రామ్ చరణ్ ఇంకా ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాల్లో అతడి పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా కలయికలో కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. ‘ఆచార్య’లో చిరు, పూజా హెగ్డేలతో మరికొన్ని సీన్లు చేయాల్సి ఉంది. వచ్చే నెలా నెలన్నరలో ఈ పనంతా పూర్తి చేయాలని చూస్తున్నాడు చరణ్. ఆ తర్వాత అతడి ఫోకస్ మొత్తం శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా మీద ఉండనుంది.
ఐతే చరణ్ ఖాళీగా లేకపోయినా ఈ సినిమా కోసం దిల్ రాజు తన పాటికి తాను సన్నాహాలు చేసుకుపోతున్నాడు. శంకర్తో కలిసి ప్రి ప్రొడక్షన్ పనులను ఆయన పర్యవేక్షిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన చెన్నైలో ఆఫీస్ కూడా తెరిచేసినట్లు సమాచారం. శంకర్ అండ్ టీం అక్కడే ఉండి ప్రి ప్రొడక్షన్ పనులు చేసుకునేందుకు గాను ఈ ఏర్పాటన్నమాట.
దిల్ రాజు కూడా ఎప్పుడు చెన్నై వెళ్లినా.. శంకర్ ఇంటికి వెళ్లి కలుస్తూ వస్తన్నాడు. ఇక తమ ఆఫీస్లోనే అన్ని పనులూ జరిగేలా, శంకర్ను కలిసేలా చూసుకున్నాడు రాజు. ‘ఇండియన్-2’ సంగతి ఇప్పుడిప్పుడే తేలేలా లేకపోవడంతో రామ్ చరణ్ అందుబాటులోకి రాగానే.. అతడితో సినిమాను మొదలుపెట్టేయాలని శంకర్ చూస్తున్నాడు.
ఇది శంకర్ కెరీర్లో ఎక్కువగా చేసిన పొలిటికల్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు కథానాయికగా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఓ విదేశీ భామను తీసుకోబోతున్నట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. కియారా అద్వానీ పేరు కూడా తెరపైకి వచ్చింది. మరి ఎవరిని ఖరారు చేస్తారో చూడాలి. శంకర్, చరణ్లకు ఉన్న గుర్తింపు వల్ల ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లోనే చేయాలనుకుంటున్నారు. బడ్జెట్ రూ.200 కోట్ల పైమాటే అని మీడియాలో వార్తలొస్తున్నాయి.
This post was last modified on March 27, 2021 12:24 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…