వెబ్ సిరీస్ల విషయంలో తెలుగోళ్ల పర్సప్షన్ మారలేదని.. ఇంకా ఆ ఒరవడిని అందిపుచ్చుకోలేదని అనిపిస్తుంది మన వాళ్లు తీసే సిరీస్ల కంటెంట్ చూస్తే. హాలీవుడ్, బాలీవుడ్ వాళ్లు తీసే వాటితో పోలిస్తే ఇంకా మన సిరీస్లు ఒక స్థాయిని అందుకోలేదు. గాడ్స్ ఆఫ్ ధర్మపురి, లాక్డ్ లాంటి ఒకట్రెండు సిరీస్లు ఓకే అనిపించినా.. ఇంకా క్వాలిటీ, రిచ్నెస్ పెరగాల్సి ఉంది.
ఐతే ఈ దిశగా అడుగులైతే పడుతున్నాయని అనిపిస్తోంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన లూజర్ ట్రైలర్ చూస్తే ఇందులో విషయం ఉన్నట్లే ఉంది. జీ5 ఒరిజినల్స్లో భాగంగా ఈ సిరీస్ తెరకెక్కింది. అభిలాష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యంతో లూజర్ తెరకెక్కడం విశేషం. ఈ నెల 15న దీని ప్రిమియర్స్ పడనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు.
రైఫిల్ షూటింగ్లో చిన్న వయసులోనే జాతీయ స్థాయికి ఎదిగిన ఓ షూటర్.. అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు చాలా దగ్గరా వెళ్లిన ఓ ఆటగాడు.. బ్యాడ్మింటన్లో అంతర్జాతీయ స్థాయిలో మెరిసే ప్రతిభ ఉన్న ఓ అమ్మాయి.. ఈ ముగ్గురి జీవితాల నేపథ్యంలో సాగే కథ లూజర్. వేర్వేరు కాలాల్లో వీరి కథలు నడుస్తాయి. ఐతే ఈ ముగ్గురి ఆశలకు ఒక దశలో బ్రేక్ పడుతుంది. అడ్డంకులు ఎదురవుతాయి.
ఐతే ఒక దశలో నిరాశ నిస్పృహల్లో మునిగిపోయి ఈ ముగ్గురూ అడ్డంకుల్ని దాటుకుని ఎలా తమ ప్రతిభను చాటుకున్నారు. విజేతలుగా నిలిచారు అనే కథతో లూజర్ సిరీస్ తెరకెక్కింది. ట్రైలర్ చూస్తే కథాంశం, ప్రెజెంటేషన్ సినిమా స్థాయికి తక్కువ కాని విధంగా కనిపిస్తున్నాయి. ప్రియదర్శితో పాటు శశాంక్, కల్పిక, షాయాజి షిండే ఇందులో కీలక పాత్రలు పోషించారు. మల్లేశం సినిమాతో సీరియస్ పాత్రల్లోనూ అదరగొట్టగలనని చాటిన ప్రియదర్శి.. లూజర్తోనూ సత్తా చాటుతాడేమో చూడాలి.
This post was last modified on May 10, 2020 5:50 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…