టాలీవుడ్ కామెడీ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ‘ఎఫ్-2’. రెండేళ్ల కిందట సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం వినయ విధేయ రామ, యన్.టి.ఆర్-కథానాయకుడు లాంటి భారీ చిత్రాలను వెనక్కి నెట్టి ఎంత పెద్ద విజయాన్నందుకుందో తెలిసిందే. ఏకంగా రూ.80 కోట్ల షేర్తో ఆశ్చర్యపరిచిందీ చిత్రం. ఇప్పుడీ చిత్రానికి ‘ఎఫ్-3’ పేరుతో సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
‘ఎఫ్-2’లో ప్రధాన పాత్రలు పోషించిన విక్టరీ వెంకటేష్-తమన్నా, వరుణ్ తేజ్-మెహ్రీన్ ఇందులోనూ కొనసాగబోతున్నారు. ‘ఎఫ్-2’లో ఈ ఇద్దరు హీరోయిన్లు ఎంతగా గ్లామర్ విందు చేశారో తెలిసిందే. వీరికి తోడు అనసూయ భరద్వాజ్ ఒక పాట, కొన్ని సన్నివేశాల్లో మెరిసింది. సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేసింది. ఇప్పుడు ‘ఎఫ్-3’లోనూ ఇలాగే అడిషనల్ గ్లామర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ చిత్రం కోసం అతను మరో హీరోయిన్ని తీసుకున్నాడు.
తెలుగులో నందమూరి బాలకృష్ణ చిత్రాలు ‘లెజెండ్’, ‘రూలర్’లతో పాటు ‘పండగ చేస్కో’ లాంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ‘ఎఫ్-3’లో మూడో హీరోయిన్గా నటిస్తోంది. ఆమెతో ఫుల్ గ్లామరస్ రోల్ అని అంటున్నారు. ‘ఎఫ్-3’ లాంటి క్రేజీ సినిమాలో నటించడానికి ప్రస్తుతం ఫాంలో ఉన్న ఏ హీరోయిన్ అయినా సై అంటుంది. అలాంటిది ‘రూలర్’ తర్వాత కనిపించకుండా పోయిన సోనాల్ను ఈ సినిమా కోసం తీసుకోవడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఆమెకే ఈ రోల్ ఇవ్వడానికి కారణమేంటో తెర మీదే చూసి తెలుసుకోవాలి.
ఇప్పటికే 60 శాతానికి పైగా ‘ఎఫ్-3’ చిత్రీకరణ పూర్తయింది. మే-జూన్ మధ్య సినిమా షూటింగ్ అంతా అవగొట్టాలని చూస్తున్నారు. ఆగస్టు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ‘ఎఫ్-2’ను నిర్మించిన దిల్ రాజు నిర్మాణంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కబోతోంది.
This post was last modified on March 27, 2021 12:21 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…