‘బాహుబలి: ది బిగినింగ్’ రిలీజైన కొంత కాలానికే.. దీని స్ఫూర్తితో ఒక వెబ్ సిరీస్ తీయాలని నెట్ ఫ్లిక్స్ వాళ్లు సన్నాహాలు చేయడం తెలిసిందే. ‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజయ్యాక ఆ ప్రయత్నాలు మరింత జోరందుకున్నాయి. టాలీవుడ్ దర్శకులు దేవా కట్టా, ప్రవీణ్ సత్తారుల దర్శకత్వంలో ఆ సిరీస్ తీసేందుకు రూ.100 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ఈ సిరీస్ కోసం పూర్వ నిర్మాణ పనులు జోరుగానే సాగాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
తీరా చూస్తే ఈ ఇద్దరు దర్శకుల వర్క్ నెట్ ఫ్లిక్స్ వాళ్లకు నచ్చలేదు. దీంతో ఆ సిరీస్ను పక్కన పెట్టేశారు. ప్రవీణ్, దేవా ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు. ఇక ఈ సిరీస్ అటకెక్కినట్లే అని అంతా అనుకున్నారు. కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ ప్రాజెక్టును విడిచి పెట్టడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు మరింత భారీగా ఈ సిరీస్ తీయడానికి రంగం సిద్ధం చేసినట్లు తాజా సమాచారం.
ముందు అనుకున్న బడ్జెట్ కంటే రెట్టింపు.. అంటే రూ.200 కోట్లతో ‘బాహుబలి’ సిరీస్ తీయడానికి నెట్ ఫ్లిక్స్ నిర్ణయించింది. రాజమౌళి పర్యవేక్షణలోనే ఈ సిరీస్ తెరకెక్కనుంది. బాలీవుడ్ నుంచి వేరే ఫిలిం మేకర్స్ను ఈ సిరీస్ కోసం ఎంచుకున్నారు. ‘బాహుబలి: ది బిగినింగ్’లో మనం చూసే కథ కంటే ముందు జరిగే వ్యవహారంతో ఈ సిరీస్ నడుస్తుందట. ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కనుంది.
హాలీవుడ్లో వచ్చిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు ఇండియన్ వెర్షన్ లాగా భారీ స్థాయిలో ఈ సిరీస్ తీయడానికి నెట్ ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోంది. తొమ్మిది ఎపిసోడ్లతో తొలి సీజన్ రిలీజ్ చేస్తారట. ఇండియాలో తెరకెక్కనున్న అతి పెద్ద వెబ్ సిరీస్ ఇదే అవుతుందని భావిస్తున్నారు. మరి ఈ సిరీస్ దర్శకులెవరు.. ప్రధాన పాత్రలు పోషించేది ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సిరీస్ గురించి అన్ని వివరాలు వెల్లడవుతాయి.
This post was last modified on March 17, 2021 2:11 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…