సౌత్ ఇండియాలో కంటెంట్ క్వాలిటీ పరంగా కన్నడ సినీ పరిశ్రమ అన్నింటికంటే దిగువన ఉంటుంది. అక్కడ ఇప్పటికీ ఫార్ములాటిక్ మాస్ సినిమాలదే రాజ్యం. స్టార్ హీరోలందరూ మూస మాస్ సినిమాలే చేస్తుంటారు. వేరే భాషల్లో ఒక కమర్షియల్ సినిమా హిట్టయితే చాలు.. దాన్ని పట్టుకొచ్చి రీమేక్ చేసేస్తుంటారు. తెలుగు, తమిళంలో ఎప్పుడో అరగదీసేసిన మాస్ ఫార్ములాలనే వాళ్లు అనుసరిస్తుంటారు.
అప్పుడప్పుడూ అక్కడ కూడా కొన్ని విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాలు వస్తుంటాయి కానీ.. ఎక్కువగా మూస మాస్ సినిమాలదే రాజ్యం. అందుకే కన్నడ హీరోలు వేరే భాషల వాళ్లను పెద్దగా ఆకట్టుకోలేకపోతుంటారు. ఆ భాషా చిత్రాలు కర్ణాటక దాటి పెద్దగా ప్రభావం చూపవు. ఒకప్పుడు ఉపేంద్ర మాత్రమే కొంత ప్రభావం చూపగలిగాడు. చాలా ఏళ్లకు కేజీఎఫ్ సినిమా బౌండరీలు దాటి ప్రభావం చూపింది. ఆ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ విజయాన్నే అందుకుంది.
ఐతే కేజీఎఫ్ ఆడేయగానే.. కన్నడ స్టార్ హీరోలకు తెలుగు మార్కెట్ మీద ఆశ పుట్టేసి తమ సినిమాలను అనువాదం చేయడం మొదలుపెట్టారు. గత నెలలో శాండిల్వుడ్ బిగ్ స్టార్లలో ఒకడైన దర్శన్ సినిమా రాబర్ట్ తెలుగులో రిలీజ్ కాగా.. ఈ నెలలో మరో పెద్ద స్టార్ పునీత్ రాజ్కుమార్ మూవీ యువరత్న తెలుగులో విడుదలైంది. అలాగే కేజీఎఫ్ స్టార్ యశ్ నటించిన పాత సినిమాను గజకేసరి పేరుతో ఇక్కడ వదిలారు. కానీ వీటిలో ఏదీ ప్రభావం చూపలేకపోయింది. ఇవన్నీ రొటీన్ మాస్ మసాలా సినిమాలే.
ప్రస్తుతం మన హీరోలవే ఇలాంటి సినిమాలు నడవడం కష్టంగా ఉంది. ఇక మనకు పరిచయం లేని హీరోలు అవే చేస్తే ఏం పట్టించుకుంటారు. ఏదైనా కొత్తగా ట్రై చేస్తే, ప్రయోగాలు చేస్తే వాటిపై ఓ లుక్కేస్తారేమో కానీ.. ఈ టైపు మసాలా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కష్టమని కన్నడ స్టార్లు అర్థం చేసుకోవాలి. లేదంటే రిలీజ్ ఖర్చులు కూడా వర్కవుట్ కావడం కష్టం.
This post was last modified on April 6, 2021 7:18 am
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…