టాలీవుడ్లో త్వరలోనే సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అరవింద సమేత తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. వచ్చే నెలలో ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నట్లు, నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా రకరకాల పేర్లను పరిశీలించి చివరికి రష్మిక మందన్నాను ఓకే చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పుడు మరింత స్పష్టత వచ్చేసింది. ఆదివారం రష్మిక.. తన టీంతో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ను కలిసింది. ఆయనతో సమావేశమై బయటికి వస్తుండగా.. కెమెరాలకు చిక్కింది రష్మిక.
ఎన్టీఆర్తో చేయబోయే సినిమాకు సంబంధించి కథా చర్చల కోసమే ఆమె త్రివిక్రమ్ను కలిసినట్లు తెలుస్తోంది. కథతో పాటు రష్మిక పాత్ర గురించి త్రివిక్రమ్ నరేషన్ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాబట్టి ఎన్టీఆర్ సరసన రష్మిక నటించబోతున్నట్లే. వీరి కలయికలో ఇదే తొలి సినిమా. త్రివిక్రమ్తోనూ రష్మిక చేయనున్న తొలి సినిమా ఇదే. మరోవైపు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి, ఒకప్పటి కథానాయిక అర్చనను ఓకే చేసినట్లు సమాచారం.
నిరీక్షణ, లేడీస్ టైలర్ లాంటి సినిమాలతో అర్చన కథానాయికగా బలమైన ముద్రే వేసింది. ఆమె జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకుంది. ఆమె సినిమాలు చేసి చాలా కాలం అయిపోయింది. నదియా, ఖుష్బు లాంటి సీనియర్ నటీమణులకు తన సినిమాల్లో ప్రత్యేక పాత్రలు ఇచ్చిన త్రివిక్రమ్.. ఇప్పుడు అర్చనకు అవకాశమిస్తుండటం విశేషం. త్రివిక్రమ్ మాతృ సంస్థ అనదగ్గ హారిక హాసిని క్రియేషన్స్ బేనర్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చనున్నాడు.
This post was last modified on March 22, 2021 6:29 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…