అప్పుడప్పుడూ కొన్ని పాటలకు అనూహ్యమైన క్రేజ్ వస్తుంటుంది. అవి అంచనాలను మించి హిట్టయిపోతుంటాయి. సోషల్ మీడియాను హోరెత్తించేస్తుంటాయి. ఐతే పాట బయటికి వచ్చాక జనాలు విని మెచ్చాక అవి హిట్టవుతుంటాయి. కానీ ఒక పాట విడుదల కావడానికి ముందే అది సంచలనం రేపుతుందన్న అంచనాలు కలగడం.. ఆ సాంగ్ ఇలా రిలీజయిందో లేదో.. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్లో మోత మోగిపోవడం.. రికార్డుల మోత మోగిస్తూ దూసుకెళ్లడం అరుదైన విషయమే.
లవ్ స్టోరి సినిమాలోని సారంగ దరియా పాట విషయంలో ఇదే జరిగింది. ఈ పాటను రిలీజ్ చేయడానికి ముందే సాంగ్ ఆఫ్ ద ఇయర్ అంటూ చిత్ర బృందం ప్రమోషన్ మొదలుపెట్టింది. సాయిపల్లవి ముఖచిత్రంతో ఆ పాట పోస్టర్ వదిలినపుడే ఇది వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే తరహాలో పెద్ద హిట్టవుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. సాయిపల్లవి ఈ పాటలో మెస్మరైజ్ చేస్తుందనే అభిప్రాయం కలిగింది.
ఇక పాట రిలీజయ్యాక ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. తనపై పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో సాయిపల్లవి తనదైన హావభావాలతో, అదిరిపోయే స్టెప్లులతో వారెవా అనిపించింది. దీంతో సారంగ దరియా పాటకు యూట్యూబ్లో ఎదురే ఉండట్లేదు. మిలియన్లకు మిలియన్లు వ్యూస్, లక్షల్లో లైక్స్తో దూసుకెళ్లిపోతోంది. సామజవరగమన, బుట్టబొమ్మా లాంటి పాటల రికార్డులను ఇది బద్దలు కొట్టేసింది.
టాలీవుడ్లో అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న పాటగా సారంగ దరియా నిలిచింది. ఫిబ్రవరి 28న రిలీజైన ఈ పాట.. 15 రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. ఈ పాట 100 మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం కూడా లాంఛనమే. అది కూడా ఫాస్టెస్ట్ రికార్డే అవ్వడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి. ఏప్రిల్ 16న ఈ సినిమా రిలీజయ్యాక ఈ పాట రీచ్ ఇంకా పెరుగుతుందనే అంచనాలున్నాయి.
This post was last modified on March 15, 2021 8:27 am
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సింగిల్ థియేటర్ల రెవెన్యూ విషయమై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే.…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో…