మొత్తానికి యుఎస్లో తెలుగు సినిమాల మార్కెట్ బాగానే పుంజుకున్నట్లు కనిపిస్తోంది. మిగతా భాషా చిత్రాలకు ఇంకా అక్కడ ఊపు రాలేదు కానీ.. దేశీయ మార్కెట్లో మాదిరే యుఎస్లోనూ తెలుగు సినిమాకు మంచి ఆదరణే దక్కుతోంది. కరోనా విరామం తర్వాత క్రాక్, ఉప్పెన సినిమాలకు ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చాయక్కడ. తెలుగు సినిమాకు అక్కడ ఊపు తెచ్చిన చిత్రం జాతిరత్నాలు.
కరోనా బ్రేక్ తర్వాత యుఎస్లో అత్యధిక లొకేషన్లలో రిలీజైన సినిమా ఇది. ప్రిమియర్లు కూడా భారీగానే వేశారు. ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. కొన్ని గంటలు ప్రయాణించి ప్రేక్షకులకు ఈ సినిమా చూశారు. ఈ క్రమంలోనే జాతిరత్నాలు చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఫుల్ రన్లో ఏకంగా మిలియన్ డాలర్ వసూళ్లతో ఔరా అనిపించింది ఈ సినిమా. మరే ఇండియన్ సినిమా కూడా ఇప్పటిదాకా హాఫ్ మిలియన్ మార్కును కూడా అందుకోకపోవడం గమనార్హం.
జాతిరత్నాలు ఇచ్చిన ఊపును ఇప్పుడు రంగ్ దే మూవీ కొనసాగిస్తోంది. అక్కడి బాక్సాఫీస్ ఊపును ఈ సినిమా బాగా అందిపుచ్చుకుంది. ఈ చిత్రానికి యుఎస్లో రూ.1.5 కోట్ల మేర బిజినెస్ జరగడం విశేషం. అందుకు తగ్గట్లే ఓపెనింగ్స్ కూడా వస్తున్నాయి. ప్రిమియర్లతో కలిపి శనివారం అయ్యేసరికి రంగ్దే సినిమాకు 2.3 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి. రూపాయల్లో చెప్పాలంటే గ్రాస్ రూ.1.67 కోట్ల దాకా వచ్చింది. ఆదివారం అయ్యేసరికి రూ.2 కోట్ల గ్రాస్ మార్కును ఈ సినిమా దాటుతుందని అంచనా వేస్తున్నారు. బయ్యర్లు త్వరలోనే లాభాల బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
యుఎస్ తెలుగు ప్రేక్షకులు కోరుకునే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది. ఈ వారం వచ్చిన మిగతా రెండు తెలుగు చిత్రాలకు మాత్రం యుఎస్లో కనీస స్పందన లేదు. అరణ్య, తెల్లవారితే గురువారం చిత్రాలను వాళ్లు పట్టించుకోవడం లేదు. అరణ్య సినిమాకు ఇప్పటిదాకా పది వేల డాలర్లు కూడా వసూలు కాలేదు. తెల్లవారితే గురువారం పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది.
This post was last modified on March 28, 2021 10:48 pm
దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయకుడు అయినా.. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…