కొత్త సినిమాలు వద్దు.. పాత సినిమానే ముద్దు. లాక్ డౌన్ బ్రేక్ తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులు చూపిస్తున్న కొత్త ట్రెండ్ ఇది. వారం వారం కొత్త సినిమాలు వస్తున్నప్పటికీ.. వాటి కంటే ముందు నుంచి ఆడుతున్న పాత సినిమాకు పట్టం కట్టడం సంక్రాంతి నుంచి చూస్తూనే ఉన్నాం. ఆ పండుగ టైంలో క్రాక్ సినిమాను అలాగే మూడు నాలుగు వారాల పాటు నెత్తిన పెట్టుకున్నారు. ఆపై ఫిబ్రవరిలో వచ్చిన ఉప్పెన సినిమా నెల రోజుల పాటు వారాల పాటు హవా సాగించింది.
ఇక గత వారం వచ్చిన జాతిరత్నాలు కూడా ఈ ట్రెండ్ను కొనసాగిస్తోంది. ఈ వారం వచ్చిన కొత్త సినిమాలు దాని ముందు నిలిచే పరిస్థితి కనిపించడంలేదు. ఈ శుక్రవారం చావు కబురు చల్లగా, మోసగాళ్ళు, శశి చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. వీటిలో దేనికీ అంత మంచి టాక్ రాలేదు. వీటికి ప్రి రిలీజ్ బజ్ కూడా మరీ ఎక్కువగా లేదు. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. శుక్రవారం మాత్రమే ఈ మూడు చిత్రాలు కొంత ప్రభావం చూపించాయి. అయినా సరే.. ఆ రోజు జాతిరత్నాలుదే పైచేయి అయింది.
శనివారం అయితే ఈ సినిమా ధాటికి మిగతా మూడు నిలవలేకపోయాయి. హైదరాబాద్లో సినిమా హబ్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో శనివారం పాత సినిమా అయిన జాతిరత్నాలు రోజు మొత్తంలో రూ.4.2 లక్షల గ్రాస్ కలెక్ట్ చేస్తే.. కొత్త సినిమా అయిన చావు కబురు చల్లగా రూ.1.57 లక్షల గ్రాస్తో రెండో స్థానంలో నిలిచింది. మిగతా రెండు కొత్త చిత్రాలు మోసగాళ్లు, శశి వరుసగా రూ.52 వేలు, రూ.38 వేల గ్రాస్కు పరిమితం అయ్యాయి. మూడు కొత్త చిత్రాల వసూళ్లు కలిపినా.. జాతిరత్నాలు కలెక్షన్ల కంటే తక్కువగా ఉండటాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on March 21, 2021 1:55 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…