టాలీవుడ్లో కొత్త స్టార్ అవతరించాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హీరోగా తొలి హిట్ కొట్టిన నవీన్ పొలిశెట్టి.. ఇప్పుడు ‘జాతిరత్నాలు’తో బంపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో నవీన్ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా అదరగొట్టినప్పటికీ.. నవీన్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ వావ్ అనిపించాయి. ప్రేక్షకులు అతణ్ని ఎంతగా ఓన్ చేసుకుంటున్నారో ‘జాతిరత్నాలు’ థియేటర్లలో స్పందన చూస్తే అర్థమవుతుంది. తనపై తెలుగు ప్రేక్షకులు ఇంత ప్రేమ కురిపించేసరికి నవీన్ ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు.
‘జాతిరత్నాలు’ సక్సెస్ మీట్లో అతను మాట్లాడుతూ.. తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. తన తల్లిదండ్రులు ఒకప్పుడు వీకెండ్లో తనను తీసుకుని హైదరాబాద్ నెక్లస్ రోడ్, ట్యాంక్ బండ్ మీద తిప్పి.. ఆ తర్వాత ప్రసాద్ ఐమాక్స్కు వచ్చి సినిమా చూపించేవారని.. అదే తమ వీకెండ్ వినోదం అని.. ఇప్పుడు అదే ప్రసాద్ ఐమాక్స్లో తన సినిమా వారం రోజులుగా హౌస్ ఫుల్స్తో నడుస్తోందని.. ఇంతకంటే తనకు ఏం కావాలని నవీన్ అన్నాడు. తెలుగు ప్రేక్షకులు తమపై ఇంత ప్రేమ చూపిస్తారని ఊహించలేదని అతనన్నాడు.
ఈ సినిమా ఇలాంటి ఫలితాన్ని అందుకున్నాక తనకో ఆలోచన వచ్చిందని.. మామూలుగా కొత్త హీరోలు నటించిన సినిమా చూస్తూ ‘‘ఈ హీరో ఏ ఫ్యామిలీ’’ అని అడుగుతుంటారని.. తన విషయంలో అలా ఎవరైనా అడిగితే.. మీ ఫ్యామిలీ అని చెప్పండని ప్రేక్షకులకు అతను సూచించాడు. ‘జాతిరత్నాలు’ సినిమా ప్రమోషన్లలో, విజయోత్సవాల్లో తాను, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మాత్రమే కనిపిస్తున్నామని.. నిజానికి తెర వెనుక హీరోలు నిర్మాతలైన నాగ్ అశ్విన్, ప్రియాంక, స్వప్నలే అని.. వాళ్లే ఈ సినిమాకు సంబంధించి నిజమైన జాతి రత్నాలని నవీన్ అన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రమోషన్లలో పాల్గొన్న ‘జాతిరత్నాలు’ టీం ఇక అమెరికాకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేయబోతుండటం విశేషం.
This post was last modified on March 19, 2021 10:06 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…