Movie News

200 కోట్లతో బాహుబలి కొత్త సిరీస్

‘బాహుబలి: ది బిగినింగ్’ రిలీజైన కొంత కాలానికే.. దీని స్ఫూర్తితో ఒక వెబ్ సిరీస్ తీయాలని నెట్ ఫ్లిక్స్ వాళ్లు సన్నాహాలు చేయడం తెలిసిందే. ‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజయ్యాక ఆ ప్రయత్నాలు మరింత జోరందుకున్నాయి. టాలీవుడ్ దర్శకులు దేవా కట్టా, ప్రవీణ్ సత్తారుల దర్శకత్వంలో ఆ సిరీస్ తీసేందుకు రూ.100 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ఈ సిరీస్ కోసం పూర్వ నిర్మాణ పనులు జోరుగానే సాగాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

తీరా చూస్తే ఈ ఇద్దరు దర్శకుల వర్క్ నెట్ ఫ్లిక్స్ వాళ్లకు నచ్చలేదు. దీంతో ఆ సిరీస్‌ను పక్కన పెట్టేశారు. ప్రవీణ్, దేవా ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు. ఇక ఈ సిరీస్ అటకెక్కినట్లే అని అంతా అనుకున్నారు. కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ ప్రాజెక్టును విడిచి పెట్టడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు మరింత భారీగా ఈ సిరీస్ తీయడానికి రంగం సిద్ధం చేసినట్లు తాజా సమాచారం.

ముందు అనుకున్న బడ్జెట్ కంటే రెట్టింపు.. అంటే రూ.200 కోట్లతో ‘బాహుబలి’ సిరీస్ తీయడానికి నెట్ ఫ్లిక్స్ నిర్ణయించింది. రాజమౌళి పర్యవేక్షణలోనే ఈ సిరీస్ తెరకెక్కనుంది. బాలీవుడ్ నుంచి వేరే ఫిలిం మేకర్స్‌ను ఈ సిరీస్ కోసం ఎంచుకున్నారు. ‘బాహుబలి: ది బిగినింగ్’లో మనం చూసే కథ కంటే ముందు జరిగే వ్యవహారంతో ఈ సిరీస్ నడుస్తుందట. ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కనుంది.

హాలీవుడ్లో వచ్చిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు ఇండియన్ వెర్షన్ లాగా భారీ స్థాయిలో ఈ సిరీస్ తీయడానికి నెట్ ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోంది. తొమ్మిది ఎపిసోడ్లతో తొలి సీజన్ రిలీజ్ చేస్తారట. ఇండియాలో తెరకెక్కనున్న అతి పెద్ద వెబ్ సిరీస్ ఇదే అవుతుందని భావిస్తున్నారు. మరి ఈ సిరీస్ దర్శకులెవరు.. ప్రధాన పాత్రలు పోషించేది ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సిరీస్ గురించి అన్ని వివరాలు వెల్లడవుతాయి.

This post was last modified on March 17, 2021 2:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ సందర్భంలో జగన్ ను డిస్ క్వాలిఫై చేయొచ్చు: రఘురామ

వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం…

10 minutes ago

పవన్ కళ్యాణ్ రిలీజుల చర్చ మళ్ళీ షురూ

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పదవి చేపట్టాక విడుదలవుతున్న మొదటి సినిమా ఇప్పటికైతే హరిహర వీరమల్లునే. ఇందులో అనుమానం…

41 minutes ago

మైత్రీ తో సినిమా తీయ్.. బాలీవుడ్‌లో పాగా వెయ్!

తెలుగు దర్శకులు హిందీలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. రాఘవేంద్రరావు, మురళీమోహనరావు లాంటి సీనియర్లు ఎప్పుడో బాలీవుడ్లో సినిమాలు తీశారు.…

1 hour ago

ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందంటూ విపక్షాలు ఆరోపిస్తున్న మాటల్లో వాస్తవం లేదని తేలిపోయింది. ఒక్క పోలవరం…

1 hour ago

ఆ ఎమ్మెల్యే… అధిష్ఠానాన్నే ధిక్కరిస్తున్నారే!

ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి…

2 hours ago

ఎమ్మెల్యే పుత్రుడు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు

ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…

3 hours ago