Movie News

ట్రెండ్ మార్చ‌ని టాలీవుడ్ ప్రేక్ష‌కులు

కొత్త సినిమాలు వ‌ద్దు.. పాత సినిమానే ముద్దు. లాక్ డౌన్ బ్రేక్ త‌ర్వాత టాలీవుడ్ ప్రేక్ష‌కులు చూపిస్తున్న కొత్త ట్రెండ్ ఇది. వారం వారం కొత్త సినిమాలు వస్తున్న‌ప్ప‌టికీ.. వాటి కంటే ముందు నుంచి ఆడుతున్న పాత సినిమాకు ప‌ట్టం క‌ట్టడం సంక్రాంతి నుంచి చూస్తూనే ఉన్నాం. ఆ పండుగ టైంలో క్రాక్ సినిమాను అలాగే మూడు నాలుగు వారాల పాటు నెత్తిన పెట్టుకున్నారు. ఆపై ఫిబ్ర‌వ‌రిలో వ‌చ్చిన ఉప్పెన సినిమా నెల రోజుల పాటు వారాల పాటు హ‌వా సాగించింది.

ఇక గ‌త వారం వ‌చ్చిన జాతిర‌త్నాలు కూడా ఈ ట్రెండ్‌ను కొన‌సాగిస్తోంది. ఈ వారం వ‌చ్చిన కొత్త సినిమాలు దాని ముందు నిలిచే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. ఈ శుక్ర‌వారం చావు క‌బురు చ‌ల్ల‌గా, మోస‌గాళ్ళు, శ‌శి చిత్రాలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. వీటిలో దేనికీ అంత మంచి టాక్ రాలేదు. వీటికి ప్రి రిలీజ్ బ‌జ్ కూడా మ‌రీ ఎక్కువ‌గా లేదు. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. శుక్ర‌వారం మాత్ర‌మే ఈ మూడు చిత్రాలు కొంత ప్ర‌భావం చూపించాయి. అయినా స‌రే.. ఆ రోజు జాతిర‌త్నాలుదే పైచేయి అయింది.

శ‌నివారం అయితే ఈ సినిమా ధాటికి మిగ‌తా మూడు నిల‌వ‌లేక‌పోయాయి. హైద‌రాబాద్‌లో సినిమా హ‌బ్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో శ‌నివారం పాత సినిమా అయిన జాతిర‌త్నాలు రోజు మొత్తంలో రూ.4.2 ల‌క్ష‌ల గ్రాస్ క‌లెక్ట్ చేస్తే.. కొత్త సినిమా అయిన చావు క‌బురు చ‌ల్ల‌గా రూ.1.57 ల‌క్ష‌ల గ్రాస్‌తో రెండో స్థానంలో నిలిచింది. మిగ‌తా రెండు కొత్త చిత్రాలు మోస‌గాళ్లు, శ‌శి వ‌రుస‌గా రూ.52 వేలు, రూ.38 వేల గ్రాస్‌కు ప‌రిమితం అయ్యాయి. మూడు కొత్త చిత్రాల వ‌సూళ్లు క‌లిపినా.. జాతిర‌త్నాలు క‌లెక్ష‌న్ల కంటే త‌క్కువ‌గా ఉండ‌టాన్ని బ‌ట్టి ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.

This post was last modified on March 21, 2021 1:55 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

53 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago