జాతిరత్నాలు.. జాతిరత్నాలు.. ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి చిన్న స్థాయి నటులను పెట్టి ‘పిట్టగోడ’ లాంటి ఫ్లాప్ సినిమా తీసిన అనుదీప్ కేవీ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు రేపుతోంది. రిలీజ్ ముంగిట అనూహ్యమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రానికి మంచి టాక్ కూడా రావడంతో వీకెండ్లో దున్నేసుకుంది.
తొలి రోజే వరల్డ్ వైడ్ దాదాపు ఐదు కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించిన ఈ చిన్న సినిమా.. ఆ తర్వాత మూడు రోజుల్లోనూ ఏమాత్రం తగ్గలేదు. ప్రతి రోజు అటు ఇటుగా రూ.5 కోట్ల మేర షేర్ రాబట్టింది. వీకెండ్ అయ్యేసరికి రూ.20 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్తో అబ్బురపరిచింది. ఈ సినిమా స్థాయికి నాలుగు రోజుల్లో రూ.20 కోట్ల షేర్ అంటే అసాధారణ విషయమే.
రవితేజ, నాని, రామ్, నాగచైతన్య, విజయ్ దేవరకొండ లాంటి మీడియం రేంజ్ స్టార్ల సినిమాలకు మంచి టాక్ వస్తే తప్ప ఈ స్థాయి వసూళ్లు రావు. ‘జాతిరత్నాలు’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు రూ.11 కోట్లు పలికాయి. అదే చాలా ఎక్కువ రేటు అనుకున్నారు. కానీ మూడో రోజుకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయి, లాభాల బాట పట్టింది. ఆదివారం భారీ వసూళ్లతో బయ్యర్లకు లాభాలు పంచింది. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా ఏడున్నర కోట్ల దాకా షేర్ రాబట్టడం విశేషం.
ఏపీలో సైతం ఈ చిత్రానికి అనూహ్యమైన వసూళ్లు వస్తున్నాయి. ఓవర్సీస్లో అయితే స్తబ్దుగా ఉన్న మార్కెట్కు మంచి జోష్ ఇచ్చింది ‘జాతిరత్నాలు’. వీకెండ్లో ఏకంగా 7 లక్షల డాలర్లకు పైగా కొల్లగొట్టి పోస్ట్ కరోనా ఎరాలో తొలి మిలియన్ డాలర్ ఇండియన్ మూవీ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. వీకెండ్ తర్వాత కూడా ‘జాతిరత్నాలు’కు మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తుండటం విశేషం.
This post was last modified on March 15, 2021 10:05 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…