ఈ హెడ్డింగ్ చూడగానే.. ఈ తండ్రీ కొడుకుల కాంబినేన్ ఎప్పుడు చూడబోతున్నాం.. దాని దర్శకుడు ఎవరు.. ఏ సంస్థ నిర్మించబోతోంది.. అన్న సందేహాలు కలగొచ్చు. ఐతే అప్పుడే అంతగా అంచనాల్లోకి వెళ్లిపోకండి. ఇది జస్ట్ ఒక ఊహ మాత్రమే. ఈ మాట నాగార్జున నుంచే వచ్చింది మరి.
వందో సినిమాకు ఎలా ప్లాన్ చేస్తున్నారు.. అఖిల్ కూడా అందులో నటిస్తాడట కదా అని నాగార్జునను ‘వైల్డ్ డాగ్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూల సందర్భంగా మీడియా వాళ్లు అడిగితే.. నాగ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. వందో సినిమా కచ్చితంగా హిట్టయ్యేలా చూసుకోవాలని అనుకుంటున్నానని.. ఆ రకంగానే ప్లానింగ్ జరుగుతోందని.. ఐతే అందులో అఖిల్ నటిస్తాడా లేదా అన్నది చెప్పలేనని.. దానికింకా సమయం ఉందని నాగ్ అన్నాడు. ఐతే తనకైతే అఖిల్తో మంచి యాక్షన్ సినిమా చేయాలని ఆశగా ఉందని నాగ్ తెలిపాడు.
ఇక తాను నటిస్తున్న, నటించబోయే సినిమాల గురించి నాగ్ చెబుతూ.. హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ ఈ ఏడాది తన నుంచి రాబోతున్న ఎగ్జైటింగ్ మూవీస్లో ఒకటని నాగ్ అన్నాడు. ఈ సినిమాలో తన పాత్ర చాలా పవర్ ఫుల్గా ఉంటుందని.. అరగంటకు కాస్త ఎక్కువ నిడివితో తన పాత్ర ఉంటుందని.. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్టవుతుందని చెప్పగలనని నాగ్ అన్నాడు. మూడు భాగాలుగా ‘బ్రహ్మాస్త్ర’ను ప్లాన్ చేసినట్లు నాగ్ వెల్లడించాడు.
తెలుగులో ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్నానని.. జులైలో చిత్రీకరణ పూర్తవుతుందని.. మంచి డేట్ చూసి రిలీజ్ చేస్తామని చెప్పాడు. ‘బంగార్రాజు’ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు స్కోప్ ఉందని అనిపిస్తే ఈ ఏడాదే ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని చెప్పాడు నాగ్. అలా కాని పక్షంలో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఆయన స్పష్టత ఇవ్వలేదు.
This post was last modified on April 1, 2021 8:53 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…