టాలీవుడ్లో త్వరలోనే సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అరవింద సమేత తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. వచ్చే నెలలో ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నట్లు, నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా రకరకాల పేర్లను పరిశీలించి చివరికి రష్మిక మందన్నాను ఓకే చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పుడు మరింత స్పష్టత వచ్చేసింది. ఆదివారం రష్మిక.. తన టీంతో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ను కలిసింది. ఆయనతో సమావేశమై బయటికి వస్తుండగా.. కెమెరాలకు చిక్కింది రష్మిక.
ఎన్టీఆర్తో చేయబోయే సినిమాకు సంబంధించి కథా చర్చల కోసమే ఆమె త్రివిక్రమ్ను కలిసినట్లు తెలుస్తోంది. కథతో పాటు రష్మిక పాత్ర గురించి త్రివిక్రమ్ నరేషన్ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాబట్టి ఎన్టీఆర్ సరసన రష్మిక నటించబోతున్నట్లే. వీరి కలయికలో ఇదే తొలి సినిమా. త్రివిక్రమ్తోనూ రష్మిక చేయనున్న తొలి సినిమా ఇదే. మరోవైపు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి, ఒకప్పటి కథానాయిక అర్చనను ఓకే చేసినట్లు సమాచారం.
నిరీక్షణ, లేడీస్ టైలర్ లాంటి సినిమాలతో అర్చన కథానాయికగా బలమైన ముద్రే వేసింది. ఆమె జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకుంది. ఆమె సినిమాలు చేసి చాలా కాలం అయిపోయింది. నదియా, ఖుష్బు లాంటి సీనియర్ నటీమణులకు తన సినిమాల్లో ప్రత్యేక పాత్రలు ఇచ్చిన త్రివిక్రమ్.. ఇప్పుడు అర్చనకు అవకాశమిస్తుండటం విశేషం. త్రివిక్రమ్ మాతృ సంస్థ అనదగ్గ హారిక హాసిని క్రియేషన్స్ బేనర్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చనున్నాడు.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…