పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ను పూర్తి చేశాక ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ‘హరి హర వీరమల్లు’ కాగా.. ఇంకోటి మలయాళ బ్లాక్బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్. ఇటీవలే మీడియాను కలిసి ఈ చిత్ర నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ.. ఈ సినిమా చిత్రీకరణ 40 శాతం పూర్తయినట్లు వెల్లడించాడు. ఇంత షూటింగ్ అయినా ఇప్పటికీ పవన్ సరసన నటించే హీరోయిన్ మాత్రం ఇంకా ఖరారవ్వలేదు.
ఒరిజినల్లో ఓ కొత్తమ్మాయి నటించిన ఈ కీలక పాత్రకు ముందు సాయిపల్లవిని ఎంచుకున్నారు. కానీ ఆమె డేట్లు సర్దుబాటు చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇందులో రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నట్లుగా వంశీ ధ్రువీకరించాడు కానీ.. పవన్కు జోడీగా చేయాల్సిన అమ్మాయి ఇంకా ఖరారవ్వలేదని స్పష్టం చేశాడు. దీంతో సాయిపల్లవి ఈ సినిమా నుంచి తప్పుకున్న సంగతి నిజమే అని రూఢి అయింది.
ఐతే త్వరలోనే ఈ పాత్రకు సంబంధించి చిత్రీకరణ మొదలుపెట్టాల్సి ఉన్న నేపథ్యంలో ఇక ఆలస్యం చేయడానికి వీల్లేకపోయింది. సాధ్యమైనంత త్వరగా ఆ పాత్రను పోషించే నటిని ఖరారు చేయాల్సిన స్థితిలో నిత్యా మీనన్ను ఓకే చేసినట్లు తాజా సమాచారం. బాగా పెర్ఫామ్ చేయగల నటే ఈ పాత్రను చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిత్యా మీనన్ పర్ఫెక్ట్ అని డిసైడయ్యారట.
ఐతే ఇప్పటిదాకా తెలుగులో నాని, నితిన్ లాంటి యువ కథానాయకులతోనే నటించిన నిత్య.. పవన్ సరసన నటించడానికి అంగీకరించడం విశేషమే. ఆమెకు ముందులా తెలుగులో క్రేజ్ లేదు. అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీనియర్ హీరో అయినా సరే.. పవన్ సరసన ఛాన్స్ రావడమంటే గొప్ప విషయమే. పైగా నిత్య కోరుకునేట్లే ఇది పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ కావడంతో ఆమె తిరస్కరించలేకపోయినట్లుంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడన్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 25, 2021 6:00 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…