టాలీవుడ్లో త్వరలోనే సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అరవింద సమేత తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. వచ్చే నెలలో ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నట్లు, నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా రకరకాల పేర్లను పరిశీలించి చివరికి రష్మిక మందన్నాను ఓకే చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పుడు మరింత స్పష్టత వచ్చేసింది. ఆదివారం రష్మిక.. తన టీంతో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ను కలిసింది. ఆయనతో సమావేశమై బయటికి వస్తుండగా.. కెమెరాలకు చిక్కింది రష్మిక.
ఎన్టీఆర్తో చేయబోయే సినిమాకు సంబంధించి కథా చర్చల కోసమే ఆమె త్రివిక్రమ్ను కలిసినట్లు తెలుస్తోంది. కథతో పాటు రష్మిక పాత్ర గురించి త్రివిక్రమ్ నరేషన్ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాబట్టి ఎన్టీఆర్ సరసన రష్మిక నటించబోతున్నట్లే. వీరి కలయికలో ఇదే తొలి సినిమా. త్రివిక్రమ్తోనూ రష్మిక చేయనున్న తొలి సినిమా ఇదే. మరోవైపు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి, ఒకప్పటి కథానాయిక అర్చనను ఓకే చేసినట్లు సమాచారం.
నిరీక్షణ, లేడీస్ టైలర్ లాంటి సినిమాలతో అర్చన కథానాయికగా బలమైన ముద్రే వేసింది. ఆమె జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకుంది. ఆమె సినిమాలు చేసి చాలా కాలం అయిపోయింది. నదియా, ఖుష్బు లాంటి సీనియర్ నటీమణులకు తన సినిమాల్లో ప్రత్యేక పాత్రలు ఇచ్చిన త్రివిక్రమ్.. ఇప్పుడు అర్చనకు అవకాశమిస్తుండటం విశేషం. త్రివిక్రమ్ మాతృ సంస్థ అనదగ్గ హారిక హాసిని క్రియేషన్స్ బేనర్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చనున్నాడు.
This post was last modified on March 22, 2021 6:29 pm
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…