ఈ హెడ్డింగ్ చూడగానే.. ఈ తండ్రీ కొడుకుల కాంబినేన్ ఎప్పుడు చూడబోతున్నాం.. దాని దర్శకుడు ఎవరు.. ఏ సంస్థ నిర్మించబోతోంది.. అన్న సందేహాలు కలగొచ్చు. ఐతే అప్పుడే అంతగా అంచనాల్లోకి వెళ్లిపోకండి. ఇది జస్ట్ ఒక ఊహ మాత్రమే. ఈ మాట నాగార్జున నుంచే వచ్చింది మరి.
వందో సినిమాకు ఎలా ప్లాన్ చేస్తున్నారు.. అఖిల్ కూడా అందులో నటిస్తాడట కదా అని నాగార్జునను ‘వైల్డ్ డాగ్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూల సందర్భంగా మీడియా వాళ్లు అడిగితే.. నాగ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. వందో సినిమా కచ్చితంగా హిట్టయ్యేలా చూసుకోవాలని అనుకుంటున్నానని.. ఆ రకంగానే ప్లానింగ్ జరుగుతోందని.. ఐతే అందులో అఖిల్ నటిస్తాడా లేదా అన్నది చెప్పలేనని.. దానికింకా సమయం ఉందని నాగ్ అన్నాడు. ఐతే తనకైతే అఖిల్తో మంచి యాక్షన్ సినిమా చేయాలని ఆశగా ఉందని నాగ్ తెలిపాడు.
ఇక తాను నటిస్తున్న, నటించబోయే సినిమాల గురించి నాగ్ చెబుతూ.. హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ ఈ ఏడాది తన నుంచి రాబోతున్న ఎగ్జైటింగ్ మూవీస్లో ఒకటని నాగ్ అన్నాడు. ఈ సినిమాలో తన పాత్ర చాలా పవర్ ఫుల్గా ఉంటుందని.. అరగంటకు కాస్త ఎక్కువ నిడివితో తన పాత్ర ఉంటుందని.. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్టవుతుందని చెప్పగలనని నాగ్ అన్నాడు. మూడు భాగాలుగా ‘బ్రహ్మాస్త్ర’ను ప్లాన్ చేసినట్లు నాగ్ వెల్లడించాడు.
తెలుగులో ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్నానని.. జులైలో చిత్రీకరణ పూర్తవుతుందని.. మంచి డేట్ చూసి రిలీజ్ చేస్తామని చెప్పాడు. ‘బంగార్రాజు’ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు స్కోప్ ఉందని అనిపిస్తే ఈ ఏడాదే ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని చెప్పాడు నాగ్. అలా కాని పక్షంలో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఆయన స్పష్టత ఇవ్వలేదు.
This post was last modified on April 1, 2021 8:53 am
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…