టాలీవుడ్లో మరే హీరోకూ దొరకని ఎంట్రీ లభించింది మెగా కుర్రాడు పంజా వైష్ణవ్ తేజ్కు. మెగాస్టార్ వారసుడిగా భారీ అంచనాలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్.. తొలి సినిమా చిరుతతో నెలకొల్పిన రికార్డును కేవలం మూడు రోజుల్లో వైష్ణవ్ డెబ్యూ మూవీ ఉప్పెన బద్దలు కొట్టేసింది. అప్పటికి, ఇప్పటికి టికెట్ల రేట్లు పెరిగి ఉండొచ్చు. పరిస్థితులు చాలా మారి ఉండొచ్చు. అయినా సరే.. చిరుత రికార్డును బద్దలు కొట్టడమే కాదు.. ఏకంగా వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది ఈ సినిమా.
మిగతా అరంగేట్ర హీరోల్లాగా మాస్-యాక్షన్ మూవీ చేయకపోయినా.. ఒక ప్రేమకథతో ఇలాంటి ఓపెనింగ్స్ తెచ్చుకోవడం అనూహ్యం. పైగా ఇందులో వైష్ణవ్ డీగ్లామరస్ రోల్ చేశాడు. ఉప్పెన భారీ విజయాన్నందుకోవడంతో వైష్ణవ్తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు వరుస కడుతున్నారు.
ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తన రెండో చిత్రాన్ని పూర్తి చేయగా.. నాగార్జున నిర్మాణంలో అతనో సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. అలాగే జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్తోనూ ఓ సినిమా అన్నారు. ఇప్పుడు మరో ఆసక్తికర ప్రాజెక్టుకు వైష్ణవ్ సంతకం చేసినట్లు సమాచారం. అర్జున్ రెడ్డి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసి.. ఆ చిత్రాన్ని తమిళంలో ఆదిత్యవర్మ పేరుతో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా రీమేక్ చేసి హిట్టు కొట్టిన గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
సీనియర్ నిర్మాత, మెగా కుటుంబానికి సన్నిహితుడైన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. మెహబూబాతో కథానాయికగా పరిచయం కానున్న కేతిక శర్మ ఇందులో కథానాయికగా నటించనుంది. వైష్ణవ్ మూడో సినిమా ఇదే కానుందని సమాచారం.
This post was last modified on March 28, 2021 10:33 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…