టాలీవుడ్లో త్వరలోనే సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అరవింద సమేత తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. వచ్చే నెలలో ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నట్లు, నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా రకరకాల పేర్లను పరిశీలించి చివరికి రష్మిక మందన్నాను ఓకే చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పుడు మరింత స్పష్టత వచ్చేసింది. ఆదివారం రష్మిక.. తన టీంతో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ను కలిసింది. ఆయనతో సమావేశమై బయటికి వస్తుండగా.. కెమెరాలకు చిక్కింది రష్మిక.
ఎన్టీఆర్తో చేయబోయే సినిమాకు సంబంధించి కథా చర్చల కోసమే ఆమె త్రివిక్రమ్ను కలిసినట్లు తెలుస్తోంది. కథతో పాటు రష్మిక పాత్ర గురించి త్రివిక్రమ్ నరేషన్ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాబట్టి ఎన్టీఆర్ సరసన రష్మిక నటించబోతున్నట్లే. వీరి కలయికలో ఇదే తొలి సినిమా. త్రివిక్రమ్తోనూ రష్మిక చేయనున్న తొలి సినిమా ఇదే. మరోవైపు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి, ఒకప్పటి కథానాయిక అర్చనను ఓకే చేసినట్లు సమాచారం.
నిరీక్షణ, లేడీస్ టైలర్ లాంటి సినిమాలతో అర్చన కథానాయికగా బలమైన ముద్రే వేసింది. ఆమె జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకుంది. ఆమె సినిమాలు చేసి చాలా కాలం అయిపోయింది. నదియా, ఖుష్బు లాంటి సీనియర్ నటీమణులకు తన సినిమాల్లో ప్రత్యేక పాత్రలు ఇచ్చిన త్రివిక్రమ్.. ఇప్పుడు అర్చనకు అవకాశమిస్తుండటం విశేషం. త్రివిక్రమ్ మాతృ సంస్థ అనదగ్గ హారిక హాసిని క్రియేషన్స్ బేనర్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చనున్నాడు.
This post was last modified on March 22, 2021 6:29 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…