రీఎంట్రీలో శరవేగంగా సినిమాలు చేసుకుపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే వకీల్ సాబ్ పూర్తి కాగా.. హరిహర వీర మల్లుతో పాటు అయ్యప్పనుం కోషీయుం రీమేక్లో సమాంతరంగా నటిస్తున్నాడాయన. హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిల సినిమాలు కూడా లైన్లో ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కోసం మరికొందరు దర్శకులు, నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.
రాజకీయాల్లో పూర్తి స్థాయిలో కొనసాగుతూనే హీరోగా ఇంత బిజీగా ఉన్న పవన్.. నిర్మాతగా భారీ ప్రణాళికలతో రంగంలోకి దిగుతుండటం విశేషం. ఆయన నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్లో ఏకంగా 15 సినిమాలు రాబోతున్నాయన్న సమాచారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
టాలీవుడ్లో చిన్న, మీడియం రేంజ్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న పీపుల్స్ మీడియా సంస్థ అధినేత విశ్వ ప్రసాద్తో పవన్ చేతులు కలిపాడు. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్కు ప్రోత్సాహాన్నిస్తూ పవన్, విశ్వప్రసాద్ కలిసి వరుసగా సినిమాలు నిర్మించబోతున్నారట. వీరి కలయికలో ఏకంగా 15 సినిమాలు రాబోతుండటం విశేషం. ఇందులో ఆరు చిన్న సినిమాలు కాగా.. ఆరు మీడియం రేంజ్ చిత్రాలట. రెండు భారీ సినిమాలు కూడా వీరి కలయికలో రాబోతున్నారట. ఈ మేరకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు.
తన పేరిట పవన్ చాలా ఏళ్ల కిందటే బేనర్ పెట్టాడు కానీ.. దాన్నెప్పుడూ అంత యాక్టివ్గా ఉంచలేదు పవన్. గబ్బర్ సింగ్ సినిమాను ఈ బేనర్లోనే చేయాలని అనుకున్నాడు కానీ.. తర్వాత బండ్ల గణేష్కు నిర్మాణ బాధ్యతలు ఇచ్చేశాడు. ఇప్పటిదాకా పవన్ బేనర్లో ఒక్క సినిమా కూడా రాలేదు. చరణ్ హీరోగా పవన్ ఓ సినిమాను నిర్మిస్తాడని ప్రచారం జరిగింది కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఉన్నట్లుండి ప్రొడక్షన్లోకి పవన్ ఇంత సీరియస్గా దిగడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on April 3, 2021 6:57 am
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…