జాతిరత్నాలు.. జాతిరత్నాలు.. ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి చిన్న స్థాయి నటులను పెట్టి ‘పిట్టగోడ’ లాంటి ఫ్లాప్ సినిమా తీసిన అనుదీప్ కేవీ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు రేపుతోంది. రిలీజ్ ముంగిట అనూహ్యమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రానికి మంచి టాక్ కూడా రావడంతో వీకెండ్లో దున్నేసుకుంది.
తొలి రోజే వరల్డ్ వైడ్ దాదాపు ఐదు కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించిన ఈ చిన్న సినిమా.. ఆ తర్వాత మూడు రోజుల్లోనూ ఏమాత్రం తగ్గలేదు. ప్రతి రోజు అటు ఇటుగా రూ.5 కోట్ల మేర షేర్ రాబట్టింది. వీకెండ్ అయ్యేసరికి రూ.20 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్తో అబ్బురపరిచింది. ఈ సినిమా స్థాయికి నాలుగు రోజుల్లో రూ.20 కోట్ల షేర్ అంటే అసాధారణ విషయమే.
రవితేజ, నాని, రామ్, నాగచైతన్య, విజయ్ దేవరకొండ లాంటి మీడియం రేంజ్ స్టార్ల సినిమాలకు మంచి టాక్ వస్తే తప్ప ఈ స్థాయి వసూళ్లు రావు. ‘జాతిరత్నాలు’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు రూ.11 కోట్లు పలికాయి. అదే చాలా ఎక్కువ రేటు అనుకున్నారు. కానీ మూడో రోజుకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయి, లాభాల బాట పట్టింది. ఆదివారం భారీ వసూళ్లతో బయ్యర్లకు లాభాలు పంచింది. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా ఏడున్నర కోట్ల దాకా షేర్ రాబట్టడం విశేషం.
ఏపీలో సైతం ఈ చిత్రానికి అనూహ్యమైన వసూళ్లు వస్తున్నాయి. ఓవర్సీస్లో అయితే స్తబ్దుగా ఉన్న మార్కెట్కు మంచి జోష్ ఇచ్చింది ‘జాతిరత్నాలు’. వీకెండ్లో ఏకంగా 7 లక్షల డాలర్లకు పైగా కొల్లగొట్టి పోస్ట్ కరోనా ఎరాలో తొలి మిలియన్ డాలర్ ఇండియన్ మూవీ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. వీకెండ్ తర్వాత కూడా ‘జాతిరత్నాలు’కు మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తుండటం విశేషం.
This post was last modified on March 15, 2021 10:05 pm
బీఆర్ ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత.. సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించిన…
ఆదిత్య ధర్.. ఇప్పుడు బాలీవుడ్లోనే కాక, దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశం అవుతున్న పేరిది. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లలో ఒకటిగా…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే స్పిరిట్, కల్కి-2 చిత్రాల నుంచి తప్పుకోవడం ఆ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి…
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణను తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్పీ బాలు తెలంగాణ…
ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమాన, రైలు రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. విజిబిలిటీ భారీగా తగ్గిపోవడంతో పలు విమానాలను దారి…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఫలితాలు నిన్న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల ఫలితాల…