పరిస్థితి దుర్భరంగా తయారవుతోంది. దీంతో సినిమాల విడుదలే ఆపేస్తున్నారు. దీంతో అక్కడి థియేటర్లు నడపడానికి గాడ్జిల్లా వెర్సస్ కింగ్ రెండు వారాలుగా ఉపయోగపడుతోంది. దక్షిణాదిన సైతం ఈ సినిమా మంచి వసూళ్లే రాబట్టింది.
This post was last modified on April 6, 2021 7:42 am
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా నిలవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…