రామ్ చరణ్ ఇంకా ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాల్లో అతడి పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా కలయికలో కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. ‘ఆచార్య’లో చిరు, పూజా హెగ్డేలతో మరికొన్ని సీన్లు చేయాల్సి ఉంది. వచ్చే నెలా నెలన్నరలో ఈ పనంతా పూర్తి చేయాలని చూస్తున్నాడు చరణ్. ఆ తర్వాత అతడి ఫోకస్ మొత్తం శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా మీద ఉండనుంది.
ఐతే చరణ్ ఖాళీగా లేకపోయినా ఈ సినిమా కోసం దిల్ రాజు తన పాటికి తాను సన్నాహాలు చేసుకుపోతున్నాడు. శంకర్తో కలిసి ప్రి ప్రొడక్షన్ పనులను ఆయన పర్యవేక్షిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన చెన్నైలో ఆఫీస్ కూడా తెరిచేసినట్లు సమాచారం. శంకర్ అండ్ టీం అక్కడే ఉండి ప్రి ప్రొడక్షన్ పనులు చేసుకునేందుకు గాను ఈ ఏర్పాటన్నమాట.
దిల్ రాజు కూడా ఎప్పుడు చెన్నై వెళ్లినా.. శంకర్ ఇంటికి వెళ్లి కలుస్తూ వస్తన్నాడు. ఇక తమ ఆఫీస్లోనే అన్ని పనులూ జరిగేలా, శంకర్ను కలిసేలా చూసుకున్నాడు రాజు. ‘ఇండియన్-2’ సంగతి ఇప్పుడిప్పుడే తేలేలా లేకపోవడంతో రామ్ చరణ్ అందుబాటులోకి రాగానే.. అతడితో సినిమాను మొదలుపెట్టేయాలని శంకర్ చూస్తున్నాడు.
ఇది శంకర్ కెరీర్లో ఎక్కువగా చేసిన పొలిటికల్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు కథానాయికగా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఓ విదేశీ భామను తీసుకోబోతున్నట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. కియారా అద్వానీ పేరు కూడా తెరపైకి వచ్చింది. మరి ఎవరిని ఖరారు చేస్తారో చూడాలి. శంకర్, చరణ్లకు ఉన్న గుర్తింపు వల్ల ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లోనే చేయాలనుకుంటున్నారు. బడ్జెట్ రూ.200 కోట్ల పైమాటే అని మీడియాలో వార్తలొస్తున్నాయి.
This post was last modified on March 27, 2021 12:24 pm
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…