Movie News

ఆ ప‌వ‌ర్ స్టార్ సాధించాడు.. మ‌న ప‌వ‌ర్ స్టార్‌కు కోతే

క‌న్న‌డ‌నాట సినీ రంగంలో నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. క‌ర్ణాట‌క థియేట‌ర్లు మొన్న‌టిదాకా 100 శాతం ఆక్యుపెన్సీతోనే న‌డుస్తుండ‌గా.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వం థియేటర్లలో ఆక్యుపెన్సీని ఉన్నట్లుండి 50 శాతానికి తగ్గించేసింది. ఈ ప్ర‌భావం కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమా ‘యువ‌ర‌త్న’ మీద గ‌ట్టిగా ప‌డింది.

తొలి రోజు వంద శాతం ఆక్యుపెన్సీతో నడిచి వెంటనే దాన్ని 50 శాతానికి తగ్గించేయడంతో ‘యువరత్న’ టీం షాక్‌కు గురైంది. పునీత్ మాత్రమే కాదు.. శాండిల్‌వుడ్ హీరోలు చాలామంది ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆల్రెడీ వీకెండ్ మొత్తానికి వంద శాతానికి బుకింగ్స్ అయిపోయాక ఇలా ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గిస్తే ఎలా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ విషయమై పునీత్ సహా చిత్ర బృందంలోని కీలక వ్యక్తులంతా కలిసి ఏకంగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప దగ్గరికే వెళ్లిపోయారు.

ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించాలని కోరగా. యడ్యూరప్ప వారిని కరుణించారు. ఇప్పటికే బుకింగ్స్ జరిగిపోయిన నేపథ్యంలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని అమలు చేయడం కష్టమని భావించి.. 100 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడిపేలా జీవో ఇచ్చారు. కానీ అందులో చిన్న మెలిక పెట్టారు. ఈ నిర్ణయం ఈ మంగళవారం వరకు మాత్రమే కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 7, బుధవారం నుంచి 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఇది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సినిమా ‘వకీల్ సాబ్’కు పెద్ద ఎదురు దెబ్బే. పవన్ సినిమాలు కర్ణాటకలో భారీ వసూళ్లు సాధిస్తాయన్న సంగతి తెలిసిందే. పది కోట్లకు పైగా షేర్ సాధించే స్టామినా పవన్‌కు ఉంది. కానీ ఇప్పుడు 50 శాతానికి ఆక్యుపెన్సీని తగ్గించేస్తుండటంతో ఈ శుక్రవారం విడుదలయ్యే ఈ చిత్రానికి పెద్ద డెంట్ పడ్డట్లే.

This post was last modified on April 5, 2021 11:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

టాక్ తేడాగా ఉన్నా కలెక్షన్లు అదిరిపోతున్నాయ్

కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…

22 minutes ago

బాలయ్యకు ‘జాట్’ ఫార్ములా వద్దు

ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…

48 minutes ago

అధికారికం… పాస్టర్ ప్రవీణ్ మరణం హత్య కాదు

ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…

1 hour ago

తెలివైన నిర్ణయం తీసుకున్న సారంగపాణి

ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…

3 hours ago

బాబు చేతులు మీదుగా అంగరంగ వైభవంగా కళ్యాణం

ఏపీలో రాముడి త‌ర‌హా రామ‌రాజ్యం తీసుకురావాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. రామ‌రాజ్యం అంటే.. ఏపీ స‌మ‌గ్ర అభివృద్ధి…

3 hours ago

త‌మిళ‌నాడుకు మంచి రోజులు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

త‌మిళ‌నాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవ‌డంపై ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.…

4 hours ago