జాతిరత్నాలు లాంటి చిన్న సినిమా ‘బాహుబలి’ని బీట్ చేయడమేంటి… అది ఏ రకంగా అని సందేహాలు కలుగుతున్నాయా? కానీ ఇది నిజం. హైదరాబాద్లో సినిమా థియేటర్ల హబ్గా పేరున్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘జాతిరత్నాలు’ మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. ఈ క్రమంలో అది ‘బాహుబలి: ది కంక్లూజన్’ వసూళ్లను కూడా అధిగమించింది. ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల తర్వాతి స్థానంలో నిలిచింది.
2017 ఏప్రిల్లో రిలీజైన ‘బాహుబలి: ది కంక్లూజన్’ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ థియేటర్లో తొలి వారం రూ.36 లక్షల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. అది అప్పటికి ఆల్ టైం రికార్డు. ఈ రికార్డును గత ఏడాది సంక్రాంతి సినిమాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు అధిగమించాయి. అల వైకుంఠపురములో రూ.40.83 లక్షల గ్రాస్లో అగ్ర స్థానాన్ని సొంతం చేసుకుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ దానికి చేరువగా వచ్చింది. ఆ చిత్రం రూ.40.76 లక్షలు కొల్లగొట్టింది. ఇప్పుడు దేవి థియేటర్లో ఆడుతున్న ‘జాతిరత్నాలు’ తొలి వారం రోజుల్లో రూ.38.63 లక్షల గ్రాస్తో మూడో స్థానానికి చేరుకుంది. ‘బాహుబలి’ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. ఐదో స్థానంలో ‘మహర్షి’ చిత్రం ఉంది. ఆ సినిమా రూ.32 లక్షలు కలెక్ట్ చేసింది.
ఐతే ‘బాహుబలి-2’తో పోలిస్తే టాప్-5లో అన్ని సినిమాలకూ టికెట్ల రేట్లు పెరిగాయి. 50 శాతం ధరలు పెంచుకోవడంతో వీటి గ్రాస్ పెరిగింది. కాబట్టి నిజంగా చూస్తే ‘బాహుబలి-2’ను ఈ సినిమాలేవీ కొట్టినట్లు కాదు. ఐతే టాప్-5లో ఉన్న మిగతా చిత్రాలన్నీ పెద్ద పెద్ద హీరోలు నటించినవి. భారీ స్థాయివి. కానీ ‘జాతిరత్నాలు’ లాంటి చిన్న సినిమా వాటికి దీటుగా వసూళ్లు రాబట్టి టాప్-5లో నిలవడం అంటే మామూలు విషయం కాదు. ఆ రకంగా ‘జాతిరత్నాలు’ గ్రేట్ ఫీట్ సాధించినట్లే.
This post was last modified on March 18, 2021 3:20 pm
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…