టీజర్ టాక్: తమన్నా షాకులేమీ ఇవ్వలేదే
బడా బడా హీరోయిన్లు ఒక్కొక్కరుగా డిజిటల్ డెబ్యూకు రెడీ అయిపోతున్నారు. సమంత రెండేళ్ల కిందటే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ను ఓకే చేసింది. కాకపోతే కరోనా వల్ల ఈ సిరీస్ చిత్రీకరణ ఆలస్యమైంది. విడుదలలోనూ జాప్యం జరుగుతోంది. ఐతే ఇందులో సమంత పాత్ర మీద అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఆమె ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో చేసింది టెర్రరిస్టు పాత్ర కావడం విశేషం.
ఈ పాత్రకు కావాల్సినంత హైప్ వచ్చింది. మరో అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ ఇటీవలే ‘లైవ్ టెలికాస్ట్’ అనే హార్రర్ వెబ్ సిరీస్తో డిజిటల్ డెబ్యూ చేసింది. అది జస్ట్ ఓకే అనిపించింది. ఆమె పాత్రకు ఏమంత మంచి గుర్తింపు రాలేదు. ఇక మరో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ చేసిన ‘పిట్టకథలు’లో తన ఎపిసోడ్ ఏమంత ప్రత్యేకంగా అనిపించలేదు. ఇప్పుడిక తమన్నా డిజిటల్ అరంగేట్రానికి రెడీ అయింది.
తమన్నా ప్రధాన పాత్రలో ‘లెవెంత్ అవర్’ అనే సిరీస్ తెరకెక్కింది. ‘ఆహా’ ఓటీటీలో ఇది ప్రసారం కానుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ టీజర్ను తాజాగా లాంచ్ చేశారు. పురుషాధిక్య ప్రపంచంలో ఓ మహిళ ఓ కార్పొరేట్ కంపెనీని నడపడంలో ఎదుర్కొన్న సవాళ్లేంటి.. అడుగడుగునా అడ్డంకులు, అవమానాల మధ్య వాటిని ఆమె ఎలా అధిగమించింది అనే కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కింది. మహిళా సాధికారత ఇందులో ప్రధానాంశంగా కనిపిస్తోంది.
నిజానికి తమన్నా-ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు థ్రిల్లర్ ఆశించారు. డిజిటల్ డెబ్యూలో చాలామంది హీరోయిన్లు థ్రిల్లింగ్ కథాంశాలనే ఎంచుకుంటారు. కానీ తమన్నా మాత్రం సినమాల్లో చూసే సోషల్ డ్రామా కథాంశానికి ఓటేసింది. ప్రేక్షకులు ఆశించే థ్రిల్స్ కానీ.. సర్ప్రైజ్లు కానీ.. షాకులు కానీ ఇందులో ఏమీ కనిపించలేదు. వెబ్ సిరీస్ల్లో ఈ జానర్ పట్ల ప్రేక్షకులను ఆకర్షించడం అంత తేలిక కాదు. మరి ఈ సిరీస్ ఏమేర ఆదరణ పొందుతుందో చూడాలి.
This post was last modified on March 29, 2021 9:27 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…