సౌత్ ఇండియాలో కంటెంట్ క్వాలిటీ పరంగా కన్నడ సినీ పరిశ్రమ అన్నింటికంటే దిగువన ఉంటుంది. అక్కడ ఇప్పటికీ ఫార్ములాటిక్ మాస్ సినిమాలదే రాజ్యం. స్టార్ హీరోలందరూ మూస మాస్ సినిమాలే చేస్తుంటారు. వేరే భాషల్లో ఒక కమర్షియల్ సినిమా హిట్టయితే చాలు.. దాన్ని పట్టుకొచ్చి రీమేక్ చేసేస్తుంటారు. తెలుగు, తమిళంలో ఎప్పుడో అరగదీసేసిన మాస్ ఫార్ములాలనే వాళ్లు అనుసరిస్తుంటారు.
అప్పుడప్పుడూ అక్కడ కూడా కొన్ని విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాలు వస్తుంటాయి కానీ.. ఎక్కువగా మూస మాస్ సినిమాలదే రాజ్యం. అందుకే కన్నడ హీరోలు వేరే భాషల వాళ్లను పెద్దగా ఆకట్టుకోలేకపోతుంటారు. ఆ భాషా చిత్రాలు కర్ణాటక దాటి పెద్దగా ప్రభావం చూపవు. ఒకప్పుడు ఉపేంద్ర మాత్రమే కొంత ప్రభావం చూపగలిగాడు. చాలా ఏళ్లకు కేజీఎఫ్ సినిమా బౌండరీలు దాటి ప్రభావం చూపింది. ఆ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ విజయాన్నే అందుకుంది.
ఐతే కేజీఎఫ్ ఆడేయగానే.. కన్నడ స్టార్ హీరోలకు తెలుగు మార్కెట్ మీద ఆశ పుట్టేసి తమ సినిమాలను అనువాదం చేయడం మొదలుపెట్టారు. గత నెలలో శాండిల్వుడ్ బిగ్ స్టార్లలో ఒకడైన దర్శన్ సినిమా రాబర్ట్ తెలుగులో రిలీజ్ కాగా.. ఈ నెలలో మరో పెద్ద స్టార్ పునీత్ రాజ్కుమార్ మూవీ యువరత్న తెలుగులో విడుదలైంది. అలాగే కేజీఎఫ్ స్టార్ యశ్ నటించిన పాత సినిమాను గజకేసరి పేరుతో ఇక్కడ వదిలారు. కానీ వీటిలో ఏదీ ప్రభావం చూపలేకపోయింది. ఇవన్నీ రొటీన్ మాస్ మసాలా సినిమాలే.
ప్రస్తుతం మన హీరోలవే ఇలాంటి సినిమాలు నడవడం కష్టంగా ఉంది. ఇక మనకు పరిచయం లేని హీరోలు అవే చేస్తే ఏం పట్టించుకుంటారు. ఏదైనా కొత్తగా ట్రై చేస్తే, ప్రయోగాలు చేస్తే వాటిపై ఓ లుక్కేస్తారేమో కానీ.. ఈ టైపు మసాలా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కష్టమని కన్నడ స్టార్లు అర్థం చేసుకోవాలి. లేదంటే రిలీజ్ ఖర్చులు కూడా వర్కవుట్ కావడం కష్టం.
This post was last modified on April 6, 2021 7:18 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…