సౌత్ ఇండియాలో కంటెంట్ క్వాలిటీ పరంగా కన్నడ సినీ పరిశ్రమ అన్నింటికంటే దిగువన ఉంటుంది. అక్కడ ఇప్పటికీ ఫార్ములాటిక్ మాస్ సినిమాలదే రాజ్యం. స్టార్ హీరోలందరూ మూస మాస్ సినిమాలే చేస్తుంటారు. వేరే భాషల్లో ఒక కమర్షియల్ సినిమా హిట్టయితే చాలు.. దాన్ని పట్టుకొచ్చి రీమేక్ చేసేస్తుంటారు. తెలుగు, తమిళంలో ఎప్పుడో అరగదీసేసిన మాస్ ఫార్ములాలనే వాళ్లు అనుసరిస్తుంటారు.
అప్పుడప్పుడూ అక్కడ కూడా కొన్ని విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాలు వస్తుంటాయి కానీ.. ఎక్కువగా మూస మాస్ సినిమాలదే రాజ్యం. అందుకే కన్నడ హీరోలు వేరే భాషల వాళ్లను పెద్దగా ఆకట్టుకోలేకపోతుంటారు. ఆ భాషా చిత్రాలు కర్ణాటక దాటి పెద్దగా ప్రభావం చూపవు. ఒకప్పుడు ఉపేంద్ర మాత్రమే కొంత ప్రభావం చూపగలిగాడు. చాలా ఏళ్లకు కేజీఎఫ్ సినిమా బౌండరీలు దాటి ప్రభావం చూపింది. ఆ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ విజయాన్నే అందుకుంది.
ఐతే కేజీఎఫ్ ఆడేయగానే.. కన్నడ స్టార్ హీరోలకు తెలుగు మార్కెట్ మీద ఆశ పుట్టేసి తమ సినిమాలను అనువాదం చేయడం మొదలుపెట్టారు. గత నెలలో శాండిల్వుడ్ బిగ్ స్టార్లలో ఒకడైన దర్శన్ సినిమా రాబర్ట్ తెలుగులో రిలీజ్ కాగా.. ఈ నెలలో మరో పెద్ద స్టార్ పునీత్ రాజ్కుమార్ మూవీ యువరత్న తెలుగులో విడుదలైంది. అలాగే కేజీఎఫ్ స్టార్ యశ్ నటించిన పాత సినిమాను గజకేసరి పేరుతో ఇక్కడ వదిలారు. కానీ వీటిలో ఏదీ ప్రభావం చూపలేకపోయింది. ఇవన్నీ రొటీన్ మాస్ మసాలా సినిమాలే.
ప్రస్తుతం మన హీరోలవే ఇలాంటి సినిమాలు నడవడం కష్టంగా ఉంది. ఇక మనకు పరిచయం లేని హీరోలు అవే చేస్తే ఏం పట్టించుకుంటారు. ఏదైనా కొత్తగా ట్రై చేస్తే, ప్రయోగాలు చేస్తే వాటిపై ఓ లుక్కేస్తారేమో కానీ.. ఈ టైపు మసాలా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కష్టమని కన్నడ స్టార్లు అర్థం చేసుకోవాలి. లేదంటే రిలీజ్ ఖర్చులు కూడా వర్కవుట్ కావడం కష్టం.
This post was last modified on April 6, 2021 7:18 am
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…