Movie News

అఖిల్ 5.. తగ్గేదే లేదు

అక్కినేని అఖిల్‌ తెరంగేట్రానికి ముందు ఎంత హడావుడి నడిచిందో తెలిసిందే. తెలుగులో ఒక సూపర్ స్టార్ అవతరించబోతున్నాడన్న ఫీలింగ్ కలిగింది అందరికీ. ఒక కొత్త హీరో సినిమాకు రూ.30 కోట్లకు పైగా బడ్జెట్, రూ.40 కోట్ల మేర బిజినెస్ అంటే మాటలు కాదు. ‘అఖిల్’ సినిమా అంచనాలను అందుకుని ఉంటే ఇప్పుడు అఖిల్ రేంజి వేరుగా ఉండేదేమో. ఆ సినిమా తుస్సుమనిపించగా.. ఆ తర్వాత అఖిల్ చేసిన రెండు సినిమాలు కూడా తీవ్ర నిరాశకే గుర్తు చేశాయి.

ఇప్పుడు అఖిల్ కొత్త చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మీద అల్లు అరవింద్ పది కోట్లకు మించి పెట్టలేదని అంటున్నారు. ఇదీ ప్రస్తుతం అఖిల్ స్థాయి. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ బాగా ఆడితే అఖిల్ మార్కెట్ పెరుగుతుందేమో చూడాలి. ఐతే అఖిల్ తర్వాతి సినిమా గురించి వినిపిస్తున్న ముచ్చట్లు మాత్రం గుండెలదిరిపోయేలా చేస్తున్నాయి.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఐదో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కొన్ని నెలలుగా ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇది భారీ బడ్జెట్ మూవీ అని ముందు నుంచి సంకేతాలు అందుతూనే ఉన్నాయి. కానీ బడ్జెట్ మరీ రూ.50 కోట్లు అంటూ మొదట్లో వచ్చిన వార్తలు రూమర్లనే అనుకున్నారంతా. కానీ నిజంగానే ఈ సినిమా మీద రూ.50 కోట్లు పెట్టేయబోతున్నారట. సురేందర్ రెడ్డి మీద భరోసాతో నిర్మాత అనిల్ సుంకర ఆ మేర ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా స్కేల్ ప్రకారం చూస్తే ఆటోమేటిగ్గా క్రేజ్ వస్తుందని.. అఖిల్ గత సినిమాల ప్రభావం దీనిపై ఏమీ ఉండదని, కచ్చితంగా ట్రేడ్‌ను ఈ సినిమా ఆకర్షిస్తుందని, అందుకే అనిల్ రూ.50 కోట్లు పెట్టేయడానికి వెనుకాడట్లేదని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ భారీగా ఉండేలా చూస్తున్నారట. రష్మిక మందన్నాను కథానాయిక పాత్ర కోసం, మోహన్ లాల్‌ను గెస్ట్ రోల్ కోసం అడుగుతున్నట్లు సమాచారం. టెక్నీషియన్లను కూడా పెద్ద పెద్ద వాళ్లనే తీసుకోబోతున్నారట. త్వరలోనే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on March 16, 2021 6:42 pm

Share
Show comments

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

5 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago