తన కెరీర్ను పక్కా ప్లానింగ్తో ముందుకు తీసుకెళ్తున్నాడు యువ కథానాయకుడు రామ్. ఒక పక్క లవ్ స్టోరీలు చేస్తున్నాడు.. ఇంకోపక్క కొత్త తరహా థ్రిల్లర్లు చేస్తున్నాడు.. మరోపక్క ఊర మాస్ సినిమలూ లైన్లో పెడుతున్నాడు. అన్నీ కూడా అతడికి బాగానే కలిసొస్తున్నాయి. రెండు వరుస ఫ్లాపుల తర్వాత ప్రేమకథా చిత్రం ‘హలో గురూ ప్రేమ కోసమే’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రామ్.. ఆ తర్వాత మాస్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సంక్రాంతికి ‘రెడ్’ లాంటి ప్రయోగాత్మక చిత్రంతోనూ అతను మంచి ఫలితమే అందుకున్నాడు. దీని తర్వాత తన కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా పర్ఫెక్ట్ ప్లానింగ్తో అడుగులు వేస్తున్నాడు రామ్. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు రాష్ట్రాల అవతల కూడా ఫాలోయింగ్ పెంచుకుంటున్న రామ్.. తాను పాన్ ఇండియా సినిమా చేయడానికి ఇదే సరైన సమయంగా భావించాడు.
తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామితో ఇటీవలే రామ్ ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉప్పెన సెన్సేషన్ కృతి శెట్టి ఇందులో కథానాయిక. ఈ సినిమా ఇప్పుడే మొదలు కాగా.. ఇంతలోనే రామ్ తన తర్వాతి సినిమాకు కూడా రంగం సిద్ధం చేశాడు. అతను స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం బోయపాటి.. నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత ఆయనతో సినిమా చేయడానికి ఏ పెద్ద హీరో కూడా ఖాళీగా లేడు. ఇది రామ్కు కలిసొచ్చింది.
లింగుస్వామితో చేసేది కొంచెం కొత్త తరహా కథ అట. వరుసగా రెండు డిఫరెంట్ సినిమాలు చేశాక మళ్లీ ‘ఇస్మార్ట్ శంకర్’ తరహాలో ఊర మాస్ సినిమా చేయాల్సిన అవసరం ఉందని రామ్ భావించి.. బోయపాటితో జట్టు కట్టనున్నట్లు సమాచారం. బోయపాటితో ‘జయ జానకి నాయక’తో పాటు బాలయ్య సినిమాను కూడా నిర్మిస్తున్న మిర్యాల రవీందర్ రెడ్డే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాడట.
This post was last modified on March 21, 2021 8:41 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…