Movie News

ఎఫ్‌-3లో ఇంకో హీరోయిన్


టాలీవుడ్ కామెడీ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘ఎఫ్-2’. రెండేళ్ల కిందట సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం వినయ విధేయ రామ, యన్.టి.ఆర్-కథానాయకుడు లాంటి భారీ చిత్రాలను వెనక్కి నెట్టి ఎంత పెద్ద విజయాన్నందుకుందో తెలిసిందే. ఏకంగా రూ.80 కోట్ల షేర్‌తో ఆశ్చర్యపరిచిందీ చిత్రం. ఇప్పుడీ చిత్రానికి ‘ఎఫ్-3’ పేరుతో సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

‘ఎఫ్-2’లో ప్రధాన పాత్రలు పోషించిన విక్టరీ వెంకటేష్-తమన్నా, వరుణ్ తేజ్-మెహ్రీన్ ఇందులోనూ కొనసాగబోతున్నారు. ‘ఎఫ్-2’లో ఈ ఇద్దరు హీరోయిన్లు ఎంతగా గ్లామర్ విందు చేశారో తెలిసిందే. వీరికి తోడు అనసూయ భరద్వాజ్ ఒక పాట, కొన్ని సన్నివేశాల్లో మెరిసింది. సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేసింది. ఇప్పుడు ‘ఎఫ్-3’లోనూ ఇలాగే అడిషనల్ గ్లామర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ చిత్రం కోసం అతను మరో హీరోయిన్ని తీసుకున్నాడు.

తెలుగులో నందమూరి బాలకృష్ణ చిత్రాలు ‘లెజెండ్’, ‘రూలర్’లతో పాటు ‘పండగ చేస్కో’ లాంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ‘ఎఫ్-3’లో మూడో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో ఫుల్ గ్లామరస్ రోల్ అని అంటున్నారు. ‘ఎఫ్-3’ లాంటి క్రేజీ సినిమాలో నటించడానికి ప్రస్తుతం ఫాంలో ఉన్న ఏ హీరోయిన్ అయినా సై అంటుంది. అలాంటిది ‘రూలర్’ తర్వాత కనిపించకుండా పోయిన సోనాల్‌ను ఈ సినిమా కోసం తీసుకోవడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఆమెకే ఈ రోల్ ఇవ్వడానికి కారణమేంటో తెర మీదే చూసి తెలుసుకోవాలి.

ఇప్పటికే 60 శాతానికి పైగా ‘ఎఫ్-3’ చిత్రీకరణ పూర్తయింది. మే-జూన్ మధ్య సినిమా షూటింగ్ అంతా అవగొట్టాలని చూస్తున్నారు. ఆగస్టు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ‘ఎఫ్-2’ను నిర్మించిన దిల్ రాజు నిర్మాణంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కబోతోంది.

This post was last modified on March 27, 2021 12:21 pm

Share
Show comments

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

8 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

9 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

10 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

11 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

11 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

13 hours ago