జాతిరత్నాలు లాంటి చిన్న సినిమా ‘బాహుబలి’ని బీట్ చేయడమేంటి… అది ఏ రకంగా అని సందేహాలు కలుగుతున్నాయా? కానీ ఇది నిజం. హైదరాబాద్లో సినిమా థియేటర్ల హబ్గా పేరున్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘జాతిరత్నాలు’ మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. ఈ క్రమంలో అది ‘బాహుబలి: ది కంక్లూజన్’ వసూళ్లను కూడా అధిగమించింది. ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల తర్వాతి స్థానంలో నిలిచింది.
2017 ఏప్రిల్లో రిలీజైన ‘బాహుబలి: ది కంక్లూజన్’ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ థియేటర్లో తొలి వారం రూ.36 లక్షల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. అది అప్పటికి ఆల్ టైం రికార్డు. ఈ రికార్డును గత ఏడాది సంక్రాంతి సినిమాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు అధిగమించాయి. అల వైకుంఠపురములో రూ.40.83 లక్షల గ్రాస్లో అగ్ర స్థానాన్ని సొంతం చేసుకుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ దానికి చేరువగా వచ్చింది. ఆ చిత్రం రూ.40.76 లక్షలు కొల్లగొట్టింది. ఇప్పుడు దేవి థియేటర్లో ఆడుతున్న ‘జాతిరత్నాలు’ తొలి వారం రోజుల్లో రూ.38.63 లక్షల గ్రాస్తో మూడో స్థానానికి చేరుకుంది. ‘బాహుబలి’ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. ఐదో స్థానంలో ‘మహర్షి’ చిత్రం ఉంది. ఆ సినిమా రూ.32 లక్షలు కలెక్ట్ చేసింది.
ఐతే ‘బాహుబలి-2’తో పోలిస్తే టాప్-5లో అన్ని సినిమాలకూ టికెట్ల రేట్లు పెరిగాయి. 50 శాతం ధరలు పెంచుకోవడంతో వీటి గ్రాస్ పెరిగింది. కాబట్టి నిజంగా చూస్తే ‘బాహుబలి-2’ను ఈ సినిమాలేవీ కొట్టినట్లు కాదు. ఐతే టాప్-5లో ఉన్న మిగతా చిత్రాలన్నీ పెద్ద పెద్ద హీరోలు నటించినవి. భారీ స్థాయివి. కానీ ‘జాతిరత్నాలు’ లాంటి చిన్న సినిమా వాటికి దీటుగా వసూళ్లు రాబట్టి టాప్-5లో నిలవడం అంటే మామూలు విషయం కాదు. ఆ రకంగా ‘జాతిరత్నాలు’ గ్రేట్ ఫీట్ సాధించినట్లే.
This post was last modified on March 18, 2021 3:20 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…