తన కెరీర్ను పక్కా ప్లానింగ్తో ముందుకు తీసుకెళ్తున్నాడు యువ కథానాయకుడు రామ్. ఒక పక్క లవ్ స్టోరీలు చేస్తున్నాడు.. ఇంకోపక్క కొత్త తరహా థ్రిల్లర్లు చేస్తున్నాడు.. మరోపక్క ఊర మాస్ సినిమలూ లైన్లో పెడుతున్నాడు. అన్నీ కూడా అతడికి బాగానే కలిసొస్తున్నాయి. రెండు వరుస ఫ్లాపుల తర్వాత ప్రేమకథా చిత్రం ‘హలో గురూ ప్రేమ కోసమే’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రామ్.. ఆ తర్వాత మాస్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సంక్రాంతికి ‘రెడ్’ లాంటి ప్రయోగాత్మక చిత్రంతోనూ అతను మంచి ఫలితమే అందుకున్నాడు. దీని తర్వాత తన కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా పర్ఫెక్ట్ ప్లానింగ్తో అడుగులు వేస్తున్నాడు రామ్. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు రాష్ట్రాల అవతల కూడా ఫాలోయింగ్ పెంచుకుంటున్న రామ్.. తాను పాన్ ఇండియా సినిమా చేయడానికి ఇదే సరైన సమయంగా భావించాడు.
తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామితో ఇటీవలే రామ్ ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉప్పెన సెన్సేషన్ కృతి శెట్టి ఇందులో కథానాయిక. ఈ సినిమా ఇప్పుడే మొదలు కాగా.. ఇంతలోనే రామ్ తన తర్వాతి సినిమాకు కూడా రంగం సిద్ధం చేశాడు. అతను స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం బోయపాటి.. నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత ఆయనతో సినిమా చేయడానికి ఏ పెద్ద హీరో కూడా ఖాళీగా లేడు. ఇది రామ్కు కలిసొచ్చింది.
లింగుస్వామితో చేసేది కొంచెం కొత్త తరహా కథ అట. వరుసగా రెండు డిఫరెంట్ సినిమాలు చేశాక మళ్లీ ‘ఇస్మార్ట్ శంకర్’ తరహాలో ఊర మాస్ సినిమా చేయాల్సిన అవసరం ఉందని రామ్ భావించి.. బోయపాటితో జట్టు కట్టనున్నట్లు సమాచారం. బోయపాటితో ‘జయ జానకి నాయక’తో పాటు బాలయ్య సినిమాను కూడా నిర్మిస్తున్న మిర్యాల రవీందర్ రెడ్డే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాడట.
This post was last modified on March 21, 2021 8:41 am
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…