రామ్ చరణ్ ఇంకా ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాల్లో అతడి పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా కలయికలో కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. ‘ఆచార్య’లో చిరు, పూజా హెగ్డేలతో మరికొన్ని సీన్లు చేయాల్సి ఉంది. వచ్చే నెలా నెలన్నరలో ఈ పనంతా పూర్తి చేయాలని చూస్తున్నాడు చరణ్. ఆ తర్వాత అతడి ఫోకస్ మొత్తం శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా మీద ఉండనుంది.
ఐతే చరణ్ ఖాళీగా లేకపోయినా ఈ సినిమా కోసం దిల్ రాజు తన పాటికి తాను సన్నాహాలు చేసుకుపోతున్నాడు. శంకర్తో కలిసి ప్రి ప్రొడక్షన్ పనులను ఆయన పర్యవేక్షిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన చెన్నైలో ఆఫీస్ కూడా తెరిచేసినట్లు సమాచారం. శంకర్ అండ్ టీం అక్కడే ఉండి ప్రి ప్రొడక్షన్ పనులు చేసుకునేందుకు గాను ఈ ఏర్పాటన్నమాట.
దిల్ రాజు కూడా ఎప్పుడు చెన్నై వెళ్లినా.. శంకర్ ఇంటికి వెళ్లి కలుస్తూ వస్తన్నాడు. ఇక తమ ఆఫీస్లోనే అన్ని పనులూ జరిగేలా, శంకర్ను కలిసేలా చూసుకున్నాడు రాజు. ‘ఇండియన్-2’ సంగతి ఇప్పుడిప్పుడే తేలేలా లేకపోవడంతో రామ్ చరణ్ అందుబాటులోకి రాగానే.. అతడితో సినిమాను మొదలుపెట్టేయాలని శంకర్ చూస్తున్నాడు.
ఇది శంకర్ కెరీర్లో ఎక్కువగా చేసిన పొలిటికల్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు కథానాయికగా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఓ విదేశీ భామను తీసుకోబోతున్నట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. కియారా అద్వానీ పేరు కూడా తెరపైకి వచ్చింది. మరి ఎవరిని ఖరారు చేస్తారో చూడాలి. శంకర్, చరణ్లకు ఉన్న గుర్తింపు వల్ల ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లోనే చేయాలనుకుంటున్నారు. బడ్జెట్ రూ.200 కోట్ల పైమాటే అని మీడియాలో వార్తలొస్తున్నాయి.
This post was last modified on March 27, 2021 12:24 pm
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…