ఇండియన్ సినిమాలు ఓ వైపు బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేక చతికిలపడుతుంటే.. ఓ హాలీవుడ్ మూవీ వచ్చి అదరగొట్టేయడం ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ సినిమానే.. గాడ్జిల్లా వెర్సస్ కాంగ్. రెండు వారాల కిందట విడుదలైన ఈ చిత్రం ఇండియాలో భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగిస్తూ ఇప్పటికి పెద్ద ఎత్తున థియేటర్లలో రన్ అవుతోంది ఈ హాలీవుడ్ మూవీ.
పిల్లలకు విపరీతంగా నచ్చే జానర్ మూవీ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను బాగానే చూస్తున్నారు. ఉత్తరాదిన హిందీ సినిమాలకు కనీస స్పందన కొరవడగా.. ఈ చిత్రానికి మాత్రం మంచి వసూళ్లు వస్తున్నాయి. మల్టీప్లెక్సులు ఈ సినిమా మీదే నడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
రెండో వీకెండ్లో కూడా ఈ సినిమా మంచి షేర్ రాబట్టింది. సెకండ్ వీకెండ్లో ఈ సినిమా మూడు రోజులు కలిపి దేశవ్యాప్తంగా రూ.7 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. అంతకుముందు తొలి వారంలో గాడ్జిల్లా వెర్సస్ కాంగ్ దాదాపు రూ.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. అతి త్వరలోనే ఈ చిత్రం రూ.50 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేయబోతోంది. ఫుల్ రన్లో రూ.65-70 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇండియాలో కరోనా విరామం తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇదొకటి.
ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఇదే నంబర్ వన్ సినిమాగా నిలుస్తోంది. అక్కడ హిందీ సినిమాలు నామమాత్రంగా రిలీజవుతుండగా.. వాటికి రోజు రోజుకూ పరిస్థితి దుర్భరంగా తయారవుతోంది. దీంతో సినిమాల విడుదలే ఆపేస్తున్నారు. దీంతో అక్కడి థియేటర్లు నడపడానికి గాడ్జిల్లా వెర్సస్ కింగ్ రెండు వారాలుగా ఉపయోగపడుతోంది. దక్షిణాదిన సైతం ఈ సినిమా మంచి వసూళ్లే రాబట్టింది.
This post was last modified on April 6, 2021 7:42 am
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…