Movie News

ఎఫ్‌-3లో ఇంకో హీరోయిన్


టాలీవుడ్ కామెడీ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘ఎఫ్-2’. రెండేళ్ల కిందట సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం వినయ విధేయ రామ, యన్.టి.ఆర్-కథానాయకుడు లాంటి భారీ చిత్రాలను వెనక్కి నెట్టి ఎంత పెద్ద విజయాన్నందుకుందో తెలిసిందే. ఏకంగా రూ.80 కోట్ల షేర్‌తో ఆశ్చర్యపరిచిందీ చిత్రం. ఇప్పుడీ చిత్రానికి ‘ఎఫ్-3’ పేరుతో సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

‘ఎఫ్-2’లో ప్రధాన పాత్రలు పోషించిన విక్టరీ వెంకటేష్-తమన్నా, వరుణ్ తేజ్-మెహ్రీన్ ఇందులోనూ కొనసాగబోతున్నారు. ‘ఎఫ్-2’లో ఈ ఇద్దరు హీరోయిన్లు ఎంతగా గ్లామర్ విందు చేశారో తెలిసిందే. వీరికి తోడు అనసూయ భరద్వాజ్ ఒక పాట, కొన్ని సన్నివేశాల్లో మెరిసింది. సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేసింది. ఇప్పుడు ‘ఎఫ్-3’లోనూ ఇలాగే అడిషనల్ గ్లామర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ చిత్రం కోసం అతను మరో హీరోయిన్ని తీసుకున్నాడు.

తెలుగులో నందమూరి బాలకృష్ణ చిత్రాలు ‘లెజెండ్’, ‘రూలర్’లతో పాటు ‘పండగ చేస్కో’ లాంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ‘ఎఫ్-3’లో మూడో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో ఫుల్ గ్లామరస్ రోల్ అని అంటున్నారు. ‘ఎఫ్-3’ లాంటి క్రేజీ సినిమాలో నటించడానికి ప్రస్తుతం ఫాంలో ఉన్న ఏ హీరోయిన్ అయినా సై అంటుంది. అలాంటిది ‘రూలర్’ తర్వాత కనిపించకుండా పోయిన సోనాల్‌ను ఈ సినిమా కోసం తీసుకోవడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఆమెకే ఈ రోల్ ఇవ్వడానికి కారణమేంటో తెర మీదే చూసి తెలుసుకోవాలి.

ఇప్పటికే 60 శాతానికి పైగా ‘ఎఫ్-3’ చిత్రీకరణ పూర్తయింది. మే-జూన్ మధ్య సినిమా షూటింగ్ అంతా అవగొట్టాలని చూస్తున్నారు. ఆగస్టు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ‘ఎఫ్-2’ను నిర్మించిన దిల్ రాజు నిర్మాణంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కబోతోంది.

This post was last modified on March 27, 2021 12:21 pm

Share
Show comments

Recent Posts

తెలుగు రాష్ట్రాలకూ ‘సర్’ వచ్చేస్తున్నారు..

ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…

26 minutes ago

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

2 hours ago

అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…

2 hours ago

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు!

​విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…

3 hours ago

అన్వేషణ హద్దు దాటేస్తుందా?

నా అన్వేష్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది...! యూట్యూబర్‌గా అందరికీ సుపరిచితమే.…

3 hours ago

హ‌రీష్‌రావు కంచుకోట‌ను క‌విత బ‌ద్ద‌లు కొట్ట‌గ‌లదా?

బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి.. అంత‌కుమించి మాట‌ల మాంత్రీకుడు.. త‌న్నీరు హ‌రీష్ రావు గురించి చెప్ప‌డానికి ఇవి చాలు.…

3 hours ago