ఏ ముహూర్తాన బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించిందో.. ఇక అప్పట్నుంచి ప్రతి ఒక్కరికీ ‘పాన్ ఇండియా’ పిచ్చి పట్టుకుంది. ఆ సినిమా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి.. దాని హీరో సహా అందులో భాగమైన అందరికీ పాన్ ఇండియా గుర్తింపు రావడంతో తామూ అలా వెలిగిపోవాలని అందరూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అందులో విజయవంతమవుతున్న వాళ్లు పెద్దగా కనిపించడం లేదు.
‘బాహుబలి’ తర్వాత సౌత్ నుంచి ట్రై చేసిన పాన్ ఇండియా సినిమాలు చాలా వరకు దెబ్బ కొట్టాయి. పోస్ట్ బాహుబలి ఎరాలో ‘కేజీఎఫ్’ మినహాయిస్తే మరే సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో హిట్టవ్వలేదు. క్రేజ్ సంపాదించుకోలేదు. ‘కేజీఎఫ్’ కూడా అనుకోకుండా జనాలకు ఎక్కేసింది. రెండో భాగానికి అనూహ్యమైన క్రేజ్ వచ్చింది. కానీ మిగతా సినిమాలకు స్థానిక భాషల్లో మినహాయిస్తే బయట పెద్దగా గుర్తింపు రాలేదు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ మరో ‘బాహుబలి’ అవుతుందనుకున్నారు దాని మేకర్స్. కానీ ఆ చిత్రానికి తెలుగు రాష్ట్రాల అవతల ఆదరణ దక్కలేదు. ఇలా మరెన్నో సినిమాలు బోల్తా కొట్టాయి. తమ సినిమా స్థాయి ఏంటో చూసుకోకుండా ‘పాన్ ఇండియా’ రిలీజ్ అంటూ హంగామా చేస్తున్నారు కానీ.. వాటికి బౌండరీల అవతల కనీస స్థాయిలో కూడా గుర్తింపు రావట్లేదు. ఈ మధ్య మంచు విష్ణు సినిమా ‘మోసగాళ్ళు’కు కూడా పాన్ ఇండియా రిలీజ్ అంటూ హడావుడి చేశారు. కానీ ఆ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోనే జనాలు పట్టించుకోలేదు. ఇక బయట ఈ చిత్రం పరిస్థితి ఏంటో చెప్పాల్సిన పని లేదు.
విష్ణు తమ్ముడు మనోజ్ సైతం ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాకు పాన్ ఇండియా రిలీజ్ అంటున్నాడు. అతడి కెరీర్ ఏ స్థితిలో తెలిసిన వాళ్లకు ఇది విడ్డూరంగా అనిపిస్తోంది. అల్లు అర్జున్ మూవీ ‘పుష్ప’ సహా తెలుగులో ‘పాన్ ఇండియా’ బ్రాండుతో వస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ చిత్రాలకు తెలుగు రాష్ట్రాల అవతల ఏమాత్రం స్పందన వస్తుందన్నది సందేహమే. బుధవారం ‘అర్జున్ చక్రవర్తి’ అంటూ కొత్త సినిమా ఒకటి బయటికి వచ్చింది. చిన్న టీజర్ రిలీజ్ చేశారు. ఆ సినిమా హీరో ఎవరో కొత్తవాడు. మేకర్స్ అందరూ కొత్త వాళ్లే. ఇలాంటి సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ అంటూ ప్రకటించారు. ఇది చూశాక ‘పాన్ ఇండియా’ అంటే మరీ కామెడీ అయిపోతోందని.. తెలుగులో సినిమా తీసి, వేరే భాషల్లో అనువాదం చేస్తే అది పాన్ ఇండియా సినిమా ఎలా అయిపోతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…