టాలీవుడ్లో కొత్త స్టార్ అవతరించాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హీరోగా తొలి హిట్ కొట్టిన నవీన్ పొలిశెట్టి.. ఇప్పుడు ‘జాతిరత్నాలు’తో బంపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో నవీన్ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా అదరగొట్టినప్పటికీ.. నవీన్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ వావ్ అనిపించాయి. ప్రేక్షకులు అతణ్ని ఎంతగా ఓన్ చేసుకుంటున్నారో ‘జాతిరత్నాలు’ థియేటర్లలో స్పందన చూస్తే అర్థమవుతుంది. తనపై తెలుగు ప్రేక్షకులు ఇంత ప్రేమ కురిపించేసరికి నవీన్ ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు.
‘జాతిరత్నాలు’ సక్సెస్ మీట్లో అతను మాట్లాడుతూ.. తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. తన తల్లిదండ్రులు ఒకప్పుడు వీకెండ్లో తనను తీసుకుని హైదరాబాద్ నెక్లస్ రోడ్, ట్యాంక్ బండ్ మీద తిప్పి.. ఆ తర్వాత ప్రసాద్ ఐమాక్స్కు వచ్చి సినిమా చూపించేవారని.. అదే తమ వీకెండ్ వినోదం అని.. ఇప్పుడు అదే ప్రసాద్ ఐమాక్స్లో తన సినిమా వారం రోజులుగా హౌస్ ఫుల్స్తో నడుస్తోందని.. ఇంతకంటే తనకు ఏం కావాలని నవీన్ అన్నాడు. తెలుగు ప్రేక్షకులు తమపై ఇంత ప్రేమ చూపిస్తారని ఊహించలేదని అతనన్నాడు.
ఈ సినిమా ఇలాంటి ఫలితాన్ని అందుకున్నాక తనకో ఆలోచన వచ్చిందని.. మామూలుగా కొత్త హీరోలు నటించిన సినిమా చూస్తూ ‘‘ఈ హీరో ఏ ఫ్యామిలీ’’ అని అడుగుతుంటారని.. తన విషయంలో అలా ఎవరైనా అడిగితే.. మీ ఫ్యామిలీ అని చెప్పండని ప్రేక్షకులకు అతను సూచించాడు. ‘జాతిరత్నాలు’ సినిమా ప్రమోషన్లలో, విజయోత్సవాల్లో తాను, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మాత్రమే కనిపిస్తున్నామని.. నిజానికి తెర వెనుక హీరోలు నిర్మాతలైన నాగ్ అశ్విన్, ప్రియాంక, స్వప్నలే అని.. వాళ్లే ఈ సినిమాకు సంబంధించి నిజమైన జాతి రత్నాలని నవీన్ అన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రమోషన్లలో పాల్గొన్న ‘జాతిరత్నాలు’ టీం ఇక అమెరికాకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేయబోతుండటం విశేషం.
This post was last modified on March 19, 2021 10:06 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…