Movie News

ట్రెండ్ మార్చ‌ని టాలీవుడ్ ప్రేక్ష‌కులు

కొత్త సినిమాలు వ‌ద్దు.. పాత సినిమానే ముద్దు. లాక్ డౌన్ బ్రేక్ త‌ర్వాత టాలీవుడ్ ప్రేక్ష‌కులు చూపిస్తున్న కొత్త ట్రెండ్ ఇది. వారం వారం కొత్త సినిమాలు వస్తున్న‌ప్ప‌టికీ.. వాటి కంటే ముందు నుంచి ఆడుతున్న పాత సినిమాకు ప‌ట్టం క‌ట్టడం సంక్రాంతి నుంచి చూస్తూనే ఉన్నాం. ఆ పండుగ టైంలో క్రాక్ సినిమాను అలాగే మూడు నాలుగు వారాల పాటు నెత్తిన పెట్టుకున్నారు. ఆపై ఫిబ్ర‌వ‌రిలో వ‌చ్చిన ఉప్పెన సినిమా నెల రోజుల పాటు వారాల పాటు హ‌వా సాగించింది.

ఇక గ‌త వారం వ‌చ్చిన జాతిర‌త్నాలు కూడా ఈ ట్రెండ్‌ను కొన‌సాగిస్తోంది. ఈ వారం వ‌చ్చిన కొత్త సినిమాలు దాని ముందు నిలిచే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. ఈ శుక్ర‌వారం చావు క‌బురు చ‌ల్ల‌గా, మోస‌గాళ్ళు, శ‌శి చిత్రాలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. వీటిలో దేనికీ అంత మంచి టాక్ రాలేదు. వీటికి ప్రి రిలీజ్ బ‌జ్ కూడా మ‌రీ ఎక్కువ‌గా లేదు. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. శుక్ర‌వారం మాత్ర‌మే ఈ మూడు చిత్రాలు కొంత ప్ర‌భావం చూపించాయి. అయినా స‌రే.. ఆ రోజు జాతిర‌త్నాలుదే పైచేయి అయింది.

శ‌నివారం అయితే ఈ సినిమా ధాటికి మిగ‌తా మూడు నిల‌వ‌లేక‌పోయాయి. హైద‌రాబాద్‌లో సినిమా హ‌బ్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో శ‌నివారం పాత సినిమా అయిన జాతిర‌త్నాలు రోజు మొత్తంలో రూ.4.2 ల‌క్ష‌ల గ్రాస్ క‌లెక్ట్ చేస్తే.. కొత్త సినిమా అయిన చావు క‌బురు చ‌ల్ల‌గా రూ.1.57 ల‌క్ష‌ల గ్రాస్‌తో రెండో స్థానంలో నిలిచింది. మిగ‌తా రెండు కొత్త చిత్రాలు మోస‌గాళ్లు, శ‌శి వ‌రుస‌గా రూ.52 వేలు, రూ.38 వేల గ్రాస్‌కు ప‌రిమితం అయ్యాయి. మూడు కొత్త చిత్రాల వ‌సూళ్లు క‌లిపినా.. జాతిర‌త్నాలు క‌లెక్ష‌న్ల కంటే త‌క్కువ‌గా ఉండ‌టాన్ని బ‌ట్టి ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.

Satya

Recent Posts

కొత్త ‘ఈవిల్ డెడ్’ అంత భయపెట్టిందా

హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…

12 minutes ago

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

45 minutes ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

1 hour ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

1 hour ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

2 hours ago

మళ్ళీ మౌనవ్రతం చేస్తున్న స్లమ్ డాగ్

పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…

3 hours ago