మలయాళంలో చడీచప్పుడు లేకుండా మొదలై.. పెద్దగా హైప్ లేకుండా విడుదలై అద్భుతమైన స్పందన తెచ్చుకున్న సినిమా ‘దృశ్యం-2’. ఐదేళ్ల కిందట వివిధ భాషల్లో సంచలన విజయం సాధించిన ‘దృశ్యం’కు సీక్వెల్గా ఒరిజినల్ డైరెక్టర్ జీతు జోసెఫే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు. మోహన్ లాల్, మీనాలే సీక్వెల్లోనూ ప్రధాన పాత్రలు పోషించారు. అంతే కాక మోహన్ లాల్ కూతుళ్లుగా.. నెగెటివ్ రోల్ చేసిన వరుణ్ తల్లిదండ్రులుగా ‘దృశ్యం’లో కనిపించిన వాళ్లే ఇందులోనూ నటించారు.
సినిమాలో ఆరేళ్ల తర్వాత పరిస్థితులకు తగ్గట్లు కథ నడుస్తుంది. నటీనటులను కూడా వాళ్లనే తీసుకోవడం సీక్వెల్ అన్న మాటకు సరైన అర్థంగా నిలిచింది ‘దృశ్యం-2’. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోనూ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో కూడా సాధ్యమైనంతగా ‘దృశ్యం’లో నటించిన నటీనటులనే తీసుకున్నారు. ‘దృశ్యం-2’ లొకేషన్లో తీసిన ఒక ఫొటోను బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది.
వెంకీ సరసన మీనా నటిస్తుండగా.. వీరి కూతుళ్లుగా ‘దృశ్యం-’లో నటించిన కృతిక జయకుమార్, ఎస్తేర్ అనిల్లే కనిపించనున్నారు. ఫస్ట్ పార్ట్లో వరుణ్ తల్లిదండ్రులుగా నటించిన నదియా, నరేష్లు ఈ సినిమాలోనూ కొనసాగనున్నారు.
ఇక మలయాళంలో దృశ్యం-2లో హైలైట్గా నిలిచిన ఐజీ పాత్రలో అక్కడ మురళీ గోపి సటిల్ పెర్ఫామెన్స్తో అదరగొట్టగా.. తెలుగులో ఆ పాత్ర కోసం తమిళ నటుడు సంపత్ను తీసుకున్నారు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. కాబట్టి జీతు జోసెఫ్ మంచి ఛాయిస్ తీసుకున్నట్లే. వెంకీ-సంపత్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలైట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ ఆన్ లొకేషన్ ఫొటో ద్వారా సినిమాలో వెంకీ లుక్ కూడా బయటికి వచ్చేసింది. ఒరిజినల్లో మోహన్ లాల్ లాగే గడ్డంతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో కనిపించనున్నాడు వెంకీ. ఆయన నారప్ప తర్వాత గడ్డంతో కనిపించనున్న మరో సినిమా ఇది.
This post was last modified on March 17, 2021 6:58 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…